Nandigam Suresh
-
అసెంబ్లీకి జగన్.. కూటమిలో వణుకు
-
చంద్రబాబుకు నందిగం సురేష్ అదిరిపోయే కౌంటర్
-
జగన్ మాస్ లీడర్.. చిల్లర రాజకీయాలు మానుకోవాలి
-
Big Question: మేమే కార్య కర్తలం.. మేమే సేవకులం.. పోలీసులు లేకపోతే భయపడతారనుకున్నారు కానీ
-
Nandigam Suresh: కూటమి ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదు
-
ప్రజల వ్యతిరేకతను జీర్ణించుకోలేక జగన్ పై కూటమి కుట్ర
-
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
-
జైలు నుండి విడుదల తర్వాత నందిగం సురేష్ ఫస్ట్ రియాక్షన్
-
జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్
-
మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్ను కూడా అరెస్టు చేశారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు. ఆధారాలు లేకుండా సురేష్పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు: నందిగం సురేష్ సతీమణి
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈ విషయమై ఆమె మంగళవారం(జనవరి14) మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు.దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. సురేష్కు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉండాల్సి వస్తోందని ఆయన భార్య బేబిలత పలు సందర్భాల్లో వాపోయారు. సురేష్ బెయిల్ విషయమై సుప్రీం కోర్టులో కూడా ఆమె పిటిషన్ వేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కహానీలు చెబితే కడుపు నిండుతుందా..? -
‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు’’
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్పై కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్ 24) గుంటూరు జైలులో సురేష్ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు... ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. -
నందిగం సురేష్ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.మాజీ ఎంపీ సురేష్ బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.మరోవైపు.. సురేష్ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. -
నేడు సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
నందిగం సురేష్ పై మరో అక్రమ కేసు..
-
ఒకే ఘటన.. రెండు కేసులు.. ఇది బాబు నీతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురి చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ సూత్రాలను, చట్టాలను కూడా ఉల్లంఘిస్తోంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మరేదీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్పై ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కేసులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఒకే కేసుకు సంబంధించి, ఒకే వ్యక్తి ఇచ్చిన రెండు ఫిర్యాదుల ఆధారంగా రెండు కేసులు నమోదు చేసి చట్టాలను సైతం బేఖాతరు చేసింది. 2023లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అప్పట్లోనే సురేష్పై తుళ్లూరు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అదే ఘటనపై అదే వ్యక్తి మళ్లీ ఫిర్యాదు చేస్తే.. ఏడాదిన్నర తర్వాత శుక్రవారం మరో కేసు నమోదు చేయడం కూటమి సర్కారు కక్ష సాధింపులకు పరాకాష్టే. ఇక్కడే చట్టాలను, రెజ్యూడికాటాను సర్కారు ఉల్లంఘించింది.2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని రైతులు, పేదలను, వారికి అండగా నిలిచిన సురేష్ను అక్రమ కేసులతో వేధించింది. ఆ తర్వాత బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ తమపై దాడి చేశాడంటూ 2023 మార్చి 31న విజయవాడకు చెందిన పనతల సురేష్ అనే వ్యక్తి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరోజు అమరావతి రాజధాని పర్యటనకు వచ్చిన తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అదే రోజున తుళ్లూరు పోలీసులు ఐపీసీ 294, 323, 427 రెడ్ విత్ 34 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మళ్లీ అదే పనతల సురేష్ అదే ఘటనపై ఏడాదిన్నర తర్వాత ఈ నెల 25న ఫిర్యాదు చేయగా.., నందిగం సురేష్పై ఐపీసీ 341, 143, 147, 307, 427 రెడ్విత్ 149 సెక్షన్లతో మరోసారి కేసు నమోదు చేశారు. ఇలా ఒకే ఘటనపై రెండు కేసులు (ఎఫ్ఐఆర్లు) నమోదు చేయడం ఒక తప్పు అయితే.. ఏకంగా హత్యా నేరం సెక్షన్లు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనం. ఇప్పటికే తనకు ఏ మాత్రం సంబంధం లేని రెండు కేసుల్లో నందిగం సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఓ పాత ఘటనలో మరోసారి కేసు పెట్టడమే కాకుండా, హత్యాయత్నం కేసు పెట్టడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల బలమైన ఆదేశాలే కారణమన్నది జగమెరిగిన సత్యం.రెజ్యూడికాటాను ఉల్లంఘించడమా..!వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు ప్రభుత్వం, పోలీసులు రెజ్యూడికాటాను ఉల్లంఘించడంపై న్యాయ నిపుణులు సైతం విస్తుపోతున్నారు. సహజ న్యాయ సూత్రాల్లో రెజ్యూడికాటా (లాటిన్ పదం) గురించి స్పష్టంగా విశదీకరిస్తున్నారు. ఒకే ఘటన, ఒకే వ్యక్తి ఫిర్యాదుపై ఒకటికి మించి కేసులు నమోదు చేయకుండా నిలువరించడమే రెజ్యూడికాటా. ఇలాంటి కేసులు సహజన్యాయానికి కూడా విరుద్ధమని ఇది స్పష్టం చేస్తుంది. ఒకే వివాదం లేదా ఒకే ఘటనలో అదే పార్టీల మధ్య వ్యాజ్యాలను పదే పదే విచారించడం వల్ల న్యాయ వ్యవస్థ సమయం కూడా వృథా అవుతుందనే దీనిని పరిగణనలోకి తెచ్చారు. ఏదైనా కేసులో తుది తీర్పు వెలువడకుండా అదే కోర్టులో అదే కేసుపై మరో వివాదాన్ని లేవనెత్తితే దాని పునఃపరిశీలనను తిరస్కరించేందుకు న్యాయస్థానం సైతం దీన్ని ఉపయోగిస్తుంది. ఈ రెజ్యూడికాటా క్రిమినల్ చట్టంలో డబుల్ జియోపార్డీ, నాన్ బిస్ అనే భావనను పోలి ఉంటుంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్లో ఒకే నేరానికి ఒకే విధమైన ప్రాసిక్యూషన్ను మాత్రమే ఉండేలా చేయడంతోపాటు రెండో విచారణకు సంబంధించిన చర్యలను నిరోధిస్తుందని న్యాయ నిపుణులు విశదీకరిస్తున్నారు. -
నందిగం సురేష్కు వైద్య పరీక్షలు
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. -
నందిగం సురేష్ అరెస్ట్ప ఏపీ ప్రభుత్వానికి SC కమిషన్ నోటీసులు
-
నందిగం సురేష్కు బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. -
విషపు కోరల్లో ఏపీ.. చంద్రబాబు కపట నాటకం అంబటి రాంబాబు ఫైర్
-
వంగలపూడి అనితకు గూబ పగిలే కౌంటర్
-
మా సునామీని తట్టుకోలేవు వైఎస్ జగన్ వార్నింగ్
-
వంగలపూడి అనితకు నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య సవాల్
సాక్షి, గుంటూరు: తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబిలత మండిపడ్డారు. ‘‘టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఒక్క ఆధారం చూపాలి. హోంమంత్రి అనిత తన పదవి కాపాడుకోవడం కోసం నా భర్తపై ఆరోపణలు చేస్తోంది’’ అని బేబిలత ధ్వజమెత్తారు.‘‘కృష్ణా నదికి వరద నా భర్తే తెచ్చాడా?. కృష్ణా నదిలొ కొట్టుకొచ్చిన బోట్లపై నా భర్త పేరు ఉందా?. అనిత తన బిడ్డలతో వస్తే.. నేను నా ఇద్దరు బిడ్డలతో వస్తా. తన బిడ్డల పై ప్రమాణం చేసి హోం మంత్రి అనిత నా భర్త పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ బేబీ లత సవాల్ విసిరారు. ఈ సవాల్ కి హోంమంత్రి అనిత సిద్ధమేనా?. మాజీ ఎంపీని వాడు వీడు అంటూ అనిత దిగజారి మాట్లాడుతుందంటూ బేబిలత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'! చంద్రబాబు సర్కార్ కుతంత్రం..కాగా, ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘బోట్ల’ కుట్రకు తెరలేపింది. వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. -
రేపు నందిగం సురేష్ ను పరామర్శించనున్న YS జగన్
-
11న గుంటూరుకు వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(సెప్టెంబర్ 11న) గుంటూరు వెళ్లనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసు తిరగదోడి మరీ.. చంద్రబాబు ప్రభుత్వం సురేష్పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తోంది. ఈ క్రమంలో చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా ఉల్లంఘిస్తోంది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే.. నందిగం సురేష్ను కూడా అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్మూడేళ్ల క్రితం(2021) నాటి సీఎం వైఎస్ జగన్పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణలు చేశారు. దీంతో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించిన కేసును అధికారంలోకి రాగానే.. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి తెరిచింది. ఉద్దేశపూర్వకంగా.. కొంతమంది దగ్గరి నుంచి సాక్ష్యం పేరుతో స్టేట్మెంట్లు తీసుకుంది. ఆపై కొందరు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. నేరం జరిగిన తర్వాత 60 –70 రోజులు దాటాక సాక్షిని విచారిస్తే చెల్లదు.. అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి మరీ నిందితుల జాబితాను పోలీసులు ఈ కేసులో సిద్ధం చేయడం గమనార్హం. ఈ కేసులో సురేష్ పేరును 80వ నిందితుడిగా చేర్చింది. -
వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్
నగరంపాలెం(గుంటూరు): టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అంటూ గుంటూరు, కృష్ణా జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అక్రమంగా అరెస్టయి, గుంటూరుజిల్లా కారాగారంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పేర్ని నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, గుంటూరు ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్, నందిగం సురేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం ములాఖత్లో విడివిడిగా కలిశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకి పంపిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలతో దొంగ సాక్ష్యాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం బాత్రూంలు, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీటీవీల ఫుటేజీ పోలీసుల వద్ద ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఆ పుటేజీల్లో ఎక్కడా లేని మాజీ ఎంపీ నందిగం సురే‹Ù, శ్రీనివాసరెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఈ కేసులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న 171 మందిని తీసుకువచ్చారని, వారెవరూ సీసీ టీవీ ఫుటేజీల్లో లేరని తెలిపారు. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కుంగదీయాలనే కూటమి పెద్దలు ఇలా చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేసినా తమ పార్టీకి ఏమీ కాదని, వారంతా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఓవైపు వరదలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా, అనేక మంది మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడంలేదని అన్నారు. కేవలం వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధించాలన్న తపనే ప్రభుత్వంలో కనపడుతోందన్నారు. ప్రభుత్వ పెద్దల తప్పుడు చర్యలే వరదలకు, భారీ నష్టానికి కారణమన్నారు. వరద బాధితులను కాపాడేందుకు, వారికి ఆహారాన్ని అందించేందుకు పోలీసులను పంపడంలేదని, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమే‹Ùను పట్టుకునేందుకు ఓ వంద మంది, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆచూకీ కోసం మరో 200 మంది పోలీసులను పంపించడం కూటమి ప్రభుత్వ నీచత్వానికి పరాకాష్ట అని అన్నారు. -
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
YSRCP నేతల అరెస్ట్.. వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
మాజీ ఎంపీ సురేష్ కు 14రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/మంగళగిరి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను బుధవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్లో అరెస్టుచేసిన పోలీసులు ఆయనను గురువారం ఉ.8.30 గంటలకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుచేసిన పోలీసులు స్టేషన్లో ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈయనతోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసులరెడ్డిని కూడా అరెస్టుచేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వీరిద్దరినీ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని, 2029లో చంద్రబాబుకు బుద్ధిచెప్పి తీరుతామన్నారు. కక్షతోనే తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని.. ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెబుతూ జై జగన్ అంటూ నినదించారు. అంతకుముందు.. స్టేషన్ వద్ద సురేష్ సతీమణి బేబీలత మాట్లాడుతూ.. తన భర్తపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. కేసులతో తమను భయపెట్టలేరని, 2019కు ముందు పొలాల దగ్థం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని అప్పట్లో తన భర్తపై టీడీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేదిలేదని స్పష్టంచేశారు. ఇక సురే‹Ùను అరెస్టుచేశారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల అమలు కమిటీ మాజీ చైర్మన్ నారాయణమూర్తి, గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాలవజ్ర బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కమ్మూరి కనకారావు తదితరులతో పాటు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు పలికారు. -
బాబుకు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి వస్తుంది..
-
నందిగం సురేష్ అరెస్ట్ పై సుదాకర్ బాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
‘నా భర్తకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత’
గుంటూరు, సాక్షి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్పై నందిగం సురేష్ భార్య బేబీ లలిత మీడియాతో మాట్లాడారు.‘నా భర్త మీద అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబుదే బాధ్యత. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నా భర్తకు అభిమానం. అదే చంద్రబాబుకు నచ్చలేదు. ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేసేంత తప్పులు చేశారంటే అందులో మొదట ఉండేది చంద్ర బాబే. సింగ్ నగర్ సాక్షిగా చంద్ర బాబుని అరెస్ట్ చెయ్యాలి’ అని అన్నారు.అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ అంతకు ముందు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు హైదరబాద్లో నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. డీఎస్పీ మల్లికార్జున రావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకుని గుంటూరు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్కు తరలించారు.స్టేషన్ గేట్లు మూసేసినందింగం సురేష్ తరలింపుపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నేతలు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. సురేష్ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ సురేష్ను కలవనీయంగా పోలీసులు స్టేషన్గేట్లను మూసివేశారు. గేటువద్దే వారిని అడ్డుకున్నారు. -
చంద్రబాబుకి నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ అరెస్ట్
-
వరద విపత్తులో బాబు బురద రాజకీయం..
-
టీడీపీ అక్రమ కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
సాక్షి, అమరావతి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ను ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లో అరెస్టు చేశారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. నందిగం సురేశ్ మియాపూర్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. వారిని ఏపీకి తరలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేశ్పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే.. వారిని గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘నా భర్తకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత’
గుంటూరు, సాక్షి: తన భర్తకు ఏమైనా హాని జరిగితే దానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మాజీ వైఎస్సార్సీపీ ఎంపీ నందిగామ సురేష్ భార్య బేబీలతా అన్నారు. కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన దగ్గరనుంచి చంద్రబాబు నాయుడు నందిగామ సురేష్ టార్గెట్ చేశారని తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘నందిగామ సురేష్పై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తున్నాం. విజయవాడలో వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైంది.విజయవాడ వరద వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి నందిగాం సురేష్ను అరెస్టు చేయడానికి రెడీ అయ్యారు. కోర్టులో జడ్జీ ఆదేశాలు ఇవ్వక ముందే పోలీసులు మా ఇంటిపైన వచ్చిపడ్డారు’ అని అన్నారు. -
ఏపీకి రావాలంటే భయమేస్తుంది.. ఢిల్లీలో వినిపిస్తున్న మాటే..
-
ఓట్లకోసం అంబేద్కర్ ను వాడుకుని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు
-
అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి సర్కార్ కూల్చే అవకాశముంది: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘భావితరాలకు దికూచ్చిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడటానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు విజయవాడలో అంబ్కేదర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే దాడి చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.ఇదే సమయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ..‘ప్రజల దృష్టిని మళ్లించడానికే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా కమిటీలు వేస్తామని కథలు చెబుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.మరోవైపు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. ప్రభుత్వమే ఈ దాడి చేయించిందనే అనుమానం కలుగుతోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారంటే వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయి అనేది అర్థం చేసుకోవచ్చు. విగ్రహం వద్ద వైఎస్ జగన్ పేరుని తొలగించవచ్చేమో కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరును తొలగించలేరు. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు దగ్గరలోనే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు?. సామాజిక న్యాయం కోసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. కూటమి నేతలకు సామాజిక న్యాయం అంటే పట్టదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇదే ఘటనపై తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం వద్ద దాడిని ఖండిస్తున్నాను. అన్ని జాతులకు ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆరాధ్యదైవంగా అంబేద్కర్ను భావిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దేశానికే ఆదర్శంగా ఉండాలని వైఎస్ జగన్ విజయవాడ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి అని కామెంట్స్ చేశారు. -
బాబు అరాచక పాలనపై నందిగం సురేష్ ఫైర్
-
కొలికపూడిపై నందిగం సురేష్ ఫైర్
-
ఎంపీ నందిగం సురేష్పై టీడీపీ దాడి
యద్దనపూడి: ప్రచారం నిమిత్తం వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై పర్చూరు నియోజకవర్గ పరిధిలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం దాడికి తెగబడ్డారు. ఎంపీ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి చెప్పులు విసిరారు. ఎంపీపైనా, వైఎస్సార్సీపీ శ్రేణులపైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. సుమారు గంటపాటు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మార్టూరు మండలం వలపర్ల ఎస్సీ కాలనీలో పర్యటన నిమిత్తం ఎంపీ నందిగం సురేష్ యద్దనపూడి నుంచి ర్యాలీగా మార్టూరు వైపు బయలుదేరారు. సాయంత్రం 3.45 సమయంలో చింతపల్లి చేరుకున్నారు. ఇంతలో టీడీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ ఎదురుపడింది. దీంతో ఎంపీ తన వాహనంతో పాటు వెనుక వచ్చే వాహనాలను సైతం పక్కకు ఆపారు. ఎంపీ వాహనాన్ని గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సమీపానికి రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. చెప్పులు తీసి ఎంపీ కారు అద్దాలపై కొడుతూ కారులో ఉన్న ఎంపీని బూతులు తిట్టారు. నీ అంతు చూస్తామంటూ రాయడానికి వీలుపడని పదజాలంతో దూషించారు. టీడీపీ కార్యకర్తలు ఎంపీ కారుపైకిఎక్కి కాళ్లతో కారు పైభాగాన్ని తన్నుతూ వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటివరకు సంయమనం పాటించిన ఎంపీ సురేష్ కారు దిగి కారుపై ఉన్న వారిని కిందకు దిగాలని కోరారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు జెండా కర్రలతో ఆయనపైన, అనుచరులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని పంపించి వేశారు. దాడి నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతపల్లిపాడు నుంచి యనమదల మీదగా యద్దనపూడి పోలీస్స్టేషన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. అనంతరం సీఐ సీతారామయ్య, ఎస్సై జీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు 15 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఎంపీపై దాడి విషయం తెలుసుకున్న వందలాది మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు స్టేషన్కు చేరుకున్నారు.ఓటమి భయంతోనే దాడులుపోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. ‘ఎన్నికల ప్రచారం కోసం చింతపల్లిపాడు మీదుగా మార్టూరు మండలం వలపర్ల వెళ్తుండగా టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. చింతపల్లిపాడులో టీడీపీ ర్యాలీ జరుగుతుండటతో నా కారును పక్కన పెట్టుకుని ఉండగా.. కొంతమంది టీడీపీ నాయకులు నా కారును మోటార్ సైకిళ్లతో చుట్టుముట్టారు. కాళ్లతో నా కారును ఎగిరెగిరి తన్నటం ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు నా కారును చుట్టుముట్టి నానాబూతులు తిట్టడం మొదలెట్టారు. దీంతో నేను కారు దిగి కారును ఎందుకు గుద్దుతున్నారని ప్రశ్నించగా.. వారిలో ఓ వ్యక్తి సీఎం జగన్ను దూషించటమే కాకుండా వాడు పోటీ చేయించేవాడు, నువ్వు పోటీ చేసేటంత వాడివా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించటం ప్రారంభించాడు. మరో నెల రోజులు ఆగండి. మా అమరావతి పవర్ ఏమిటో చూపిస్తా’మంటూ బూతులు తిట్టారు. వివాదాలు దేనికని భావించి పక్కకు తొలగండని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. దీనిని చూసి అక్కడకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు రావటంతో కొంత వెనక్కి తగ్గారు. నేను ఇంకొల్లు సీఐకి సమాచారమిచ్చాను. ఈలోగా కొందరు మహిళలు నాకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని చెప్పారు. ‘టీడీపీ నాయకులు ఆడవాళ్లు అని కూడా చూడకుండా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై గతంలో కూడా ఎస్సీ కాలనీ వాసులు తమపై రోజురోజుకూ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఘటనతో టీడీపీ అరాచకాలను ప్రత్యక్షంగా చూశాను. ఇదేవిధంగా ఉంటే మమ్మల్ని ఓట్లు వేయినిస్తారా అని ఎస్సీలు చెప్పటం చూస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ద్వారా మాకు చాలా ప్రమాదం పొంచి ఉందని ప్రజలు చెబుతున్నారంటే ఇక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి’ అని ఎంపీ నందిగం వివరించారు. టీడీపీ నాయకులు ఎన్ని అవరోధాలు, అవాంతరాలు స్పష్టించినా 13న జరిగే ఎన్నికల పోలింగ్లో పర్చూరు ఎమ్మెల్యేగా యడం బాలాజీ, ఎంపీగా తాను, సీఎంగా జగన్మోహన్రెడ్డి గెలుపును అపటం ఎవరితరం కాదన్నారు. యడం బాలాజీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇలా రెచ్చగొట్టేలా దూషించటం, దాడులకు పాల్పడటం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. -
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చేతకాని సన్నాసులు.. సీఎం జగన్పై దాడి.. నందిగామ సురేష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
దళితులు, డ్రైవర్లంటే అంత చిన్నచూపా చంద్రబాబూ?
సాక్షి, తాడేపల్లి: దళితులు వేలిముద్రగాళ్లని, డ్రైవర్లంటూ ఎగతాళి చేసిన చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతామని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అహంకారానికి దళిత, బీసీ, మైనార్టీలు, డ్రైవర్లు తగిన బుద్ధి చెబుతారన్నారు. ‘‘చంద్రబాబు రక్తంలోనే కులపిచ్చి ఉంది. అందుకే, దళితుల్ని పదేపదే అవమానిస్తున్నాడు. దళితుల్లోఎవరైనా పుట్టాలని కోరుకుంటారా.? అని నాడు అవమానించాడు. సీఎం జగన్ నేడు ఎస్సీ వ్యక్తికి ఎమ్మెల్యే సీటిస్తే వేలిముద్రగాళ్లకూ సీట్లంటూ ఎగతాళి చేస్తున్నాడు. పేదోడి పట్ల ప్రేమ చూపే జగన్ మళ్లీ సీఎం అవుతారు’’ ఎంపీ సురేష్ అన్నారు. నందిగం సురేష్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. దళితుల పట్ల మరోసారి చంద్రబాబు అహంకారం: రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవమున్న నాయకుడిగా చెప్పుకునే నారా చంద్రబాబు ఎస్సీల పట్ల తనకున్న భావాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మీటింగ్లో ఒక ఎస్సీ నాయకుడి గురించి ఏం మాట్లాడారో అందరం చూశాం. అదే విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. (శింగనమల వైఎస్సార్సీపీ అభ్యర్థి గురించి చంద్రబాబు ఏమన్నారో.. ఆయన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపారు) ఎస్సీలను ఉద్దేశించి ఇదే చంద్రబాబు గతంలో ఏమన్నారు..? ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారంటూ ఎస్సీలను తీవ్రంగా అవమానించా డు. ఇవాళేమో.. ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లు టిప్పర్ డ్రైవర్లంటూ ఎస్సీ నాయకుడి గురించి ఎగతాళిగా మాట్లాడాడు. చంద్రబాబు అనే వ్యక్తి నీచ సంస్కృతి కలిగిన వాడనేందుకు ఇంతకన్నా వేరే నిదర్శనమేదీ లేదు. ఏంటి .. ఆయన అహంకారం..? ఎస్సీలు రాజకీయ నాయకులుగా ఎదగకూడదని ఆయన భావించడం చాలా బాధాకరం. బాబు రక్తంలోనే కులపిచ్చి: గతం నుంచి ఇప్పటిదాకా చూస్తే చంద్రబాబుకు కులపిచ్చి కొనసాగుతూనే ఉంది. అది ఇక ఎప్పటికీ ఆయన్నుంచి పోయేది కాదు. ఎందుకంటే, కుల పిచ్చి అనేది ఆయన రక్తంలోనే ఇమిడిపోయి ఉంది. సామాన్యుడైన ఒక దళితుడు టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తుంటే.. ఆ పేదవాడిని వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి పిలిచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటిస్తే.. చంద్రబాబుకు మాత్రం ఆ దళితుడి పట్ల అంత చిన్నచూపా..? జగన్ గారి నిర్ణయం పట్ల మీకెందుకంత చులకన భావం..? అంటే, నీ దృష్టిలో దళితులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పనికిరారా..? నీ జీవితంలో ఎన్ని సార్లు దళితులను అదేపనిగా అవమానిస్తావు..? దళితులు.. డ్రైవర్లంటే అంత చిన్నచూపా..?: దళితులకు రాజకీయ పదవులొస్తే నీకెందుకు అంత కడుపుమంట? డ్రైవర్ల పట్ల మీకెందుకంత చిన్నచూపు..? టిప్పర్డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు దేనికీ పనికిరారనట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మరి, రాష్ట్రంలో ఆటోడ్రైవర్లుగా.. టిప్పర్ డ్రైవర్లుగా లక్షల మంది పనిచేస్తున్నారు. ఆఖరికి, చంద్రబాబుకు, లోకేశ్కు, ఆయన కోడలి కార్లు నడుపుతున్నవారంతా డ్రైవర్ల వ్యవస్థ నుంచి వచ్చినవారే కదా..? వాళ్లు లేకపోతే.. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలకు ఒక్క పూట గడవదనే సంగతి అందరికీ తెలుసు. ఆర్టీసీ గానీ.. ఇతర ట్రాన్స్పోర్టు వ్యవస్థలైనా ప్రతీరోజూ డ్రైవర్ల మీద ఆధారపడే ముందుకు నడుస్తూ ఉన్నాయి. అంతటి గొప్పదిగా డ్రైవర్ల వ్యవస్థను మనమంతా గుర్తించాల్సిందే. అలాంటి గొప్ప డ్రైవర్లను పట్టుకుని.. అందునా ఒక దళిత నాయకుడ్ని ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లంటూ చంద్రబాబు ఎగతాళి చేస్తున్నాడు. నీకులాగ వెన్నుపోట్లు, మోసాలు మాకు తెలియవు: చంద్రబాబు ఒక సంగతి గుర్తించాలి. నీకులాగా మోసాలు చేయడం, వెన్నుపోటు పొడవడమనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకో.. డ్రైవర్ల వ్యవస్థలో పనిచేసేవారికో ఎవరికీ తెలియదు. నీలాంటి నీచ సంస్కృతికి మేం ఆమడదూరంలో ఉంటాం. నీకులాగా తిరుపతిలో జేబులు కొట్టి బతకడం మావల్ల కాలేదు. నమ్మినోడిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని సొంత తమ్ముడ్ని ఇంట్లో కట్టేసి చిత్రహింసలు పెట్టే కిరాతకులం మేం కాదు. వెన్నుపోట్లు, మోసాలు నీ పేటెంట్ హక్కులని అందరికీ తెలుసు. నీ కులంలో పుట్టిన నీ తండ్రే గొప్పోడా..?: చంద్రబాబూ.. నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. నీ తండ్రి ఏం చేశాడు..? అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ నడపలేదు కదా..? చిన్న రైతుగా వ్యవసాయం చేసినోడే కదా..? మరి, అతను వేలిముద్రతో పుట్టలేదా..? మరి, నీ కులంలో పుట్టినోడు గొప్పోడు ఎలా అయ్యాడు..? మా ఎస్సీల్లోనో.. ఎస్టీల్లోనే పుట్టినవాడు వేలిముద్ర వేసే వ్యక్తిగా ఎలా తక్కువయ్యాడో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చినోడివి ఇవాల్టికి రూ.6 లక్షల కోట్లు ఎలా సంపాదించావు...? నీ బతుకే 420 బతుకుని గూగుల్లో కొట్టినా తెలుస్తోంది. నీ కంచంలో కూడు లాక్కోలేదుగా? ఎవరో పెట్టిన రాజకీయ పార్టీని వెన్నుపోటుతో లాగేసుకోవడం.. ఎవరో డబ్బు పెడితే నీ కొడుకును విదేశాల్లో చదివించుకోవడం.. మోసాలు, దగాలు చేసి మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికార పీఠం ఎక్కడం.. వంటి నీచసంస్కృతి ఏనాడూ మా దళితుకు తెలియవు. మా రక్తంలో కూడా అలాంటి తప్పుడు ఆలోచనలు ఉండవు. మా జీవితాలను మొదట్నుంచి నువ్వు ఎక్కిరిస్తూనే ఉన్నావు. ఏనాడైనా.. చీమూనెత్తురు ఉన్నోడైతే, మాపట్ల గౌరవం మర్యాదగా మసలుకుంటాడని ఆశిస్తే.. అవేమీ లేనోడిగా బతుకుతున్న నీచపు కుక్క ఈ చంద్రబాబు. నీ కంచంలో కూడు మేం ఏమైనా లాక్కున్నామా..? టిప్పర్ డ్రైవర్గా పనిచేసినా.. వేలిముద్ర వేసేవాడైనా మా ఎస్సీ అభ్యర్థి తన కష్టంతో తన కూడు తాను తింటున్నాడు తప్ప.. నీకులాగా ఇతరుల కూడును లాక్కుని తినడం లేదు. నీ దగ్గర పనిచేసే కొండల్రెడ్డి అనే డ్రైవర్ ఎందుకు చనిపోయాడో.. ఎలా చనిపోయాడో సమాధానం అడిగితే చెప్పలేని వ్యక్తి ఈ చంద్రబాబు. మాకు తెలిసిందల్లా నీతిగా బతకడమే: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులేసి నీకులాగా పదవుల్ని ఆక్రమించుకోవడం మాకు తెలియదు చంద్రబాబూ.. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తెలిసిందల్లా నీతిగా బతకడమే. కాయాకష్టం చేసుకుని పనిచేసే దగ్గర పని ఇచ్చిన వ్యక్తి దగ్గర నమ్మకంగా ఉండటమే మాకు తెలుసు. నీలాంటి నీచ సంస్కృతిని నీ కొడుకు లోకేశ్కు నేర్పుకున్నావేమో.. అతను కూడా నిన్నేం మించిపోడు. లోకేశ్ అనే వ్యక్తి ఒక హాఫ్నాలెడ్జ్ ఫెలో.. నువ్వు నేర్పిన బుద్ధులతోనే మాట్లాడుతాడు గానీ.. మా తల్లిదండ్రులు మాత్రం అలాంటి వాటిని మాకు నేర్పలేదు. నువ్వు కించపరిచినోళ్లే..నిన్ను నిలదీస్తారు చూడు: నందమూరి కుటుంబాన్ని చేతిలో బొమ్మల్లాగా ఆడిస్తూ తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని ఇన్నాళ్లూ దళిత, బీసీ, మైనార్టీల సొమ్ముతో బాగుపడ్డావు. అధికారం తలకెక్కి నీ వాపును బలుపనుకుంటున్నావు. ఇన్నాళ్లకు నీకు దళితులు, డ్రైవర్లు వేలిముద్రగాళ్లుగా కనిపిస్తున్నారేమో.. రేపటికి.. అదే వేలిముద్రగాళ్లు నాయకులుగా అసెంబ్లీలోనో.. మరెక్కడ్నో.. నిన్ను నిలదీసే పరిస్థితి వస్తుంది చూసుకో.. ఇవాళ, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావో.. వాటన్నింటికీ, నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని రాసిపెట్టుకో చంద్రబాబు. పేదోడి పట్ల జగన్ ప్రేమ అది: ఇదే అమరావతి ప్రాంతంలో ఒక సామాన్య ఎస్సీ కార్యకర్తను నువ్వు కించపరిస్తే.. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు మాత్రం అదే వ్యక్తిని ఎంపీని చేశారు. ఆ వ్యక్తే నందిగం సురేష్ అనే నేను. పేదోడి పట్ల శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రేమ అది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద కుటుంబాల్లో పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో నిలబెట్టాలని సంకల్పించి పనిచేస్తున్నారు మా నాయకుడు సీఎం జగన్ ఆయనకు కులాలు, మతాలతో సంబంధం లేదు. ఏనాడూ ఆయన మమ్మల్ని చులకనగా చూడలేదు. చిన్నబుచ్చినట్లు ఎక్కడా పల్లెతు మాటా అనలేదు. అలాంటి గొప్ప నేతల పక్కన దళితులు, బీసీలు, మైనార్టీలు ఉంటారు. నీ బతుక్కి నీ హయాంలో ఏనాడైనా పేదోడి పిల్లోడు ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఆ వేదికపై మాట్లాడిన సందర్భం ఉందా..? అదే మా జగనన్న గడచిన నాలుగున్నరేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని కాపాడారు. కాబట్టే.. ఆయన్ను జీవితాంతం మా వర్గాలు గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా పూజిస్తాయి. రేపటి ఎన్నికల్లో మేమంతా ఆయన్నే మరోమారు సీఎంగా చూసుకుంటాం. ఇది తథ్యం. నీ రాజకీయ సమాధి మా చేతుల్లో ఖాయం: ఒకటికి పలుమార్లు మమ్మల్ని చులకన భావంతో మాట్లాడుతుంటే.. నీకు రాజకీయ సమాధి కట్టాలని దళితులంతా పూనుకుంటుంటే.. నీలో మా పట్ల రోజురోజుకూ అక్కసు పెరుగుతోంది. ఇది మేం గ్రహించాం. ఆయన అహంకారానికి భవిష్యత్తులో తప్పకుండా మేం సమాధానమిస్తాం. రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు శాశ్వత రాజకీయ సమాధి ఖాయమని చెబుతున్నాం. టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా చంద్రబాబు అహంకార ధోరణిని గ్రహించి ఆయన్ను నిలదీయాలని కోరుతున్నాను. -
చంద్రబాబు,పవన్ ను ఏకిపారేసిన నందిగం సురేష్
-
ఇదే నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగించింది : నందిగం సురేష్
-
నాతో అభ్యర్థుల ప్రకటన..కన్నీళ్లు పెట్టుకున్న నందిగాం సురేష్
-
చంద్రబాబుకు మాస్ సవాళ్లు విసిరిన నందిగామ సురేష్, అనిల్ కుమార్ యాదవ్
-
బాబు, పవన్ కు కొడాలి, నందిగాం సురేష్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్ బండారం బయటపెట్టిన నందిగం సురేష్
-
చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఎంపీ నందిగం సురేష్ ఫైర్
-
‘రాజధాని’పై చర్చకు రండి.. టీడీపీ నేతలకు ఎంపీ సురేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కారంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావ్? అంటూ సురేష్ నిలదీశారు. ‘‘రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే. బలవంతంగా భూ సేకరణ చేయలేదని మనవడిపై ఒట్టేసి చెప్పాలి. హైదరాబాద్ని అభివృద్ధి చేసిన మగోడివైతే మరి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదు?. అబద్దాల బతుకు ఇంకెంతకాలం?. కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా అధినేతలే’’ అంటూ ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్టు చంకలు కొట్టుకుంటున్నారు. రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి ఆత్మవంచన చేసుకున్నారు. రాజధానిని కుల రాజధానిగా మార్చారు. జగన్ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు. పంటపొలాలను ఎవరు కాల్చారో నార్కో టెస్టులతో తేల్చుకుందామా?. నాలుగు వందలు చొప్పున జనానికి ఇచ్చి సభకు తెచ్చుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎస్సీలను దొంగల్లాగా చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎస్సీలు, బీసీలతో పెట్టుకునే 2019లో ఓడిపోయాడు. ఒళ్లంతా రోగాలని చెప్పుకుని బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ ఎంపీ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజలకు భవిష్యత్తు ఇవ్వటమేంటి?. రాజధానిపై చర్చకు 24 గంటల సమయం ఇస్తున్నా. దమ్ముంటే ఎవరైనా సరే చర్చకు రావాలంటూ ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఇదీ చదవండి: రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’ -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదు: ఎంపీ సురేశ్
-
‘పవన్ దమ్ము చాలదని బీజేపీ కాళ్ళా వెళ్ళా పడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని తిట్టిన చంద్రబాబు మళ్లీ బీజేపీ నేతల గుమ్మం దగ్గర నిలబడడం సిగ్గు చేటు అని వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండ్డిపడ్డారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటో చెప్పకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. తన మీద తనకు నమ్మకం లేక పొత్తుల కోసం తాపత్రయపడుతున్నారు. ..పవన్ కల్యాణ్ దమ్ము చాలదని, బీజేపీ కాళ్లా వెళ్ళా పడుతున్నాడు. చంద్రబాబు 14 ఏళ్ళల్లో దోచుకున్నాడు. తన జీవితంలో చంద్రబాబు ఏనాడూ సొంతంగా పోటీ చేసి గెలవలేదు. ఒక్కడుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. పవన్, బీజేపీ, కాంగ్రెస్తో చంద్రబాబు జత కట్టాడు. భయంతో చంద్రబాబు రేపు కేఏ.పాల్తో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. చంద్రబాబు జిమ్మిక్కులతో సర్వేలు చేయించాడు’ అని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తన పాలనలో మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. పేదల ఖాతాల్లో ఉందని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. చదవండి: నేరుగా వెళ్లి పులిబోనులో పడ్డట్లుగా.. జనసేన రాజకీయ వైనం! -
జగన్ ను ఓడించాలంటే అటువైపు కూడా జగనే ఉండాలి
-
కేఏ పాల్ కు ఉన్న దమ్ము కూడా షర్మిలకు లేదు
-
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర
-
AP: మళ్లీ జగనే సీఎం: బస్సు యాత్రలో ఎంపీ నందిగాం
అన్నమయ్య, సాక్షి: రైల్వేకోడూరు ప్రజల అనందం చూస్తుంటే ఎమ్మెల్యేగా శ్రీనివాసులు, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. రైల్వేకోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ నందిగాం సురేష్బాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు. ‘నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనకు పద్నాలుగున్నర నెలల చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు పాలనలో కుళ్లు కుతంత్రాలు తప్ప చేసిందేమీ లేదు. బినామీలకు దోచిపెట్టారు. బాబు ఎవరికీ చేసిందేమీ లేదు. ఏమి చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నుపోటు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అదే వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేశారు. ఎంత మంది ఏకమై వచ్చినా ఊడేదేమి లేదు. రాష్టానికి మేలు చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఏపీకి దశ దిశ చూపే వ్యక్తి సీఎం జగన్. కోడూరు అభివృద్దికి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. మీరు మళ్లీ అవకాశమిస్తే మళ్లీ మంత్రి అవుతారు’అని ఎంపీ సురేష్ అన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నవ్వులోనే ఎవరికి ఏ కష్టమోచ్చినా అండగా నేను ఉన్నానన్న నమ్మకం కలుగుతుంది. యాదవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమానత్వం తీసుకువచ్చారు. చంద్రబాబు మాత్రం బడుగు బలహీన వర్గాల వారిని అవమానపరిచారు. ఇలాంటి సీఎంను, ఎమ్మెల్యే శ్రీనివాసులును మళ్లీ భారీ మోజార్టీతొ గెలిపించాలి’ అని రమేష్ యాదవ్ అన్నారు. ఇదీచదవండి.. కేశినేని నాని వర్సెస్ చిన్ని -
సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరిస్తున్న YSRCP నేతలు
-
ఎంపీ నందిగం సురేశ్ కారును ఢీకొట్టే ప్రయత్నం
తాడేపల్లి రూరల్: దళిత ఎంపీ నందిగం సురేష్ కారును మరో కారుతో ఢీకొట్టేందుకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. బాపట్ల ఎంపీ సురేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. అమరావతి కరకట్ట వెంబడి ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బిబి1 మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎంపీ కారును ఢీకొట్టబోయిన కారులో ఉన్నవారు బొటనవేలు, చిటికెనవేలు చూపిస్తూ, చూపుడు వేలుతో వార్నింగ్ ఇచ్చి ప్రకాశం బ్యారేజ్ వైపు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ పీఎస్వో బషీర్ తెలిపిన వివరాల మేరకు.. సురేష్ కాన్వాయ్ కరకట్ట మీదుగా వెళుతున్న సమయంలో ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉద్దేశపూర్వకంగా ఏపీ16 జెఎఫ్ 0828 గల కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఆపి ఉన్న కారు ఒక్కసారిగా రోడ్డు మీదుగా వచ్చి ఎస్కార్ట్ వాహనాన్ని, సురేష్ కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. డ్రైవర్ అప్రమత్తమై కారును కంట్రోల్ చేశారు. లేకపోతే కారు కరకట్ట మీద నుంచి 30 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయేది. ఏపీ16 జెఎఫ్ 0828 కారులో డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి కారు అద్దాలు దించి చూపుడువేలుతో వార్నింగ్ ఇస్తూ, టీడీపీ సింబల్ అయిన విక్టరీ సింబల్ చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇస్తున్నట్లు సైగలు చేశాడు. వెళ్లిపోబోతున్న కారును ఆపడంతో అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగి వేళ్లు చూపిస్తూ ఎంపీ అయితే ఏమిటి.. త్వరలోనే మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. కారుకు అడ్డుగా నిలిచిన బషీర్ను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ వచ్చి కారులో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న వ్యక్తిని నువ్వెవరని ప్రశ్నించగా.. నీకు చెప్పేది ఏమిట్రా అంటూ కారు ఎక్కుతూ మరోసారి చేతివేళ్లు ఊపుతూ నీ సంగతి తేలుస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కారులో డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘటనపై తుళ్ళూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కారు నంబరు ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని బషీర్ తెలిపారు. -
లోకేష్, పవన్ పై నందిగామ సురేష్ సెటైర్లు
-
మోడీ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఏమ్మన్నారంటే..!
-
సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తున్న నేతలు
-
నందిగాం సురేష్: చంద్రబాబు దోచుకోవడం తప్పిస్తే ఏం చేశారు
-
గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసింది
-
చంద్రబాబు కొంతమంది దొంగల కోసం పనిచేశారు: నందిగం
-
సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్
పామర్రు: సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, అనేక కార్యక్రమాలతో ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రీ ఈ ఘనత సాధించలేదన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేబినెట్ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, మహిళలకు 50 శాతం పదవులిచ్చారని అన్నారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఊపిరిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ని ప్రజా క్షేత్రంలో ఎవరూ ఓడించలేరని, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణతో కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్ ముందు పనిచేయవన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నారని, సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజ్యసభ సీటిస్తానని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అదే సీటును వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్కు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అడుగడుగునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించిన చంద్రబాబును మరోసారి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ అక్కున చేర్చుకున్న సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉన్నత స్థితికి బడుగు వర్గాలు: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్రామ్, సాహూ మహరాజ్, అబ్దుల్ కలామ్ వంటి మహానుభావుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేరుస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, రూపాయి లంచం లేకుండా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలను చేరుస్తున్నారని అన్నారు. 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చి వారి కుటుంబాలకు గూడు కల్పించిన సీఎంగా దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను, అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పైగా, రుణాలు మాఫీ చేస్తానని రైతులు, మహిళలను మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకూ పనికిరారని అవహేళన చేశారని తెలిపారు. మన విలువలు కాపాడుకోవడానికి 2024లో తిరిగి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాబును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పటికీ క్షమించరు : ఎంపీ సురేష్ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబును ఈ వర్గాలు ఎప్పటికీ క్షమించబోవని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆరు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబు సోమరిపోతు కాదా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారని అన్నారు. రూ.370 కోట్లు అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజం గెలవాలి అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. బడుగులను అందలమెక్కిస్తున్న సీఎం జగన్: ఎంపీ మోపిదేవి అనేక పథకాలతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్ అందలమెక్కిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ మాట్లాడుతూ గతంలో పెన్షన్ కావాలంటే నాయకులకు దండాలు పెడితేనో, టీడీపీ కండువాలు కప్పుకుంటేనే మంజూరయ్యేదన్నారు. సెంటర్లో కనబడి దండం పెట్టకపోతే పెన్షన్ రద్దయ్యేదని చెప్పారు. సీఎం జగన్ పాలనలో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్ బాబు, పేర్ని నాని, ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్దే: నందిగం సురేష్
-
పేదల పక్షపాతి సీఎం వైఎస్ జగన్
-
మన బిడ్డల భవిష్యత్ కోసం జగన్ కావాలి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇన్నేళ్లూ ప్రభుత్వాలన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. వాడుకుని వదిలేశాయి. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక మన బిడ్డలకు ఇంగ్లిష్ చదువులు చెబుతున్నారు. వారి రక్షణకు భరోసా కల్పిస్తున్నారు, అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారు. అవ్వా తాతలను మనవడిలా వెంట ఉండి నడిపిస్తున్నాడు. మన బిడ్డల ఉన్నత చదువులకు, వారి భవిష్యత్కు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం భారీ జన సందోహంమధ్య పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 5 గంటలకు బుక్కరాయసముద్రం సభా వేదిక వద్దకు చేరుకుంది. సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు: మంత్రి ఉషశ్రీ సామాజిక సాధికారత అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. మహిళా సాధికారత కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించారని తెలిపారు. జనరంజక పాలన అందించారని, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన పేరు చెప్పుకుని గర్విస్తున్నామన్నారు. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు: అంజాద్ బాషా సీట్లు, ఓట్లతో పాటు మంత్రి పదవులు, ఇతర పదవుల్లోనూ సామాజిక న్యాయం కల్పించిన సీఎం జగన్ అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. జగన్ హయాంలో 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు మంత్రులయ్యారన్నారు. 2024లో పేదలకు–పెత్తందార్లకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని, పేదల పక్షాన మనందరం జగన్కు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చింది: మంత్రి జయరాం భారత స్వాతంత్య్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇప్పుడే అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందని కార్మిక శాఖ మంత్రి జి.జయరాం చెప్పారు. పదవుల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిలో అన్నింటా స్వేచ్ఛ వచ్చిందన్నారు. పల్లెల్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రీ జగన్ను కొడుకుగా భావిస్తున్నారని, చదువుకునే చిన్నారులతో మేనమామగా పిలిపించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీలకు మేలు జరగకుండా బాబు అడ్డుకున్నారు: ఎంపీ సురేష్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడ అవుతుందని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముందు వెలవెల పోయిందని అన్నారు. శింగనమల సెంటిమెంటు పనిచేస్తుంది: జొన్నలగడ్డ శింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, మీరందరూ ఇక్కడ మళ్లీ వైఎస్సార్సీపీకి ఓటేసి జగన్ను సీఎం చెయ్యాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. నియోజకవర్గంలో 40 చెరువులను లోకలైజ్ చేసి రైతులకు జగన్ అండగా నిలిచారని, ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. జగన్ అన్నట్టు 175కు 175 సీట్లు సాధ్యమే అని తెలిపారు. ఈ యాత్రలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పర్మినెంట్ జైలుకే..!
-
సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
-
చంద్రబాబుపై నందిగం సురేష్ ఫైర్..
-
మళ్ళీ జగనన్ననే గెలిపించుకుందాం..చంద్రబాబు సీఎం అయితే ఏపీ ఆగమవుతుంది..
-
లోకేష్ భయపడ్డాడు కాబట్టే ఢిల్లీ వెళ్లి దాక్కున్నాడు: ఎంపి నందిగం సురేశ్
-
తండ్రి జైల్లో ఉంటే.. లోకేష్ ఢిల్లీకి ఎందుకు పారిపోయారు?: ఎంపీ సురేష్
సాక్షి, అమరావతి: జగన్కు భయం అంటే ఏంటో చూపిస్తానన్న లోకేష్ ఢిల్లీ పారిపోయారని, రఘురామకృష్ణం రాజు గెస్ట్ హౌస్లో రెస్టు తీసుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తండ్రి జైల్లో ఉంటే ఎవరైనా ఢిల్లీ వెళ్లి ఇలా చేస్తారా?. స్కాంలో దొరికిపోయి జైల్లో కూర్చున్నారు. పవన్ నమ్ముకుని టీడీపీ నడుస్తోంది. రేపు లైట్లు ఆర్పి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఇలా పిలుపు ఇవ్వటానికి సిగ్గు ఉండాలి’’ అని ఎంపీ సురేష్ మండిపడ్డారు. ‘‘రాజధానిలో రైతుల జీవితాల్లో వెలుతురు లేకుండా చేశారు. ఆ పాపం ఊరికే పోతుందా?. చంద్రబాబు అరెస్ట్తో పవన్ తప్ప ఎవరూ ఫీలవటం లేదు. టీడీపీ, జనసేన జెండాలు చూసి ఇతర పార్టీలు భయపడటం అనేది వారి భ్రమ. ఈ రాష్ట్రంలో జగన్ అవసరం ఇంకో పాతికేళ్లు ఉందని జనం అనుకుంటున్నారు. చంద్రబాబు అవసరం లేదని జనానికి క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముసలి రక్తం ఎక్కించుకున్నారు. పవన్ కి భయం అంటే ఏంటో వచ్చే ఎన్నికల్లో గెలుపు రూపంలో మళ్లీ మేము చూపిస్తాం’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. ‘‘జగన్ భయపడే మనిషి కాదు కాబట్టే సింగిల్గా వస్తానంటున్నారు. ప్రజలకి ఏం చేస్తారో చెప్పకుండా పవన్ జనాన్ని రెచ్చగొట్టటం ఏంటి?. లోకేష్ తండ్రి సంపాదనతో కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబు తప్పు చేశారని కోర్టులు కూడా నమ్మాయి. అందుకే జైల్లో ఉన్నారు. సోషల్ మీడియా, ఎల్లోమీడియాలో ఎంత రచ్చ చేసినా చంద్రబాబును నమ్మేవారు లేరు. పాపాలు చేసిన వారికి ప్రజల సానుభూతి ఎప్పుడూ ఉండదు. రెండు ఎకరాల నుండి ఆరు లక్షల కోట్లు సంపాదించటం అంటే మామూలు విషయమా?. ఇలాంటి అవినీతి పరులను ప్రజలు క్షమించాలా?. చెదలు పట్టిన చంద్రబాబును వీరుడు, శూరుడు అనటం సిగ్గుచేటు’’ అంటూ సురేష్ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబును నమ్మి బాగు పడినవారు లేరు. వైఎస్సార్ ఫ్యామిలీని నమ్మి నష్టపోయిన వారు లేరు. తప్పుడు పనులు చేసి జైలుకు పోయిన వ్యక్తికి సపోర్ట్ ఎవరూ ఇవ్వరు. కంచాలు వాయించండి, మంచాలు వాయించండి అంటే ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు చీకటిలో సోనియా, చిదంబరం కాళ్లు పట్టుకున్నారు. జగన్ పై అక్రమ కేసులు పెట్టించారు. జగన్ మీద మచ్చ వేయాలంటే అది ఎప్పటికీ కుదరదని టీడీపీ గుర్తించాలి’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. చదవండి: టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్కు ఒక్కరే అడిటర్ -
బాబు దోమలకే భయపడ్డాడా..
-
ఫోటోల కోసమే ఢిల్లీలో లోకేష్ పర్యటనలు..!
-
'చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు'
ఢిల్లీ: చంద్రబాబు , లోకేష్ నిజమైన సైకోలని ఎంపీ నందిగామ సురేష్ అన్నారు. చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఎవరికీ భయపడనని చెప్పే చంద్రబాబు, జైళ్లో దోమలకు భయపడతారా ? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం టీడీపీ నేతల నుంచే ఉందని ఎంపీ సురేష్ చురకలు అంటించారు. చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్ కు అబ్బినట్టుందని ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి ఫోన్లు చెక్ చేయాలని సూచించారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణమన్న ఎంపీ సురేష్.. వీళ్ళు ప్రజా నాయకులా ? అని ప్రశ్నించారు. 'బాలకృష్ణ మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. పిచ్చోళ్లకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు. మెంటల్ బాలకృష్ణ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు అనుభవించిన లోకేష్ దోపిడీకి పాల్పడ్డారు' అని ఎంపీ సురేష్ అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ మూడు ప్రయత్నాలు.. చంద్రబాబు లూటీకి పాన్ ఇండియా ప్రచారం -
ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసిన దగాకోరు బాబు కోసం యువత రోడ్డెక్కుతారా..
-
చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ హైడ్రామా చేస్తోంది
-
చంద్రబాబు అవినీతిపై ఎల్లోమీడియా ఎందుకు ప్రశ్నించదు?
-
విషం కక్కిన డ్రామోజీ.. ఆ రాతలు ఏంటి?: ఎంపీ నందిగం సురేష్
సాక్షి, తాడేపల్లి: ఈనాడులో డ్రామోజీరావు విషపూరిత వార్తలు రాస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని ఏరియాలో ఎస్సీలు, ఎస్టీలు ఉండటానికి వీల్లేదని కూడా అడ్డగోలుగా రాశారు. తన పెత్తందారీ వ్యవహారాన్ని చూపించారు. అమరావతి మురికి కూపంగా మారుతుందని నిస్సిగ్గుగా రాశారు’’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేయాల్సిన నష్టం చంద్రబాబు రాశారు. దారుణంగా అవమానపరిచారు. అసలు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. విదేశీ విద్యా పథకం కింద అర్హులైన వారందరికీ న్యాయం చేస్తున్నాం. ఈనాడు రాసే బురద వార్తలను పట్టించుకోవాల్సిన పనిలేదు. చంద్రబాబు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే జనం నవ్వుతారు. ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేశారు?. ప్రాజెక్టులపై చర్చకు మేము సిద్ధం’’ అని ఎంపీ సవాల్ విసిరారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? ‘‘పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి పోలవరాన్ని కూడా నాశనం చేశారు. రాజకీయాల్లో ఎదుర్కోలేక సినిమాల్లో పవన్ కల్యాణ్ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు’’ అని ఎంపీ సురేష్ మండిపడ్డారు. -
‘కరోనా టైమ్లో ఎక్కడున్నావ్.. ఫాంహౌస్లో పడుకున్నావ్ కదా పవన్’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రులు సైతం పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణం. రాష్ట్రంలో మహిళలను, మహిళా వాలంటీర్లను పవన్ అవమానించాడు. మహిళలందరికీ పవన్ క్షమాపణ చెప్పాలి. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందింది. వాలంటీర్లను జనం తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారు. పవన్కు ప్రజలు క్షమించరు. కచ్చితంగా జనాగ్రహానికి గురికావాల్సిందే. మరోవైపు, ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పవన్ వీధి కుక్కలా తయారయ్యాడు. ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి చాలా ప్రమాదం. ప్రజలు రెండు చోట్లా ఓడించినా బుద్ధి రాలేదా?. పవన్ టీడీపీ ఆఫీసు బాయ్లా పనిచేస్తున్నాడు. బిస్కెట్ల కోసం పవన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పవన్ది సైకోయిజం, శాడిజం అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజానీకం వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతోంది. కరోనా సమయంలో పవన్ ఫాంహౌస్లో పడుకున్నాడు. వాలంటీర్ల మాదిరిగా పవన్ ప్రజలకు సేవ చేయలేదు. వాలంటీర్లలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. మహిళలంటే పవన్కు గౌరవం లేదు. వాలంటీర్లకు పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. అన్నం తినేవాడెవడైనా వాలంటీర్లను తిడతాడా?. గడ్డి తినేవాళ్లు మాత్రమే వాలంటీర్లపై నోరు పారేసుకుంటారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవ చేశారు. పవన్కు రాష్ట్రం మీద అవగాహన లేదు. ఇది కూడా చదవండి: వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్ -
‘అమరావతి అనువైన ప్రాంతం కాదని చంద్రబాబుకు ముందే తెలుసు’
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదని చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు అమరావతిలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ తప్ప ఏమైనా జరిగిందా? అని ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నక్కా ఆనంద్ బాబుపై సురేష్ ఫైరయ్యారు. కాగా, ఎంపీ నందిగం సురేష్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో పచ్చటి పొలాలను నాశనం చేయవద్దని ఆనాడే రైతులు వేడుకున్నారు. బలవంతంగా భూములు లాక్కుని రాజధాని ఏర్పాటు చేశారు. దుర్మార్గమైన ఆలోచనతోనే చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగేది పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం. ప్రజలంతా వ్యతిరేకించారు కాబట్టే తాత్కాలిక సచివాలయం కట్టాడు. నక్కా ఆనంద్ బాబు చంద్రబాబు కోసం కాదు.. దళితుల కోసం మాట్లాడాలి. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు పథకం. చంద్రబాబుకు పాలేరులా పవన్ పనిచేస్తున్నారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కోసమే నక్కా ఆనంద్ బాబు మాట్లాడాడు. మేం కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా మాట్లాడగలం. మీ మాదిరిగా కాదు మాకు కొంచెం విజ్ఞత ఉంది. చంద్రబాబు ఓ గుంట నక్క. మీరు మొదట చెప్పిన అమరావతికి.. రాజధాని పెట్టిన అమరావతికి అసలు సంబంధమే లేదు. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆఫీసులు తప్ప మరొకటి కనిపిస్తున్నాయా?. రాజధాని పేరుతో పచ్చని పొలాలను చంద్రబాబు నాశనం చేశాడు. భూదాహం ఉన్న వారంతా కలిసి ఏర్పాటు చేసుకున్నదే రాజధాని. రియల్ ఎస్టేట్ కోసం మొదలు పెట్టిందే అమరావతి ఉద్యమం. అమరావతి ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారు. రైతులను నాశనం చేసింది చంద్రబాబే. అమరావతి మొత్తం తనదేనంటూ లోకేష్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. లోకేశ్కు చేతనైతే ముందు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి. పనికిమాలినోళ్లకు పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్. లోకేశ్ యాత్ర ఫెయిలవ్వడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి అందరూ భయపడుతున్నారు. నక్కా ఆనంద్ బాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ -
AP: 108 అంబులెన్స్ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
గ్లాస్ పవన్ ది.. ఛాయ్ చంద్రబాబుది: నందిగం సురేశ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రస్తావనకొచ్చేసరికల్లా పవన్కళ్యాణ్ తన బానిసత్వాన్ని సమర్ధంగా నిరూపించుకుంటున్నాడని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ధ్వజమెత్తారు. ‘సభలో బాబు విషయానికొచ్చేసరికి ఒక పొట్టిశ్రీరాములు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య అంటూ పోలిక చెబుతున్నారు.. బాబుకు బానిసగా పనిచేసే విషయంలో ఎక్కడా అలసటనేది లేకుండా.. చురుగ్గా, సమర్ధవంతంగా పనిచేస్తున్న వ్యక్తిగా పవన్కళ్యాణ్ను చెప్పుకోవచ్చని’ వ్యంగాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2019లో కూడా పవన్కళ్యాణ్ అనే వ్యక్తి గాజువాక, భీమవరంలో ఓడిపోవడానికి కారణం కూడా చంద్రబాబేనని చెప్పాలి. ఎందుకంటే, ఆ రెండు చోట్ల పోటీకి దిగాలని అప్పట్లో బాబే పవన్కు చెప్పి నిలబెట్టాడని చాలామంది చెబుతుంటారు. యజమాని చెప్పింది చేయాల్సిందే కనుకే ఆయన ఆ రెండు చోట్ల ఓడిపోయి కూర్చొన్నాడని’ ఎద్దేవా చేశారు. గ్లాస్ పవన్దైనా.. ఛాయ్మాత్రం చంద్రబాబుదే.. ‘క్లాస్వార్ గురించి మాట్లాడే పవన్కళ్యాణ్ను నేను కొన్ని ప్రశ్నలేస్తున్నాను. వాటిపై సమాధానాలిచ్చే దమ్మూధైర్యం ఉంటే ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ పవన్కళ్యాణ్ అనే వ్యక్తి ఏ క్లాస్ వారితో అంటకాగుతున్నాడు..? ఏ క్లాస్ వ్యక్తుల దగ్గర ప్యాకేజీ తీసుకున్నావు..? గతంలో ఓడిపోయిన రెండుచోట్లా ఎన్నికల ఖర్చును ఏ క్లాస్ వారి దగ్గర్నుంచి తీసుకున్నావు..? పవన్కళ్యాణ్ గ్లాసులో టీ పోసింది చంద్రబాబు అని భీమవరం, గాజువాకలో ఏ ఒక్క చిన్నపిల్లోడ్ని అడిగినా చెబుతాడు. పవన్కళ్యాణ్ను ఆ గ్లాసు పట్టుకుని ఆ రెండు చోట్ల నిల్చోమన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చి ఆ గ్లాసులో ఛాయ్ పోశాడని పవన్ బాగోతం గురించి ప్రజలే చెబుతున్నారని’ చెప్పారు. పేదలకు పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుందా..? ‘‘పవన్కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయటానికని అంటున్నాడు. తాను భవిష్యత్తులో ప్రజలకు మేలు చేస్తానంటూ.. ఇప్పటి ప్రభుత్వం అందించిన మేలు కంటే మిన్నగా చేస్తామని చెబుతున్నారు కదా..? రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని డీబీటీ ద్వారా రూ.2.23 లక్షల కోట్ల లబ్ధిని ప్రజలకు అందించారు. దీనిపై ఇటు పవన్కళ్యాణ్, అటు చంద్రబాబు మాత్రం రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని గుండెలు బాదుకుంటున్నారు. ఇక్కడ అమలయ్యే పథకాల్ని కొనసాగిస్తామంటారు. పక్కరాష్ట్రాల్లోని పథకాల్ని కాపీ కొట్టి చేస్తామంటారు. మొత్తానికి వీరిద్దరూ కాపీపేస్టు వీరులని చెప్పుకోవచ్చని’’ మండిపడ్డారు. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! -
టీడీపీ ప్రజలకు అంటరాని పార్టీ: నందిగాం సురేష్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు కంటే నారా లోకేశ్ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ పారిపోతారు. పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాలు తీసుకోవాల్సిందేనని ఎంపీ నందిగాం సురేష్ ఎద్దేవా చేశారు. కాగా, నందిగాం సురేష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడో చెప్పాలి. మాదిగలపై అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా?. మాదిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు.. మాదిగలకు ఎంపీ సీటు ఇచ్చాడా?. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని మేలు ఏపీలో దళితులకు జరిగింది. చంద్రబాబు దగ్గర కొందరు నేతలు బానిసలుగా ఉన్నారు. ఎస్సీలను రాజధానిలో చంద్రబాబు దొంగలుగా చిత్రీకించారు. వర్ల రామయ్యకి రాజ్యసభ ఇస్తానని అవమానించింది చంద్రబాబు కాదా?. ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అవమానించలేదా?. సీఎం జగన్ ఎస్సీలను నా తమ్ముళ్లు, అన్నలు, కుటుంబ సభ్యులు అని భావిస్తారు. రెండెకరాల చంద్రబాబుకి ఇన్ని వేల ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలి?. ఎన్నికలొచ్చాయంటే చాలు కులాల మధ్య కుంపటి పెట్టడం చంద్రబాబుకి అలవాటు. 98 శాతం హామీలు అమలు చేశాం కాబట్టే 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్నాం. అంటరానితనాన్ని పోషిస్తోంది తెలుగుదేశం పార్టీనే. టీడీపీ ప్రజలకు అంటరాని పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలపై సజ్జల ఏమన్నారంటే.. -
‘అమరావతి’ పట్టాల పంపిణీని హర్షిస్తూ భారీ ర్యాలీ
వెంకటపాలెం(తాడికొండ)/తాడేపల్లిరూరల్: అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ పాల్గొని వెంకటపాలెం టీటీడీ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటామంటూ చంద్రబాబు, రాజధాని రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు, కులవాదులు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో బాబు ఆయన అనుయాయుల మనసు మార్చాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బహుజన పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. పలువురు బహుజన పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. నాడు పెత్తందారుల పసుపు నీళ్లు.. నేడు పేదల క్షీరాభిషేకం అమరావతి ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తే నాడు ‘పచ్చ’ పెత్తందారులు పసుపు నీళ్లు చల్లి కుట్రలకు తెరదీస్తే.. నేడు అదే ప్రాంతంలో పేదలు జగనన్నకు క్షీరాభిషేకం చేసి అభిమానం చాటుకుంటున్నారు. అమరావతిలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో అమరావతి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గురువారం ఆ ప్రాంతంలో పేదలతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు శృంగారపాటి సందీప్, పలువురు 11 గ్రామాల్లోని 25 లే అవుట్లలో 2000 లీటర్ల పాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు, ప్లాట్లకు క్షీరాభిషేకం చేశారు. తాడేపల్లి ప్రాంతంలో.. కొండపోరంబోకులోనూ, రైల్వే స్థలాల్లోనూ బిక్కుబిక్కుమంటూ 40–50 సంవత్సరాల నుంచి నివాసముంటున్న పేదలకు సొంతింటి కల నెరవేరడంతో ఆనందంతో తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముదిగొండ ప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇత్తడి పండు, ఎం. మార్తమ్మ, జమ్మలముడి సునీత తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసైన్డ్ రైతుల పట్ల చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారన్నారు. ‘‘అమరావతిలో పేదలు ఉండడానికి వీలు లేదని కోర్టుకు వెళ్లారు.. అమరావతిలో అందరూ ఉండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించింది. చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. పేదల పక్షాన సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?. పేదలంటే తెలుగుదేశానికి ఎందుకంత కడుపుమంట. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా?’’ అంటూ ఎంపీ సురేష్ ప్రశ్నించారు. ‘‘జీవో45ని సమర్థిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషిస్తున్నాం. అమరావతిలో 50వేల పైచిలుకు ప్లాట్లు ఇచ్చేలా జగన్ నిర్ణయానికి అడ్డుపడ్డారు. టీడీపీ నేతల చెంప చెల్లుమనిపించేలా తీర్పు వచ్చింది. చంద్రబాబు అసైన్డ్ భూముల్ని స్మశానల పక్క, వాగులో, వంకల్లో ఇచ్చారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని సైతం వరదల్లో మునిగిపోయే ప్రాంతంలో పెట్టాలని చూశారు. సీఎం జగన్ మాత్రం విజయవాడ నడిబొడ్డున పెట్టారు. సీఎం జగన్కి కావాల్సింది ప్రజా రాజధాని.. రియల్ ఎస్టేట్ రాజధాని కాదు’’ అని నందిగం సురేష్ అన్నారు. చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ పరాజయం! ‘‘అమరావతిలో పేదలు, దళితులు, బీసీలు ఉంటే మురికి కూపంగా మారుతుందని అభివృద్ధి జరగదంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పుతోనైనా చంద్రబాబు మారాలి. పేదల పట్ల ఇంత వివక్ష సరికాదు. రాష్ట్రంలోని పేదలపాలిట దరిద్రం చంద్రబాబు. ఆయనను రాష్ట్రంలోని పేదలంతా తరిమికొడతారు. టీడీపీ వస్తే అమరావతి నుండి పేదలను బయటకు పంపిస్తామని అచ్చెన్నాయుడు మాట్లాడటం సరికాదు. టీడీపీలోని దళితనేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు. చంద్రబాబుకు, జగన్కు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రం మొత్తం బాగుండాలని జగన్ అనుకుంటే, తన సామాజిక వర్గం మాత్రమే బాగుండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దేవుడే ప్రత్యక్షమై మారమని చెప్పినా చంద్రబాబు మారడు. అణగారిన జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి తరపున సీఎం జగన్కు కృతజ్ఞతలు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే: మంత్రి కాకాణి -
మందడంలో బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి
సాక్షి, అమరావతి: మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సత్యకుమార్ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆడవాళ్లని చూడకుండా టెంట్లో నుంచి లాక్కొచ్చారన్నారు. బీజేపీ ముసుగులో టీడీపీ నాయకులు వచ్చి వీరంగం సృష్టించారని, ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని వికేంద్రీకరణ మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఇదంతా చంద్రబాబు వెనుకుండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆదినారాయణ పిచ్చొడిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ‘‘సీఎంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు దీక్ష వద్దకు వచ్చి రెచ్చగొడుతున్నారు. సత్యకుమార్ అనుచరులు దళితులపై దాడి చేశారు’’ అని ఎంపీ సురేష్ నిప్పులు చెరిగారు. చదవండి: ఊహలే వార్తలా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
స్వప్రయోజనాల కోసం దిగజారే బాబు వల్లే శ్రీదేవికి హాని
సాక్షి, అమరావతి: ‘క్రాస్ ఓటింగ్ చేయలేదని, ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సవాల్ చేశారు. ఆమె సవాల్ను స్వీకరిస్తున్నా. శ్రీదేవి ఓటు అమ్ముకున్నారనేది వాస్తవం. ఆమె అమ్ముడుపోయి టీడీపీకి ఓటు వేశారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా’ అని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. మహిళలను గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అని.. తమ వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదన్నారు. స్వప్రయోజనాల కోసం ఎంతవరకైనా దిగజారే చంద్రబాబు వల్లే ఆమెకు హాని పొంచి ఉంటుందన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడారు. ‘నిజంగా తప్పు చేయకపోతే.. ధైర్యంగా నిలబడొచ్చు కదా? మూడు రోజుల తర్వాత హైదరాబాద్లో ఎందుకు మాట్లాడారు? టీడీపీ స్క్రిప్ట్ ఇప్పుడే అందిందా?’ అని ఉండవల్లి శ్రీదేవిని సురేశ్ ప్రశ్నిం చారు. సీఎం జగన్ చాలా గొప్ప వ్యక్తి అని మీడియాతో చెప్పారు కదా.. మరి అలాంటి వ్యక్తిని మోసం చేయాలన్న ఆలోచన ఎలా వచి్చంది? అని మండిపడ్డారు. చేసిన తప్పు పనికి, కులానికి సంబంధమేంటని ప్రశ్నిం చారు. ఓటు అమ్ముకోమని అంబేడ్కర్ ఏమైనా చెప్పారా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె ఓటు అమ్ముకోవడం వాస్తవమని.. ఎవరితో ఎక్కడ, ఎలా రాయబారాలు చేసిందో తమకు తెలుసన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహించాలంటూ శ్రీదేవి ఆరోపించడం దారుణమని మండిపడ్డారు. ఆమెకు ప్రమాదం పొంచి ఉందంటే.. అది కచ్చితంగా టీడీపీ వల్లే అని చెప్పారు. అందుకే శ్రీదేవికి పటిష్ట భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. జగన్ ప్రభుత్వం వల్లే దళితులకు ఎంతో మేలు.. సీఎం జగన్ పాలనలో దళితులకు ఎంత మేలు జరుగుతోందో అందరికీ తెలుసని ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఎస్సీలకు ప్రాధాన్యం కలిగిన మంత్రి పదవులు ఇచ్చారా? దళితులను హోం మంత్రి చేశారా? అని ప్రశ్నిం చారు. అమరావతిలో ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇప్పుడు మాట్లాడుతున్న శ్రీదేవి.. గతంలో అమరావతి అంశం గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. అలాగే మిమ్మల్ని ఉద్దేశించి టీడీపీ వాళ్లు ఏమన్నారో కూడా గుర్తు చేసుకోవాలన్నారు. మీదంతా మేకప్.. ప్యాకప్.. మీరెప్పుడూ బ్యూటీ పార్లర్లలో ఉంటారంటూ టీడీపీ వాళ్లు దిగజారి చేసిన మాటలు గుర్తున్నాయా? అని ప్రశ్నిం చారు. గతంలో చంద్రబాబును నమ్మి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురు కూడా సరిగ్గా అక్కడే, అలాగే ఉంటారని చెప్పారు. స్కామ్లంటూ శ్రీదేవి ఆరోపిస్తున్న వాటిపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు. -
Bapatla MP: తెరపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ బయోపిక్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్లో ఇప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేరారు. ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాపట్ల ఎంపీ’అనే సినిమా తెరకెక్కుతుంది. అగస్త్య , నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిగం వెంకట్ నిర్మిస్తున్నారు. నానాజీ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగగం సురేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ఈ చిత్ర నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. (చదవండి: సెప్టెంబర్లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?) అనంతరం నిర్మాత నందిగం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమ్ముడు(నందిగం సురేశ్) నాతో చేసిన జర్నీ, తరువాత యూత్ ప్రెసిడెంట్ గా ఎదిగిన వైనం.. కొన్ని దుష్టశక్తులు కలిసి చేయలేని, చేయకూడని సంఘటనలో ఇరికించాని చూడడం, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మద్దతుగా నిలవడం, ఆయన సపోర్ట్తో ఎలా ఎంపీ ఆయ్యాడనేదే ఈ సినిమా కథాంశం అన్నారు. ఈ కథ చెప్పడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది అని అన్నారు. చిత్ర దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ.. ఇది బాపట్ల ఎం పి నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కొసుకొని బ్రతికే ఒక సామాన్య వ్యక్తి తన నిజాయితీ ని నమ్ముకొని, తను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ నిజాయితీగా ఉంటే. కొందరు వ్యక్తులు ఇతను చెయ్యని తప్పును ఇతను మీద రుద్దుతూ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బంది పెట్టినపుడు వైఎస్ జగన్ గారు చేరదీసీ, ఆయన సిద్దాంతాలు నచ్చి ఒక గొప్ప నాయకుడగా తీర్చిదిద్దారు. సురేష్ అనే ఒక సామాన్య వ్యక్తికి వైఎస్ జగన్ ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు?. ఈ వ్యక్తి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేదే ఈ కథ.ప్రతి సామాన్యుడు చూడాల్సిన సినిమా ఇది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే కచ్చితంగా ఎదుగుతాడు అనేది ఇందులో చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ఈ సినిమా కథను నానాజీ చెప్పినప్పుడు పొలిటికల్ స్టోరీ అని బయపడ్డాను. అయితే ఇందులో అదేమీ లేకుండా సామాన్యుడు అయిన తను ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు అనే స్టోరీ నాకు నచ్చింది’అని హీరో అగస్త్య అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హరోయిన్ నక్షత్ర అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
గడపగడపలో జగన్నినాదం
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రతి గడపలోనూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే వినిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం తథ్యమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోరే జగన్ ప్రభుత్వం ఉందని, అది గాంధీ కోరిన స్థానిక స్వపరిపాలన అందిస్తోందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అందులో భాగమేనన్నారు. సీఎం జగన్ సంస్కరణలు ఓ తరానికి ఆదర్శమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు శనివారం అశేష జనవాహిని హోరుతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానం మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్తోపాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ విషాదాన్ని దిగమింగి అనేక అవమానాలను ఎదుర్కొని తన కుమారుడిని గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దడం దేశ చరిత్రలో మరువలేనిది. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడంలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. విద్యా, వైద్యానికి, సేద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పల్లెలకు కూడా అభివృద్ధి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎల్లో మీడియాకు కనిపించడంలేదా? అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో వీటికి తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు ప్రజల మనస్సు తెలుసు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం జగన్ను ఆ ధర్మమే కాపాడుతుంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో సంస్కరణలు, వికేంద్రీకరణ ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే జగన్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించాలి. అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న జగన్ అధికారం అంటే తాను మాత్రమే ఎదగడం, తన వర్గం వారు మాత్రమే బాగుపడడం అనుకునే స్వార్థపరుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మోసాలు, అబద్ధాలతోనే కాలం గడిపారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందేలేదు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న నాయకుడు జగన్. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ఈ విజయం సీఎం జగన్, కార్యకర్తలదే – పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా.. సమైక్య పోరాటంతో అధికారంలోకి వచ్చిన గొప్ప చరిత్ర వైఎస్సార్సీపీది. మనం 13 ఏళ్లలో సాధించిన ఘనత మరే పార్టీకి లేదు. ఈ విజయానికి కారణం ఒకరు సీఎం వైఎస్ జగన్ అయితే.. మరొకరు పార్టీ కార్యకర్తలు. ఈ ప్లీనరీ జగన్ సైనికులకు పెద్ద పండగలాంటిది. దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉండాలో 2004, 2009లో వైఎస్సార్ పరిచయం చేశారు. పారదర్శకత కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు ఆయన. వైఎస్సార్ సంకల్పాన్ని, ఆశయాలను సీఎం జగన్ నిజంచేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి – నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం. ఆయన, ఆయన వర్గం బాగుపడితే చాలనుకునే స్వార్థపరుడు. రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అధికారంలోకి రాగానే నూజివీడులో రాజధాని అని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా తుళ్లూరులో తన వర్గీయులతో భూములు కొనిపించి తర్వాత పేదల భూములను బలవంతంగా లాక్కొన్నాడు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేమని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే చంద్రబాబు కుట్రలతో పంటలు తగలబెట్టించాడు. అభివృద్ధి అనేది ఒకేచోట కేంద్రీకృతం కారాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం మరోసారి జరగకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి. -
రైతుల భూముల్ని చంద్రబాబు లాకున్నారు: నందిగం సురేష్
-
త్రోబాల్ క్రీడాకారుడికి రూ.25 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, గుంటూరు(తాడికొండ): భారత త్రోబాల్ జట్టు మాజీ కెప్టెన్ చావలి సునీల్కు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ చెక్కును మంత్రి ఆర్కే రోజా, ఎంపీ నందిగం సురేష్ శుక్రవారం సునీల్కు అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన చావలి రాజు కుమారుడు సునీల్ 2012 నుంచి అనేక ఏళ్ల పాటు భారత త్రోబాల్ జట్టుకు కెప్టెన్గా సేవలందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సునీల్ ఆయన వద్దకు పలుమార్లు వెళ్లి ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేశారు. కానీ చంద్రబాబు పట్టించుకోకపోవడంతో దళితుడైన సునీల్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూనే ఆటను కొనసాగించారు. అనంతరం పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ను కలిసిన సునీల్.. తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక న్యాయం చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఇటీవల సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి సునీల్కు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా, ఎంపీ సురేష్ శుక్రవారం సునీల్కు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సునీల్ కెప్టెన్గా ఎన్నో మ్యాచ్లలో భారత్ను విజయాల బాటలో నడిపించారని ప్రశంసించారు. తన ప్రతిభను గుర్తించి.. ఆర్థిక సాయం అందించినందుకు సీఎం జగన్, మంత్రి రోజా, ఎంపీ సురేష్కు సునీల్ కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్లను అభినందించిన సీఎం జగన్) -
అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి టీడీపీ ఆటంకం సృష్టించింది
-
‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’
సాక్షి, అమరావతి: అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతిలో చంద్రబాబు నాలుగు బిల్డింగ్లు కూడా కట్టలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి టీడీపీ ఆటంకం సృష్టిస్తోందన్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చంద్రబాబు అనుకున్నారు. చదవండి: 'నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే' అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆకాంక్ష. చంద్రబాబు కట్టిన బినామీ రాజధానిని కోదండరామ్ పరిశీలించాలి. చంద్రబాబు చేసిన అక్రమాలు కోదండరామ్ లాంటి మేథావులు తెలుసుకోవాలన్నారు. దళితుల భూములు ఏవిధంగా లాక్కున్నారో కోదండరామ్ తెలుసుకోవాలని నందిగం సురేష్ అన్నారు. అమరావతిలో ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యమని’’ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. -
ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాస్
జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. కాగా ‘ఆటో రజిని’ యూనిట్ గురువారం సాయంత్రం నందిగం సురేష్ ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను వైఎస్ జగన్కి చూపించారు. శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ..‘‘ హై ఓల్టేజ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆటో రజిని’. ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నందిగం సురేష్ అన్న, హరి కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ను ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ నేతృత్వంలో చిత్రీకరించాం. జూన్ 10 నుంచి తర్వాతి షెడ్యూల్ విజయవాడలోనే ప్రారంభిస్తాం. మా సినిమా షూటింగ్కి సహకరించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. -
నేను చంద్రబాబు టైపు కాదు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఒక సైనికుడిగా పనిచేయడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో కలిసి పాల్గొన్నారు.మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కొడాలి నానికి.. పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఐతే ఈ సందర్భంగా తనను పార్టీ నాయకులు, శ్రేణులు మాజీ మంత్రి అని పిలవడంపై కొడాలి తన దైన శైలిలో స్పందించారు. తనను ఎవరూ మాజీ మంత్రి అని పిలవొద్దని కొడాలి నాని కోరారు. గుడివాడ ఎమ్మెల్యేగానే తాను ఉండటానికి ఇష్టపడతానని మంత్రి పదవి పోతే బాధపడనని తెలిపారు. కానీ ఎమ్మెల్యే పదవి పోతేనే బాధ పడతానని స్పష్టం చేశారు. తానేమీ చంద్రబాబు లాంటి వ్యక్తిని కానని.. బాబు లాంటి వారే పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారంటూ తీవ్రంగా విమర్శించారు. చదవండి: పోలవరం డయాఫ్రమ్ వాల్ నష్టం ఎవరి పాపం?: అంబటి ఏపీ శ్రీలంక అవుతుందని 420 గ్యాంగ్, చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తెలిపారు. దేవుడు లాంటి వైఎస్సార్ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందని గుర్తుచేశారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తాని స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని విమర్శించారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ తెల్ల మొఖం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నాడన్నారని మండిపడ్డారు. చదవండి: ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు -
హీరోతో కలిసి ఎంపీ నందిగం సురేశ్ సందడి.. ఫోటోలు వైరల్
సాక్షి, చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నగరంలోని జక్కంపూడి కాలనీలో సోమవారం సినిమా షూటింగ్తో సందడి వాతావరణం నెలకొంది. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హరికృష్ణ హీరోగా ఆటో రజనీ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ సమీప ప్రాంతాల్లో టైటిల్ సాంగ్ను చిత్రీకరణ చేయగా, హీరోతో కలిసి ఎంపీ నందిగం సురేశ్ స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హరికృష్ణ మాట్లాడుతూ.. ఆటో రజనీ పూర్తి మాస్ చిత్రమని, ఇందులో తాను రజనీకాంత్కు వీరాభిమాని పాత్ర చేస్తున్నానన్నారు. ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సీఎం జగన్ అభిమాని క్యారెక్టర్ చేయాలని కోరడంతో తాను ఒప్పుకున్నట్లు చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారని, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అత్యధిక షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని వివరించారు. -
సంక్షేమానికి కోతలు సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: పరిమితికి మించి టీడీపీ హయాంలో చేసిన అప్పులకు ప్రస్తుతం నికర రుణపరిమితిలో ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు రాయితీలు తగ్గించడం సబబు కాదన్నారు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్, ఎంపీ నందిగం సురేశ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్తో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారని చెప్పారు. ఎరువులు, ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య రంగంలో సబ్సిడీలను తగ్గిస్తే ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. మూలధన వ్యయం పెరిగిందని కేంద్రం చెబుతోందని, ప్రభుత్వ రంగ సంస్థల రుణాల చెల్లింపులు పోగా గతేడాదితో పోలిస్తే మూడు శాతం మాత్రమే పెంచారని తెలిపారు. రూ.7.5 లక్షల కోట్లకు పెంచినట్లు కేంద్రం ప్రకటించినందున ఏపీకి సాయం చేయాలని కోరారు. ఆ నిధులు సమకూరిస్తే విభజన హామీలన్నీ నెరవేరతాయన్నారు. జీఎస్టీ, పెట్రోలు, డీజిలు సెస్సులు బట్టి చూస్తే రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్లకుపైనే వడ్డీ రుణాలు అందించవచ్చన్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు విషయంలోనూ ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలను చూసైనా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు హితవు పలికారు. చదవండి: AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ బఫూన్ అని అభివర్ణించారు. మాట తీరు, వ్యవహార శైలి మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే విపక్ష నేత చంద్రబాబు సహించలేకపోతున్నారని ఎంపీ నందిగం సురేశ్ విమర్శించారు. -
నందిగం సురేష్కు బాబూరావు క్షమాపణ
ఉద్దండరాయునిపాలెం (తాడికొండ): కొందరు వ్యక్తులు తనను ఆర్థికంగా ఆదుకుంటానని ప్రలోభపెట్టి ఎంపీ నందిగం సురేష్పై ఆరోపణలు చేయించారని బత్తుల బాబూరావు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసు ఉద్యోగానికి దూరమైన బత్తుల బాబూరావు సిఫార్సు నిమిత్తం ఎంపీ నందిగం సురేష్ను కలవగా దాడి చేశారనే కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఎంపీని కలిసి క్షమాపణ చెప్పారు. ఆదివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నందిగం సురేష్ నివాసానికి వెళ్లిన బాబూరావు తీరని అన్యాయం చేశానని ఎంపీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అవినీతికి ‘సీమెన్స్’ ముసుగు కొందరు వ్యక్తులు తనను ప్రలోభాలకు గురిచేసి ఆదుకుంటానని చెప్పినందున అలా మాట్లాడానే తప్ప ఈ వ్యవహారం రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం అవుతుందని తాను ఊహించలేదన్నారు. జరిగిన ఘటనలో ఎంపీ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కొన్ని చానళ్లలో వస్తున్న కథనాలు ఉద్దేశపూర్వకంగా, తనను తప్పుదారి పట్టించి మాట్లాడించిన మాటలే తప్ప వాటిలో నిజం లేదన్నారు. -
శ్రీశైలం, సాగర్లకు ‘డ్రిప్’ అమలు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: డ్యామ్ల భద్రత, కార్యాచరణ, పనితీరును మెరుగుపరచటానికి ఉన్న కేంద్ర పథకం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద శ్రీశైలం, నాగార్జునసాగర్లకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని, ప్రాజెక్టుల అభివృద్ధి పనులను మెరుగుపరచాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. కృష్ణాబోర్డు పరిధిలోని ఈ డ్యామ్ల భద్రత, నిర్వహణ సక్రమంగా చేయాలని, ఇందుకోసం జలశక్తి శాఖ ప్రత్యేక నిర్వహణ బృందాన్ని నియమించాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఆనకట్ట వైండింగ్ పూల్ ప్రమాదస్థితిలో ఉందని తెలిపారు. 2020లో నీటి ఉధృతికి నాగార్జునసాగర్ కుడికాల్వ గేటు విరిగిపోవడంతో చాలా నీరు వృథాగా పోయిందని చెప్పారు. వీటి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి: ఎంపీ సత్యనారాయణ విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించిందని గుర్తుచేశారు. ఒడిశాలోని ఓఎండీసీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భారీ పెట్టుబడులు పెట్టిందని, కానీ నేటివరకు ముడిసరుకు ప్లాంటుకు చేరలేదని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు అనుమతులు ఇవ్వడం లేదని, ఇది శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్లాంటుకు ఇనుప ఖనిజం గనులను కేటాయించి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. నిర్వహణకు అవసరమైన విడిభాగాలు, బ్యాటరీలు అందుబాటులో లేవని తెలిపారు. వీటిని సమకూర్చాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలి: ఎంపీ చింతా అనూరాధ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ చింతా అనూరాధ కేంద్రాన్ని కోరారు. ఏడేళ్లుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. వరద నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయండి: నందిగం సురేశ్ ఇటీవలి అకాల వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, పంటలు భారీగా దెబ్బతిని ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. వారిని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం అందించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. కులగణన చేపట్టాలి: ఎంపీ తలారి రంగయ్య దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా వికేంద్రీకరణ జరగాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య కేంద్రాన్ని కోరారు. దేశంలో 75 శాతం సంపద 10 శాతం జనాభా చేతిలో ఉందని చెప్పారు. ఈ అసమానతలు పోవాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని కోరారు. -
బద్వేలు తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది
-
బద్వేల్ తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్: నందిగం సురేష్
సాక్షి, అమరావతి: విహార యాత్రకు వచ్చినట్టు చంద్రబాబు ఏపీకి వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు ఇళ్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. వీరంతా రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తులుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. చదవండి: బద్వేలు బ్లాక్ బస్టర్ ‘‘చంద్రబాబు ఫ్యామిలీ ఓట్లు కుప్పంలో లేవు. చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చే వారిని ప్రజలు నమ్మరు. అమరావతిలో ఇళ్ల పంపిణీని అడ్డుకుంది చంద్రబాబు కాదా?. బద్వేల్ తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది. పాదయాత్ర పేరిట అమరావతి జనాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు తాపత్రయం అంతా కొంతమంది ప్రయోజనాల కోసమేనని’’ నందిగం సురేష్ దుయ్యబట్టారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ‘‘బద్వేల్లో ఓడింది టీడీపీ, జనసేన కూడా. బీజేపీకి 21 వేల ఓట్లు ఎలా వచ్చాయనేది ఆలోచించాలి. చంద్రబాబు పరోక్షంగా సహకరించి ఓట్లు వేయించాడు. ఎన్నికకు దూరం అంటూనే బీజేపీ మద్దతు పలికి తన బుద్ధి ఏమిటో స్పష్టం చేశాడు. సీఎం వైఎస్ జగన్ ఓటు పులివెందులలో ఉంటే.. చంద్రబాబు, లోకేశ్ ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయి. అమరావతిలో చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారు. తాను అనుకున్న బినామీ రాజధాని కోసం పేదలకు ఇళ్లు ఇస్తే మురికి కూపం అవుతుందన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్నింటితో పాటు అభివృద్ది చేస్తారు. అక్కడి వారిని రెచ్చగొట్టి చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారు. ఈ యాత్ర రాయలసీమ నుంచి కూడా వెళ్తుంది. వారికి ఏమి సమాధానం చెప్తారు’’ అంటూ సురేష్ ప్రశ్నించారు. -
'ఆటో రజని' మూవీ ప్రారంభం, క్లాప్ కొట్టిన ఎంపీ నందిగం సురేష్
-
ఎక్కడైనా మృతదేహం ఉంటే రాబందుల కంటే ముందు లోకేష్ వెళ్తున్నారు.
-
రాబందుల కంటే ముందే వాలిపోతున్న లోకేశ్ : నందిగం సురేష్
సాక్షి, అమరావతి: గుంటూరులో బీటెక్ విద్యారి్ధని రమ్య హత్య దురదృష్టకరమని, ఈ సమయంలోను టీడీపీ నేత లోకేశ్ వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన లోకేశ్ వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తల్ని కొడుకులని తిట్టడం ఏమిటని నిలదీశారు. బూతులు తిట్టినంతమాత్రాన నాయకుడు కాలేరనే విషయాన్ని లోకేశ్ గ్రహించాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరులసమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా మృతదేహం ఉంటే రాబందుల కంటే ముందు లోకేశ్ వాలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీలను వేధింపులకు గురిచేయడంబాబుగారి పేటెంట్ అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యం చేసి, బూతులు తిట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం వేగంగా స్పందించింది ఘటన జరిగిన తర్వాత పోలీసులు, ప్రభుత్వం వేగంగా స్పందించినట్లు చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే నిందితుడ్ని గుర్తించి, గంటల్లోనే అరెస్టు చేశారన్నారు. హోంమంత్రి సుచరిత వెళ్లి బాధితులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. హంతకుడిని శిక్షించే విషయంలో ప్రభుత్వం, పోలీసువ్యవస్థ ఎక్కడా రాజీపడబోవని స్పష్టం చేశారు. ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా సీఎం జగన్ సహించరని చెప్పారు. రమ్య హత్యపై సీఎం జగన్ చాలా సీరియస్గా ఉన్నారని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వంలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని, తప్పు జరిగితే ఎలాంటి వ్యక్తులనైనా శిక్షించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
బినామీ ఉద్యమానికి దళితుల రంగు
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది ఉద్యమం కాదని, ఉన్మాదమని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా విమర్శించారు. అమరావతి ఉద్యమం ఎందుకు? ఎవరికోసం చేశారో బాబుతో సహా అందరికీ తెలుసన్నారు. అమరావతి అనే బినామీ ఉద్యమానికి ఇప్పుడు చంద్రబాబు సరికొత్తగా దళితుల రంగు వేయాలని ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం అంటూ వచ్చిన పసుపు మహిళల సామాజికవర్గం ఏమిటో అందరికీ తెలుసని, పట్టుమని పదిమంది కూడా లేని ఆ గ్రూపులో ప్రతి ఒక్కరు మిలియనీర్లు లేదంటే బాబు బినామీలు లేదంటే బాబు ఆత్మబంధువులే అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని నిలదీశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. దళితులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మనసంతా అమరావతి భూముల మీదే ఉందన్నారు. దమనకాండ అంటే.. బషీర్బాగ్లో మాదిరి రైతుల గుండెలపై తుపాకులు పేల్చి చంపేయడం, గుర్రాలతో తొక్కించడం అని చెప్పారు. బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. అమరావతిలో జరిగేది ఆస్తుల ధరలు కాపాడుకోవటం కోసం ఉన్మాదుల్లా తయారైన బాబు బినామీలు చేసే రియల్ ఎస్టేట్ ఉద్యమం అని పేర్కొన్నారు. మామూలు రోజుల్లో ఒక్కరూ కనిపించరు మామూలు రోజుల్లో అమరావతి దీక్షల్లో ఒక్కరూ కనిపించరని, ధర్నాలు, 600వ రోజుల పండుగలకు మాత్రం జనాలు పోగవుతారని, ఇదంతా లేని ఉద్యమానికి హైప్ క్రియేట్ చేయడం కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో దళితుల ప్రయోజనాల్ని అణగదొక్కినవారే రోడ్లెక్కి మాట్లాడుతుంటే దళిత సమాజం నవ్వుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో దళితులను అణగదొక్కడంలో చంద్రబాబుది ప్రత్యక్షపాత్ర అయితే, పరోక్షపాత్ర ఈనాడు, ఏబీఎన్, టీవీ5లదన్నారు. అమరావతి పేరుతో 600వ రోజు ఉద్యమం సందర్భంగా మాట్లాడిన భాష జుగుప్సాకరమని, రాష్ట్ర ప్రజలంతా చూశారని చెప్పారు. చంద్రబాబుకు ఎప్పుడు కష్టాలు వచ్చినా దళితులను తెరపైకి తెస్తాడని, వారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తాడని విమర్శించారు. దళితులను వంచించి అసైన్డ్ భూముల కొనుగోలు దళితులను వంచించి అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, ల్యాండ్ పూలింగ్ డ్రామా జరుగుతున్న రోజుల్లో గొంతెత్తిన దళితులను అధికార వ్యవస్థతో బెదిరించడం.. వీటిని అన్యాయం అంటారని, ఇవి చేసింది టీడీపీ నేతలేనని చెప్పారు. చంద్రబాబు అసలు అమరావతిలో ఎక్కడ అభివృద్ధి చేస్తే, అది ఎక్కడ ధ్వంసం అయిందో నిరూపిస్తే బాగుండేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ఇప్పటికైనా అమరావతి వాసులు మద్దతివ్వాలని కోరారు. అంతేగానీ కులపిచ్చి, డబ్బుపిచ్చి, అధికారం పిచ్చితో మాట్లాడే చంద్రబాబుకు కొమ్ముకాయవద్దని హితువు పలికారు. -
రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నట్టుగా చంద్రబాబు డ్రామా
-
చంద్రబాబుకు పేదల గురించి మాట్లాడే హక్కే లేదు: నందిగం సురేష్
సాక్షి, తాడేపల్లి: దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, బాబు హయాంలో అమరావతి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసమే చంద్రబాబు దళితులను అడ్డుపెట్టుకుంటారని దుయ్యబట్టారు. ధర్నాలు, దీక్షలప్పుడే జనాలు ఉంటారని, బినామీల ఆస్తులు రక్షించుకోవడానికే ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నట్టుగా చంద్రబాబు డ్రామా చేస్తున్నారని, 53వేల మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమం ఎందుకు? ఎవరికోసం చేశారో బాబుతో సహా అందరికీ తెలుసన్నారు. అమరావతి ప్రాంతం మురికివాడగా మారుతుందని బాబు ఆరోపించారని, దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమ దీనిబట్టే అర్ధం అవుతుందని విరుచుకపడ్డారు. దళితులు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా.. సొంతింట్లో ఉండకూడదా అని సూటిగా ప్రశ్నించారు. బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని, బాబుకు పేదల గురించి మాట్లాడే హక్కే లేదని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. -
సామాజిక న్యాయంలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అందించాలన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇందులో భాగంగా మంత్రివర్గ కూర్పు మొదలు నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. శనివారం ఆమె విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునలతో కలసి 137 నామినేటెడ్ పదవులకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎస్సీలకు ఒకట్రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కేవని, వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఐదు మంది ఎస్సీలకు స్థానం కల్పించారని చెప్పారు. సామాజిక న్యాయం ఎలా సాధించాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంత్రి చెల్లబోయిన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల వారి చేతుల్లో రాజకీయ అధికారం ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. తొలిసారిగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్దే అని పేర్కొన్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. పేదరికాన్ని జయించాలన్న లక్ష్యంతో చేస్తున్న ఈ యజ్ఞంలో అందరం భాగస్వాములం కావాలన్నారు. చరిత్రాత్మక నిర్ణయం పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న వర్గాలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. దానికి పూర్తి భిన్నంగా అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఒక గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకోసం పరిపాలన పరంగా, వ్యవస్థ పరంగా, సంస్థాగతంగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. – మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యుడు సమ సమాజ స్థాపనే సీఎం లక్ష్యం సమ సమాజ స్థాపన కోసం సమాజంలో అందరూ సమాన స్థాయిలో ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. తనను నమ్మిన వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గుర్తింపునిస్తూ ప్రజా సంక్షేమ పాలనలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. సీఎం నిర్ణయాలతో దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తోంది. – నందిగం సురేష్, ఎంపీ ఆచరణలోకి అంబేడ్కర్, పూలే ఆశయాలు అణగారిన వర్గాల సామాజిక స్థితిగతులను మెరుగు పరచాలన్న బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలు ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతున్నాయి. ఇన్నాళ్లూ పుస్తకాల్లో చదువుకున్న సామాజిక న్యాయం, పేద ప్రజల అభివృద్ధి అన్నవి ప్రస్తుతం రాష్ట్రంలో ఆచరణాత్మకంగా చూస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు మార్చి, వారికి రాజకీయంగా సామాజికంగా గౌరవం కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారు బాట పరుస్తున్నారు. – మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతతో సుపరిపాలన సాగిస్తున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి ద్వారా సామాజిక న్యాయం, మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు కలిపి రాబోయే మూడేళ్లలోనే 15 ఏళ్ల అభివృద్ధిని సాధించడం ముఖ్యమంత్రి లక్ష్యం. ఎన్నికల ముందు బీసీ డిక్లేరేషన్లో, పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులకు చైర్పర్సన్లను ఆయనే స్వయంగా ఎంపిక చేశారు. కొన్ని పదవులకు సంబంధించి ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ కోసం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించిన 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఎంపికయ్యారు. గతంలో మాదిరిగా నామినేటెడ్ పదవులు కేవలం అలంకార ప్రాయం కాదు. రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన మహాయజ్ఞంలో కీలకంగా ఉండే బాధ్యతాయుతమైన పదవులు. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి -
కోవిడ్ కట్టడికి అన్ని చర్యలు: హోంమంత్రి మేకతోటి సుచరిత
సాక్షి, గుంటూరు: కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కరోనా బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, నిర్లక్ష్యంగా ఉండకుండా అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు నంబూరులోని కల్వరి టెంపుల్లో కోవిడ్కేర్ సెంటర్ను మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్ , కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ దంపతులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సూచరిత మాట్లాడుతూ.. కరోనాతో ప్రపంచ మానవాళి అంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, సెకండ్ వేవ్లో అనేక కుటుంబాలు కోవిడ్ బారిన పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బైబిల్లో చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకుని ఇలా సేవ చెయ్యడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కల్వరి టెంపుల్ బ్రదర్ సతీష్ను అభినందించారు. జాగ్రత్తగా ఉండాలి పేదవారికి ఉచిత మందులు, ఆహారం అందించేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయమన్నారు. ఇక్కడ ప్రార్ధించడంతోపాటు సేవ చెయ్యడం అభినందనీయమన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ప్రతి రోజు 25వేలకు పైగా పెరుగుతున్నాయని, కర్ఫ్యూ పెట్టినా కొంత మంది నిర్లక్ష్యం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండడం ఇతరులకు మంచి చేసినట్లే అవుతుందని, ప్రభుత్వం కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి అన్ని రకాల సదుపాయాలు అందిస్తుందన్నారు. వివక్ష చూపవద్దు.. అండగా ఉందాం బ్రదర్ సతీష్ కుమార్ మన వంతు ఏమి చెయ్యాలి అని ఆలోచించి కల్వరి టెంపుల్లో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. కోవిడ్ వల్ల మనకు తెలిసిన వాళ్ళ చాలా మంది చనిపోతున్నారని, కోవిడ్ వచ్చిన బాధితులపై వివక్షత చూపవద్దని, వారికి మానసిక అండగా ఉందామని సూచించారు. కోవిడ్ వచ్చిన వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలని, కోవిడ్ వచ్చిన వారిని దూరంగా పెట్టొద్దని హితవు పలికారు. అందరం కలిసి కట్టుగా ఈ కోవిడ్ మహమ్మరిని తరిమి కొడదామని, బ్రదర్ సతీష్ చేసే మంచి పనులుకు అందరం సహకరిస్తామని తెలిపారు. ఇక్కడ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేసే నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఏపీ: కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజన్ బస్సులు పోలవరం ప్రాజెక్ట్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం -
చంద్రబాబు, నారా లోకేశ్పై డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ల స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న టీడీపీ అధికార ఫేస్బుక్ అక్కౌంట్లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టింగ్లు పెట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్కుమార్.. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు.. టీడీపీ ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను ఆధారాలతో సహా అందజేశారు. టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లో ‘ఒకప్పుడు జగన్రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడిగా ఉన్నాడని, ఎందుకంటే వైఎస్సార్సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛలేదు. అందుకే ఈసారి వినిపిద్దాం తిరుపతి గొంతు.. లోక్సభలో లక్ష్మి గొంతు’ అంటూ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి వత్తుతున్నట్టు ఫొటో సృష్టించి ఉంచారని తెలిపారు. ‘ఆంధ్రుల హక్కుల కోసం గళమెత్తువారు కావాలా? పెద్దిరెడ్డి కాళ్లకు మసాజు చేసేవారు కావాలా?’ అని పేర్కొంటూ పోస్టర్లో పనబాక లక్ష్మి ఫొటో పెట్టి టీడీపీకి ఓటు వేయండి అంటూ పోస్టులు పెట్టారని వివరించారు. ఈ పోస్టింగ్ల ద్వారా గురుమూర్తిని ప్రజల దృష్టిలో బహిరంగంగా అవమానించి, మానసికంగా బాధించారని, గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్టు దళిత జాతి యావత్తు భావిస్తోందని తెలిపారు. సోషల్ మీడియాలో వాటిని ట్రోల్ చేస్తూ గురుమూర్తిని కించపరిచిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, టీడీపీ ఫేస్బుక్ అక్కౌంట్లో పెట్టిన తప్పుడు పోస్టింగ్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు బాధ్యులైన చంద్రబాబు, లోకేశ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టి వారిని అరెస్టు చేయాలని కోరారు. -
సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇదంతా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ బాపట్ల లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్.. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిపైన పిటిషన్ వేయగానే టీడీపీ వాళ్లు నానా హైరానా చేశారని, మరి అదే పిటిషన్ కొట్టి వేస్తే మాత్రం టీడీపీ, పచ్చ మీడియా నోరు మెదపలేదన్నారు. రఘురామకృష్ణంరాజు తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని లోక్ సభ స్పీకర్కు చెప్పారని, మరి తన పార్టీ అధ్యక్షునిపై పిటిషన్ వేసిందాన్ని ఏమంటారో ఆయనకే తెలియాలని అన్నారు. ఆయన ఎన్ని ఫిర్యాదులు చేసినా, పిటీషన్లు వేసినా ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కాదా ఇలాంటి పనులు చేస్తున్నావంటూ ప్రశ్నించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాముడని ప్రజలే తేల్చారన్నారు. అందుకే 151 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు రాక్షసులతో కలిసి పనిచేస్తున్నారని, వాళ్లకి ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారన్నారు. ఇక నైనా ఆ విషయాన్ని ఆయన తెలుసుకుని నడుచుకుంటే మంచిదని హితవు పలికారు. ‘ఢిల్లీలో కూర్చొని వైఎస్సార్సీపీ ఎంపీ అని చెప్పుకుని మాట్లాడటం కాదు. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి’ అంటూ సవాల్ విసిరారు. ఎప్పటికైనా ఆయనకు తగిన శాస్తి జరగక తప్పదని జోష్యం చెప్పారు. ( చదవండి: పవన్ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా ) -
లోపల తాగటం, బయట వాగటం రఘు రామకృష్ణంరాజుకు అలవాటు
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం లభిస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ఎస్సీలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అమరావతిలో దళితుల భూములను కొట్టేసిన ఘనుడని అన్నారు. సంత్ గురు రవిదాస్ 644వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సంస్కరణలను తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితులంతా సంఘటితంగా ఉండాలన్నారు. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంటివారు చాలా అరుదుగా ఉంటారన్నారు. అతి సామాన్యుడనైన నన్ను ఎంపీగా చేయడం, తిరుపతిలో డాక్టర్ గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపటం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సంత్ గురు రవిదాస్ తరువాత వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగజ్జీవన్రామ్, పూలే వంటి మహనీయులు అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమరవల్లి బాల కోటయ్య, కృష్ణా జిల్లా అధ్యక్షుడు అప్పికట్ల రాము, విజయవాడ పట్టణ అధ్యక్షుడు కె.ఏసుదాసు, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 400 మంది డప్పు కళాకారులు, చర్మకారులు వైఎస్సార్సీపీలో చేరగా.. నేతలు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. -
దమ్ముంటే చర్చకి రండి నందిగం సురేష్
-
'పక్కా ప్లాన్ ప్రకారమే భూముల్ని కొట్టేశారు'
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు అసైన్డ్ భూములను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చంద్రబాబు, ఆయన బినామీలు పేదల భూములను చౌకగా కొట్టేశారని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలను మార్చి తమ వారికి లబ్ధి చేకూర్చారన్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని కప్పి పుచ్చుకోవడానికి స్టింగ్ ఆపరేషన్ అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ దళిత సోదరుడైతే చంద్రబాబు మోసం చేశాడని నా దగ్గరకు వచ్చాడో...అతన్ని టీడీపీ మీడియా భయపెట్టి అనుకూలంగా చెప్పించుకుంది. దాన్నో స్టింగ్ ఆపరేషన్ అని చెప్పుకుంటున్నారు . మేమంతా అప్పట్లోనే దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాము. 1920లో బ్రిటిష్ ప్రభుత్వం వారికి డీకే పట్టాలు ఇచ్చారు. ఆ భూములను కూడా పక్కా ప్లాన్గా కొట్టేశారు. Pot, poa చట్టాలను అతిక్రమించి చంద్రబాబు ఏమి చేసాడో స్టింగ్ ఆపరేషన్లో తేల్చాల్సింది. ఇప్పుడు స్టే మీద ఉన్నాడు..మళ్లీ కేసు వచ్చేసరకి ఎదో చేయాలని ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. అసైన్డ్ భూములు అమ్మకూడదు...కొనకూడదు..మరి ఎలా కొట్టేశారు. మీరు నిజంగా ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని ఉంటే దళితులకు పెద్దపీట వేసి వారి భూములు వారికి ఉంచొచ్చు కదా. రాజధానిలో దళిత సోదరుడు ఉండకూడదని నీచంగా వ్యవహరించిన వ్యక్తులు చంద్రబాబు, నారాయణ బహిరంగ చర్చకు రండి. సైనికులకు ఇచ్చిన భూమి 10 ఎళ్ల తర్వాత సైనికుడి సొంతం అవుతుంది. దాన్ని కూడా చట్టాలని ఉల్లంఘించి మరీ కొట్టేశారు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 3 ఏళ్లలో సింగపూర్ తరహా అద్భుతమైన రాజధాని కడతాను అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. 'రాజధాని శంకుస్థాపనకు అగ్రవర్ణాలకు పట్టు వస్త్రాలు పెట్టి పిలిచారు. అదే దళిత ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పెరు కూడా శిలాపలకంపై లేదు. ఇప్పుడు కూడా దళితులను బెదిరిస్తూనే ఉన్నారు ఇవాళ రాజధాని రైతుల దుస్థితికి కారణం ఎవరు..? చంద్రబాబు కాదా..? మూడేళ్ళలో రాజధాని అని దండుకుని పక్కకెళ్లాడు.ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని తండ్రి కొడుకులు ఇటువైపు ముఖం చూపడం లేదు. అన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి...దమ్ముంటే చర్చకి రండి..లేదంటే కేసును ధైర్యంగా ఎదుర్కోవాలి' అని నందిగం సురేష్ డిమాండ్ చేశారు. చదవండి : బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్? -
పిట్టకథలు, జోస్యం చెప్పుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గానికి కూడా వెళ్ల లేక ఢిల్లీలోనే కూర్చుంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సాయంత్రం పూట పిట్టకథలు, జోస్యం చెప్పుకోవచ్చని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ హితవు పలికారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం ఎక్కడుందో తెలియని వ్యక్తి ఇతరుల గురించి జోస్యం చెప్ప డం కన్నా తన భవిష్యత్తు తెలుసుకోవడం మంచిదన్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద శుక్రవారం ఎంపీ సురేశ్ మీడియాతో మాట్లాడా రు. ‘రాజధాని ప్రాంతంలో ఏమున్నాయో తెలియని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తుంటే జాలి వేస్తోంది. చేసిన తప్పులకు అడ్డదారిలో స్టేలు తెచ్చుకొన్నప్పటికీ నియోజకవర్గానికి వెళ్లడానికి భయపడుతున్నారు. సాయంత్రం వేళ చిలక, పేకముక్కలతో జ్యోతిష్యం చెప్పుకో వచ్చు. దళితులు ఎవరితోనూ మాట్లాడకూడ దంటున్న ఆ వ్యక్తికి అసలు మానవత్వం, విలు వలు ఉన్నాయా? పతనానికి ముందు గర్వం నడుస్తుందన్న మాటలు ఆ వ్యక్తికే సరిగ్గా సరిపో తాయి. అమరావతిలో భూములు కొల్లగొట్టిన దాంట్లో ఆయన పాత్ర ఉందేమో అన్న అను మానం వస్తోంది..’ అని సురేశ్ పేర్కొన్నారు. -
టీడీపీ నేతలు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారు
-
నియోజకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెట్ల కింద కూర్చొని ప్రజలకు సిగ్గులేదంటూ పాటలు పాడేవారికి ప్రజల విలువ తెలియదని, నియో జకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుందని వైఎస్సార్సీపీ ఎంపీలు నందిగం సురేష్, రెడ్డెప్ప వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. దొంగలా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తనకేదో అయిపోయినట్లు భావించే వారికి త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన మోసాలు, అక్ర మాలకు నోటీసులు ఇస్తే రఘురామకృష్ణరాజు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశా రు. వీధికుక్కలా మొరిగేవారిని మీడియా పట్టిం చుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు ఎప్పు డు జైలుకు వెళ్తారా? పగ్గాలు అందుకుందామని లోకేశ్ ఆరాటపడుతున్నట్లుగా ఉందన్నారు. రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ నడిబొడ్డున సమా ధానం చెప్పగలమన్నారు. కుప్పంలో గెలుస్తా మని చెప్పి గెలిచామని మరోసారి ఎన్నికలు వస్తే ప్రస్తుతం కన్నా ఎక్కువ శాతం సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
నూతన వధూవరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి/తాడికొండ: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మేనల్లుడు జగదీష్ వివాహ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. గురువారం గుంటూరు జిల్లా ఉద్ధండరాయుని పాలెంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులు జగదీష్, జాక్లిన్ రోజ్ దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. (చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి) రాబడి పెరగాలి: సీఎం జగన్ -
ఢిల్లీ రైతు ఉద్యమంతో మీది పోలికా!?
సాక్షి, అమరావతి: బినామీ భూముల కోసం పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతిలో చంద్రబాబునాయుడు చేస్తున్న డ్రామాను.. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంతో పోల్చడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నందిగం సురేష్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు ఇది పరాకాష్టని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ఓ పార్టీ ప్రయోజనాలను ఆశించి, చంద్రబాబు బినావీులు.. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం జరుగుతున్న దానినీ పోరాటం అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇళ్ల పట్టాలను అడ్డుకోవడం ఘోరం తమ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే.. కోర్టుకెళ్ళి అడ్డుకోవడం దారుణమన్నారు. వీరిలో దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారని.. వీరందరికీ చంద్రబాబు శత్రువేనని నందిగం మండిపడ్డారు. రెండు పత్రికలు, మూడు టీవీ ఛానళ్లు కలిసి చంద్రబాబు అమరావతి పోరాటంపై ఊదరగొట్టినంత మాత్రాన రైతులు ఎవరు?, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎవరు? చంద్రబాబు బినామీలు ఎవరో ప్రజలు తెలుసుకోలేని అవివేకులు కారన్నారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు ద్రోహిగానే చరిత్రలో మిగిలిపోతారని.. మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన ఆయనను రైతులవరూ నమ్మరని నందిగం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు, నాలుగు పంటలు పండే భూములను తన స్వార్ధం కోసం బలవంతంగా లాక్కున్న రైతు ద్రోహి చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు. భూములివ్వని రైతుల తోటలు, పశువుల పాకలు తగులబెట్టించాడని, కేసులు పెట్టి కన్నీళ్లు తెప్పించిన దుర్మార్గుడని ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి రైతులను వంచించాడని.. ఇలాంటి వ్యక్తి సంక్రాంతికి పంచె కట్టి, తానూ రైతునని చెబితే రాష్ట్రంలో ఏ రైతు నమ్మడంలేదని నందిగం సురేష్ ఎద్దేవా చేశారు. రైతు అన్న పదం పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. -
‘అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు’
సాక్షి, గుంటూరు : అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పేదవాడికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని ఎంపీ మండిపడ్డారు. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని, నిజమైన రైతులు, పేదవాళ్లు ఎవరూ దీక్షలు చేయడంలేదని పేర్కొన్నారు. పేదవాడిపై ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందకుండా కోర్టుల్లో టీడీపీ నేతలు పిటిషన్లు వేస్తున్నారని, వారిపై ఏమాత్రం ప్రేమ ఉన్నా కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన నదిగం సురేష్ పేదల ఇళ్లను బాత్రూమ్లతో పోల్చిన సంస్కారహీనులు చంద్రబాబు, లోకేష్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి చంద్రబాబు బినామీ రాజధాని అని విమర్శించారు. అమరావతి రైతులను బెదిరించి చంద్రబాబు భూములను దోచుకున్నారని అన్నారు. త్యాగం చేయడమంటే ఉచితంగా భూములు ఇవ్వడమని తెలుసుకోవాలని హితవు పలికారు. -
ఆంధ్రాకు టూరిస్టు చంద్రబాబు
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు బినామీ భూములను చూసుకునేందుకే టూరి స్టులా అమరావతికి విచ్చేశారని, వచ్చి రావటంతోనే కుట్రలు మొదలుపెట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. దోచేసిన, కాజేసిన భూములు అమరావతిలో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో 54 వేల ఇళ్లు ప్రభుత్వం ఇస్తుంటే కోర్టుకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. పేదలకు వాటా లేని రాజధాని కట్టుకోవాలన్న బాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారన్నారు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాడతారని, కానీ చంద్రబాబు సంపాదన, దోచేసిన సొమ్ము, కాజేసిన భూములు కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం నడిపిస్తున్నారని నందిగం సురేష్ ధ్వజమెత్తారు. -
ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ ఇంటి ఎదుట రైతుల ముసుగులో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ, 52వేల మందికి ఇళ్ల పట్టాలివ్వాలని ఎంపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన బహుజన పరిరక్షణ సమితి నేతలు రాగా.. వారికి, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో మానవహారం చేపట్టిన బహుజన పరిరక్షణ సమితి నేతలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దాడికి నిరసనగా బహుజన పరిరక్షణ సమితి ఆందోళన నిర్వహించింది. అమరావతి దీక్షా శిబిరం వైపు వెళ్లడానికి బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: ఏలూరు ఘటన: 292కి చేరిన బాధితులు) -
దళితుల్ని కించపర్చే వ్యాఖ్యలు చేస్తే సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దళితులంతా ఒకటై నడుస్తున్నారని.. ఎవరైనా దళితుల్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎంపీ నందిగం సురేష్ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో దళితులకు మేలు కలుగుతోందన్న అక్కసుతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక దళిత మేధావి పది మందిని పోగేసి దళితులపై దాడులు జరిగిపోతున్నాయంటూ.. చంద్రబాబు తరహాలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఆ మాటల్ని మాట్లాడాల్సింది చంద్రబాబు దుర్మార్గపు పాలనలోనే అని.. ఆ మేధావికి ఇప్పుడే గొంతు వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులాల కుంపట్లు పెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు దళితుల కళ్లను దళితులతోనే పొడిపించాలని చూస్తున్నారన్నారు. దళితులు వాస్తవాల్ని గ్రహించి.. దళిత పక్షపాతి ఎవరు, దళిత ద్రోహి ఎవరో తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. కొందరు దళిత నాయకులు చంద్రబాబు తొత్తులుగా మారి మేధావులమంటూ మాట్లాడుతున్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న దళిత మేధావులు చంద్రబాబు అరాచక పాలనలో ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో ఆత్మ వంచన చేసుకుని మాట్లాడొద్దని.. ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దళితుల ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తే దళితులుగా తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. కానీ.. చంద్రబాబు ప్రయోజనాల కోసం చేస్తే మాత్రం చులకన అవుతారని పేర్కొన్నారు. -
ట్రాక్టర్నే కాదు, పార్టీని కూడా కొల్లేరులోకే!!
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దళితులంతా ఏకంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేశ్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో దళితులకు మేలు జరుగుతోందని చంద్రబాబు అక్కసుతో ఉన్నారని అన్నారు. సీఎం జగన్ను ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులను కించ పరిచే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్కు అండగా ఉన్నారని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ సురేశ్ శనివారం మీడియాతో మాట్లాడారు. దళితుల ముసుగులో చేసే ఉద్యమంలో జై భీమ్ బదులు జై చంద్రబాబు అంటే బాగుంటుందని నందిగం సురేశ్ ఎద్దేవా చేశారు. దళిత మేధావి అంటూ ఒకరు చంద్రబాబు యూజర్గా మారారని విమర్శించారు. దళితులకు అన్యాయం జరుగుతోందని చెప్తున్న ఆ మేధావి రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని కొత్త గళం వినిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో హిట్లర్ నియంత పాలన సాగిందని గుర్తు చేశారు. బాబు హయంలో జరిగిన అన్యాయంపై ఆనాడే ప్రశ్నించి ఉండాలని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో ఈ మేధావులు పుట్టుకొస్తున్నారని చురకలంటించారు. అప్పుడేమయ్యారు! చంద్రబాబు దళిత పిల్లల ఫీజులు ఎగ్గొట్టినప్పుడు ఈ మేధావి ఏమయ్యాడని ఎంపీ నందిగం సురేశ్ సూటిగా ప్రశ్నించారు. బాబు డైరెక్షన్లో కాకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుటుందని హితవు పలికారు. పేదలకు ఇళ్లు, ఇంగ్లీషు విద్యకు అడ్డుపడవద్దని చంద్రబాబుకు ఈ మేధావి చెప్పాలని అన్నారు. 2024 లో అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదని ఎంపీ సురేశ్ జోస్యం చెప్పారు. ఆ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ కొల్లేరులో ట్రాక్టర్ నెట్టాడని, పార్టీని కూడా నెట్టుతాడని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని విమర్శించారు. -
బినామీల కోసమే బాబు అమరావతి ఉద్యమం
సాక్షి, అమరావతి: అమరావతిలో తన బినామీలు నష్టపోకూడదని టీడీపీ చేయిస్తున్న కృత్రిమ ఉద్యమానికి మద్దతుగా ఎల్లో మీడియాలో ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాతలు రాయిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ ధ్వజమెత్తారు. రెండు రోజుల క్రితం ‘జైలు ముట్టడి’ పేరుతో కొందరు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటే దాన్ని ‘నిర్బంధ కాండ’ అంటూ చంద్రబాబుకు వత్తాసు పలికే ఆ రెండు పత్రికలు, టీవీ చానెళ్లు అభూతకల్పనలు వండి వార్చాయని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు బాబు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏదైనా జరిగితే ప్రభుత్వంపై నెట్టాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఉద్యమం.. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న ఉద్యమాన్ని రైతుల ఉద్యమంగా చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సింగపూర్ టెక్నాలజీతో అమరావతిని తీర్చిదిద్దుతాను.. రైతులు సెంట్ స్ప్రే చేసుకుని ఏసీ రూముల్లో పడుకోవడమే తరువాయి అని ఊదరగొట్టారు. అప్పుడు కూడా ఎల్లో మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు కృత్రిమ ఉద్యమం కోసం జరగని దాన్ని జరిగినట్లుగా చిత్రీకరిస్తోంది. దళితుల్లో చిచ్చుపెట్టేందుకే దళితులపైనే దాడులు చేయించి దళితుల్లో చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. నమ్మిన వారిని నట్టేట ముంచే నైజం ఆయనది. దళితులు, రైతుల జీవితాలతో బాబు చెలగాటమాడుతున్నారు. ఆయన మోసాన్ని అమరావతి ప్రజలు గుర్తించాలి. ఇరవై తొమ్మిది గ్రామాలకే నాయకుడుగా చంద్రబాబు మిగిలిపోతారు. -
వెన్నుపోటు పోడవటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
-
దళితులను అడ్డుపెట్టుకొని బాబు రాజకీయం
సాక్షి, అమరావతి: అమరావతి రైతుల జీవితాలతో గతంలో ఆడుకున్నది.. ఇప్పుడు ఆడుకుంటున్నది.. ప్రతిపక్ష నేత చంద్రబాబేనని, అధికారంలో ఉండగా తన సొంత సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే బాబు.. అధికారం కోల్పోయాక దళితులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు బేడీలు వేశారని తెలిసిన మరుక్షణమే సీఎం వైఎస్ జగన్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. అమరావతి రైతులకు బేడీలు వేశారంటూ దళిత మేధావులు అని చెప్పుకునే కొంతమంది చంద్రబాబు తొత్తులుగా మారి మాట్లాడుతున్నారని, ఇదే రాజధాని ప్రాంతంలో బాబు హయాంలో అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనప్పుడు వీరంతా ఎక్కడికి పోయారని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► అమరావతిలో దళితులు ఉంటే భవిష్యత్తులో తన ఆటలు సాగవని చంద్రబాబుకు భయం పట్టుకుంది. అధికారంలో ఉంటే పక్కన దాయాదులను, అధికారంలో లేకపోతే దళితులను బాబు అడ్డు పెట్టుకుంటారు. ► అమరావతిలో జరుగుతున్నది ఒకటి, టీడీపీ చెప్తోంది మరొకటి. సీఎం వైఎస్ జగన్ దళితులకు, పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే అడ్డుకుంటోంది చంద్రబాబే. ► కరెంట్ చార్జీల పెంపుపై బషీర్బాగ్లో రైతులు ఆందోళన చేస్తే అన్నదాతల గుండెల్లోకి తూటాలు దించిన నీచ చరిత్ర చంద్రబాబుది. ► ఇసుక రీచ్ల వద్ద దోపిడీకి అడ్డుపడుతున్నారని పది మందిని భారీ వాహనాలతో తొక్కించి చంపింది చంద్రబాబే. పుష్కరాల్లో ఎంతమందిని చంపారో ప్రజలకు తెలుసు. ► చంద్రబాబు దుర్మార్గాలకు ఎక్కువగా ఇబ్బందులు పడింది దళితులే. ఆనాడు నన్ను అరెస్ట్ చేసి 48 గంటలపాటు చిత్రహింసలు పెట్టినప్పుడు ఈ దళిత మేధావులంతా ఏమయ్యారు. నేను దళితుడినే కదా, ఒక్కరైనా వచ్చి పరామర్శించారా? ► దళితుల కళ్లను దళితులతోనే పొడిపించే వ్యక్తి చంద్రబాబు. ఆయనకు తబలా బృందంగా కొదరు దళిత మేధావులు మారిపోవటం బాధాకరం. ► ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా చంద్రబాబును ఓడించారు. కాబట్టి వారి జీవితాలతో ఆడుకోవాలని బాబు చూస్తున్నారు. ► దళితులకు అండగా నిలిచే ప్రభుత్వం ఇది. దళితులకు ఏ కష్టం వచి్చనా వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాయకులు అండగా ఉంటారు. ► బాబు కుయుక్తులకు దళితులు బలికావొద్దు. ఆయన చెప్పారని తప్పుదారిలో నడవొద్దు. చంద్రబాబు ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలి. -
చంద్రబాబు దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా?
సాక్షి, అమరావతి : బషీర్ బాగ్ కాల్పుల్లో అనేక మందిని పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దళితులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ.. మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారిని అడ్డుపెట్టుకొని బాబు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఒక దళిత ఎంపీపై రాడ్లతో దాడికి దిగితే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులకు బేడీలు వేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆనాడు అసైన్మెంట్ భూముల రైతులపై చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా అని అడిగారు. తప్పు ఎక్కడ జరిగినా తప్పే కానీ వాళ్లని అమరావతి రైతులని బాబు నానా యాగీ చేస్తున్నారన్నారు. చదవండి: నాపై ఐదుసార్లు దాడికి యత్నించారు ‘ప్రభుత్వం ఎదో చేస్తుందంటూ చంద్రబాబు దళిత కార్డ్ ఉపయోగిస్తున్నారు. ఇది దళితుల ప్రభుత్వం... దళిత జాతిని అడ్డుపెట్టుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేయొద్దు. రైతులకు బేడీలు వేశారని తెలిసింది. అన్యాయం అనిపించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాం. కోట్లాది రూపాయల లబ్ది మీ బంధువులకు ఇచ్చి ఇప్పుడు ఉద్యమం అంటే దళితులని వాడుకుంటున్నారు. లబ్ధి వాళ్ళకి.. పోరాటం మనకా..? మీ ఇద్దరిని ప్రజలు ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు. ముందు ఆ విషయం తెలుసుకుని లోకేష్ మాట్లాడితే మంచిది. రియల్ ఎస్టేట్ తప్ప అమరావతిలో ఏమన్నా జరిగిందా. అక్రమం జరిగింది అంటే నిరూపించు అన్నావు. విచారణ వేస్తే మళ్లీ కోర్టులకు వెళ్ళావు. దళితులు బాగుపడకూడదు అనేది చంద్రబాబు నైజం. మూడు రాజధానుల ఆందోళనకారులను అడ్డుకోవడానికి నీ సామాజిక వర్గం వ్యక్తులను ఎందుకు పంపలేదు. దళిత సోదరులు చంద్రబాబు కుట్రలను తెలుసుకోవాలి’. అని హితవు పలికారు. చదవండి: ‘ఆయన చెప్పినట్లు ఇక్కడ జరగవు’ -
చంద్రబాబూ.. ప్రతిపక్ష నేతవా? బినామీ సంఘాల నాయకుడివా?
సాక్షి, అమరావతి: అమరావతి విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా? లేక బినామీ సంఘాల నాయకుడా? అనేది అర్థం కావడం లేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలకు అడ్డు పడవద్దని లోకేష్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన వారిపై టీడీపీ గూండాలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను కించపరిచేలా బంగారు నగలు ధరించారని, ఖరీదైన దుస్తులతో వచ్చారని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. నిన్నటి ఫోటోలను బయట పెడితే కృత్రిమ ఉద్యమం ఎవరిదో, ఆకలి కేకలు ఎవరివో తెలుస్తాయని చెప్పారు. ఇళ్ల స్థలాలు కావాలన్న పేదలను ఆర్టిస్టులని ఎగతాళి చేయడమే కాకుండా ట్రాక్టర్లతో తొక్కించేందుకు ప్రయత్నించారని చెప్పారు. అమరావతిలోని 29 గ్రామాల్లో తాను, తన సామాజిక వర్గం మాత్రమే ఉండాలని, ఇతరులు ఉంటే చంపేస్తామనే తరహాలో చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని శంకుస్థాపన సమయంలో భూములిచ్చిన అగ్రవర్ణాలను పట్టుబట్టలతో సత్కరించిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మాత్రం దరిదాపుల్లోకి రానివ్వలేదని చెప్పారు. రాజధానికి రెండు నుంచి మూడు వేల ఎకరాలు తీసుకుని మిగిలింది రైతులు అభివృద్ధి చేసుకునేందుకు వదిలేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అని అన్నారు. -
'అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు'
సాక్షి, అమరావతి : అమరావతి జేఏసీ అంటూ టీడీపీ నాయకులు...మరో పక్క పేదవారు దీక్షలు చేసారు.. కొంతమంది నాయకులు మాత్రం పేదవారిని మేక్ అప్ ఆర్టిస్టులు అంటున్నారని.. ఎంపీ నందిగాం సురేశ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..' అమరావతికి వెళ్లి చూద్దాం అక్కడ ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిసులు ఎవరో తెలుస్తుంది. అసలు చంద్రబాబుకి అమరావతికి సంబంధం ఏమిటి? నేను నా సామాజికవర్గం తప్ప ఎవరూ ఉండటానికి వీల్లేదనే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఇళ్ల స్థలాల కోసం వచ్చిన వారిని ఎన్ని మాటలు అన్నారో అందరు చూశారు. ప్రజల తపున పోరాడాల్సిన వ్యక్తి అమరావతి ధనిక రైతుల తరపున మాట్లాడుతున్నాడు. లోకేష్ నిన్న ఇక్కడికి వచ్చి ఉంటే పేదలకు ఇళ్ళు స్థలాల కోసం వినతిపత్రం ఇద్దామనుకున్నాం.. కానీ ఆయన రాలేదు.(చదవండి : పెత్తనం చేస్తే ఒప్పుకోం.. అమరావతి అందరిదీ) ఈ రోజు కిష్టాయపాలెంలో తెలుగుదేశం గూండాలు పేదల పై ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నించారు.అమరావతిలో ఎనిమిదో వింత ఇక్కడే ఉన్నట్లుగా చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు. దళితులు, బీసీలు, మైనారిటీలు తిరగబడితే ఎలా ఉంటుందో మీరు నిన్న చూసారు.దళితులను మోసం చేసినందుకు 5 ఏళ్ళు నిండింది. ఆయన నమ్మకానికి 5 సంవత్సరాలు అనడం హాస్యాస్పదం.33 వేల ఎకరాలు కాదు అన్ని భూములు కలిపితే 53 వేల ఎకరాలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.విచారణ వేయండి అన్నారు...వేస్తే కోర్టులకు వెళుతున్నారు.రఘురామకృష్ణ రాజు పగలు విగ్గు..రాత్రి పెగ్గుతో బిజీగా గడుపుతారని' సురేష్ ఎద్దేవా చేశారు. (చదవండి : అమరావతిలో బరి తెగించిన టీడీపీ నేతలు) -
నాపై ఐదుసార్లు దాడికి యత్నించారు: ఎంపీ సురేష్
సాక్షి, గుంటూరు: పక్కా ప్రణాళికతోనే టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు మారణాయుధాలతో తనపై దాడికి యత్నించాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దళిత వ్యక్తి ఎంపీగా ఎన్నికకావడాన్ని జీర్ణించుకోలేక, ఇప్పటికే తనపై ఐదుసార్లు దాడికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసు పెడితే గంటలో బయటకు వస్తా, కోర్టుకు వెళితే ఒక రోజులో బయటికి వస్తా’’ అంటూ పూర్ణచంద్రరావు మాట్లాడుతున్నారని, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. కాగా తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఎంపీ సురేష్పై దాడికి యత్నించిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. (చదవండి: ఎంపీ నందిగం సురేష్పై దాడికి యత్నం) ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఎంపీ నందిగం సురేష్పై టీడీపీ కార్యకర్త దాడిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయనను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇది హేయమైన చర్య ఒక దళిత వ్యక్తి ఎంపీ అయితే ఇంత అసూయ ఎందుకు? రాజధానిలో భూస్వాములే ఉండాలా? అని ప్రశ్నించారు. దళితులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎంపీ నందిగం సురేష్పై దాడికి యత్నం
-
ఎంపీ నందిగం సురేష్పై దాడికి యత్నం
సాక్షి, ఉద్దండరాయునిపాలెం (తాడికొండ): గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు గురువారం రాత్రి దాడికి యత్నించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరగా.. ఎదురుగా వచ్చిన పూర్ణచంద్రరావు తన బైక్ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు. ఎవరని ప్రశ్నించగా దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతనిని పట్టుకుని వెతగ్గా ఇనుప రాడ్డు బయటపడింది. ఇంతలో నిందితుడు సమీపంలోని అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లోకి పారిపోగా భద్రతా సిబ్బంది మళ్లీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే లోగానే మద్యం మత్తులో ఉన్న పూర్ణచంద్రరావు తనపై దాడికి యత్నించాడని తెలిపారు. -
కుర్రాళ్ల గుండె చప్పుడు
అలీతో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ చిత్రాన్ని తెరకెక్కించిన దిలీప్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘యూత్’. ‘కుర్రాళ్ల గుండె చప్పుడు’ అనేది ట్యాగ్లైన్. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ సమర్పణలో పెదరావురు ఫిల్మ్ సిటీ బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్డౌన్తో ఆగిపోయింది. షూటింగ్ని తిరిగి గోవాలో ప్రారంభించారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘గోవా బీచ్ దగ్గర కొన్ని ఛేజింగ్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. జనవరిలో చివరి షెడ్యూల్ను ఏపీలోని 13 జిల్లాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా కథను, నటీనటుల వివరాలను ప్రస్తుతానికి బహిర్గతం చేయడం లేదు. ఈ సినిమా కాకుండా ‘తను నేనూ ఒక్కటే’ అనే టైటిల్తో మరో సినిమా రూపొందించనున్నాం’’ అన్నారు. -
అది జైభీమ్ సమావేశం కాదు.. జై బాబు రౌండ్ టేబుల్
సాక్షి, అమరావతి: దళిత మేధావుల పేరుతో కొంతమంది విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి జైభీమ్ అనే పేరు కంటే.. జై చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం అని పెడితే బాగుండేదని వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ అన్నారు. ఆ సమావేశంలో చదివిన స్క్రిప్ట్ అంతా చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. ఆయన డైరెక్షన్లోనే నిర్వాహకులు నడిచారన్నారు. అది చంద్రబాబు భజన కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమమే తప్ప దళితులకు మేలు చేసేది కాదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నాయకులు దళితులపై చేసిన దాడులు, దారుణాలపై మాజీ ఎంపీ హర్ష కుమార్, శ్రావణ్ కుమార్ ఏనాడు స్పందించలేదని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో కాకుండా, తనకంటూ సొంత అజెండా ఉందని చెప్పే సత్తా హర్షకుమార్కు ఉందా అని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో దళితులకు ఎంత మేలు జరిగిందో, ఏడాదిన్నర సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎంత మేలు జరిగిందో చర్చిద్దామా?. దమ్ముంటే డేటు, టైం ఫిక్స్ చేయండి. మీతో పాటు చంద్రబాబు, లోకేష్ను కూడా తీసుకురండి. ఎప్పుడైనా, ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం. ► సీఎం జగన్ పరిపాలనలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల మేలుకు చేసే కార్యక్రమాలకు అడ్డుపడకుండా ఆ భగవంతుడు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి. ► దళితులకు సొంత ఇళ్లు ఉండకూడదు, ఎప్పటికీ బానిసల్లా, పాలేర్లుగా ఉండాలన్నదే బాబు కుట్ర. ► హర్షకుమార్, శ్రావణ్ కుమార్లు చంద్రబాబుకు కొమ్ముకాస్తే చరిత్రహీనులుగా మిగులుతారు. మీలానే గతంలో చంద్రబాబు చంకనెక్కి ఆ తర్వాత భూగర్భంలో కలిసిపోయినవారు చాలామంది ఉన్నారు. ► కుళ్లు, కుట్ర, మోసం, వెన్నుపోటు అంటే దేశంలో చంద్రబాబు పేరే చెప్తారు. చంద్రబాబు, లోకేష్ లాంటి వ్యక్తులను నమ్ముకుని దళితుల జీవితాలతో హర్షకుమార్, శ్రావణ్ కుమార్ చెలగాటమాడొద్దు. -
హర్షకుమార్కు సవాల్ విసిరిన నందిగం సురేష్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు తొత్తులుగామారి దళిత జాతికి అన్యాయం చేస్తున్న కొందరు నాయకుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారని, వారంతా జై చంద్రబాబు అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. హర్ష కుమార్ ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశం దళిత జాతి కోసం కాదు చంద్రబాబు భజన కోసమని విమర్శించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన దారుణాలపై హర్ష కుమార్, శ్రవణ్ కుమార్ను ఎందుకు స్పందించలేదని చెప్పారు. అప్పుడు ఎక్కడ దాక్కున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి హోదాలో ఆదినారాయణరెడ్డి దళితులను అవమానిస్తే మీరు ఎక్కడున్నారు. నీకెందుకురా రాజకీయాలు అని చింతమనేని దళితుల్ని దూషించినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా... అన్నప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు గొడవలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబూ లాంటి నీచులు 100 మంది వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు. (చదవండి: చిత్తూరులో అడ్డంగా బుక్కైన టీడీపీ) హర్షకుమార్ టీడీపీలో చేరడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. చంద్రబాబు రాసిన స్క్రిప్టు కాకుండా మీకంటూ సొంతగా స్క్రిప్టు రాసుకునే దమ్ముందా. నిజంగా మీకు దళితుల పట్ల ప్రేముంటే చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అడ్డుకున్నాడో అడగండి. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని నిలదీయండి. దళిత జాతిని మీరు బాగుపడనివ్వరా? చంద్రబాబుకు, లోకేష్కు ధైర్యం ఉంటే హైదరాబాద్లో కూర్చుని మాట్లాడటం కాదు, ఏపీకి రమ్మనండి. మంగళగిరి దెబ్బకి లోకేష్ హైదరాబాద్ పారిపోయాడు. వెన్నుపోటు అని గూగుల్లో కొడితే చంద్రబాబు పేరు వస్తుంది. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో దళితులు ఎంత మేలు జరిగిందో, ఏడాదిన్నర జగన్మోహన్రెడ్డి పాలనలో ఎంత మేలు జరిగిందో చర్చించుకుందాం రండి. దమ్ముంటే డేటు, టైం ఫిక్స్ చేయండి. మీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్ను కూడా తీసుకురండి. ఎప్పుడైనా, ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం’అని ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. (చదవండి: పోలీసు సంస్కరణల్లో ‘ఆంధ్ర’ భేష్) -
మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు
-
బాలు గారికి భారతరత్న ఇవ్వాలి: నందిగామ సురేష్
సాక్షి, విజయవాడ: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం దురదృష్టకరమని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తెలిపారు. నందిగామ సురేష్ మాట్లాడుతూ.. బాలు గారు భౌతికంగా మనకు దూరమైనా, ఆయన పాటలు మనతోనే ఉంటాయని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని, బాలు గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నందిగామ సురేష్ తెలిపారు. కాగా జీవితంలో ఒక్కసారైనా బాలసుబ్రమణ్యం గారిని కలవాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక తనకు తీరలేదని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి, గౌరవానికి, తగినట్టుగా భారతరత్న ఇస్తే ఆయన అభిమానులకు ఊరట కలుగుతుందనే నమక్కం ఉందన్నారు. దీనికి తన వంతు సహాయం చేస్తానని నందిగామ సురేష్ పేర్కొన్నారు. -
రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి
-
రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ : తనను అసభ్య పదజాలంతో దూషించారని రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో కించపరుస్తూ దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘరామకృష్ణం రాజు పదవిని, సెక్యూరిటీని అడ్డంపెట్టుకుని ఎస్సీ వర్గాన్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గురువారం వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారని సెక్యూరిటీ తొలగించాలని వివరించారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఇదివరకే రఘురామకృష్ణం రాజుపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.