-
గృహ నిర్బంధంలో మెహబూబా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆందోళనలు జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను అదుపులోకి తీసుకుంది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులున్నాయంటూ సుప్రీంకోర్టుకు చెబుతున్న కేంద్రం.. ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మెహబూబా ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరుతూ భారీ హోర్డింగులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..మరో వైపు ప్రజల నిజమైన ఆకాంక్షలను అణగదొక్కుతోందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సమయంలో ఇలాంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. తాము శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదని పీడీపీ తెలిపింది. రాజ్భాగ్లో కొందరు పీడీపీ కార్యకర్తలు ‘ఆగస్ట్ 5 బ్లాక్ డే’అనే ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. కాగా, శ్రీనగర్లోని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫీస్లను పోలీసులు మూసివేశారు. -
మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?
ముంబై: బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన తండ్రిని అవమానించిన వారితో చేతులు కలపడం ఆయనను అవమానించడమేనని అన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అధికార బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన విపక్షాలు బీహార్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెహబూబా మఫ్టీ పక్కన కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఒకప్పుడు పీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెహబూబా మఫ్టీ విషయమై మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఆమెతో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. వారు "మోదీ హటావో" నినాదంతో కలిసినట్లు చెబుతున్నారు గానీ వాస్తవానికి "పరివార్ బచావో(మమ్మల్ని కాపాడండి)" అనే నినాదంతో వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. ఈ విపక్షాల సమావేశం వలన మాకు గానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ కలిగే నష్టమేమీ లేదని ఇదే ప్రయత్నం వీళ్ళు 2019లో కూడా చేశారని, ప్రజలు వాస్తవాలను గ్రహించి మళ్ళీ మోదీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. ఇక ఇదే సమావేశంలో లాలూతో కలిసి ఉద్దవ్ థాక్రే చేతులు కలపడమంటే అది తన తండ్రిని అవమానించడమేనని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత చిత్రా కిషోర్ వాఘ్. గతంలో ఓసారి మీ నాన్నను ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. థాక్రే మూలాలు బీహార్లోని ఉన్నాయని నోరుపారేసుకున్నారు. ఆరోజు మీ నాన్న ఏమన్నారో చూసి బుద్ధి తెచ్చుకోండని ఒక వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో బాల్ థాక్రే స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. देखिए उद्धव जी, आपके पिता वंदनीय बाला साहेब ठाकरे जी का ये वीडियो... सुनिए बाला साहेब जी ने लालू प्रसाद यादव को क्या कहा. ये व्हिडीओ देखकर आप समझ जाएंगे कि आपने बाला साहेब ठाकरे जी के विचारों को कैसे मिट्टी में मिला दिया…@OfficeofUT बाला साहेब की भाषा में कहें तो 'लालू के… pic.twitter.com/a85OzVCi70 — Chitra Kishor Wagh (@ChitraKWagh) June 23, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
అప్పటిదాకా పోటీచేయను
శ్రీనగర్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తొలగించిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించేదాకా తాను శాసనసభ సమరంలో అడుగుపెట్టబోనని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం అయిన మెహబూబా బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ రద్దయిన ఆర్టికల్ను పునరుద్ధరించే వరకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగను. ఇది సరైన నిర్ణయం కాదని నాకూ తెలుసు. కానీ ఇది భావోద్వేగంతో తీసుకున్న కఠిన నిర్ణయం. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ రహస్య ఎజెండా కార్యరూపం దాల్చదనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్ను తొలగించింది. ‘ఆర్టికల్ను రద్దుచేసి కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని కేంద్రం చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయితీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన గీటురాయి అన్నపుడు ప్రధాని, హోం మంత్రి వంటి వేరే పదవులు ఎందుకు ? వాళ్లు ఏం చేస్తున్నట్లు ?. కశ్మీర్ ప్రజలను బలహీనపరచి తమ ముందు సాగిలపడేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది’ అని ఆరోపించారు. -
శివునికి జలాభిషేకం చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
-
రాహుల్ యాత్రకు యూపీ నేతలు ముఖం చాటిన..కాశ్మీర్ నేతలంతా కదిలి వస్తారు!
న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం రాహుల్ భారత్ జోడో యాత్రకు తొమ్మిది రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 3న ఢ్లిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదుగా యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు యూపీ నేతలు దూరంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ జమ్ము కాశ్మీర్ నాయకులంతా హాజరయ్యే అవకాశం పూర్తిగా ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఈ యాత్రలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు పాల్గొంటామని ట్వీట్టర్ ద్వారా తమ పూర్తి మద్దతును తెలిపారు. అంతేగాదు సీపీఐకి చెందిన ఎంవై తరిగామి గూప్కార్ కూటమికి చెందిన మరో సభ్యుడు కూడా హాజరవుతారని అంటున్నారు. కాగా, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ వేదికగా.."భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరాల్సిందిగా నన్ను అధికారికంగా ఆహ్వానించారు. అతని అలు పెరగని ధైర్యానికి వందనం. ఫాసిస్ట్ శక్తులను ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తితో నిలబడటం తన కర్తవ్యమని నమ్ముతున్నాను. మెరుగైన భారతదేశం కోసం అతనితో కలిసి పాల్గొంటాను." అని ట్వీట్ చేశారు. ఈ మేరకు భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల కోసం జమ్ము చేరుకున్న కాంగ్రెస్ నేత ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్టాడుతూ..యాత్ర ఇక్కడకు చేరుకోగానే కాశ్మీర్లో జెండా ఎగురవేస్తారని చెప్పారు. యాత్రలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తరిగామి తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఇదిలా ఉండగా, యూపీ నుంచి జయంత్ చౌదరి ఇప్పటికే రానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి దూరమైన అఖిలేష్ యాదవ్ కూడా హజరయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఆయన వస్తారా లేక ప్రతినిధిని పంపుతారా అనేదానిపై స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్తో విభేదిస్తున్న మాయావతి కూడా అధికారికంగా స్పందించ లేదు. ఐతే కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న యాత్ర కాదని స్పష్టం చేసినప్పటికీ పలు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ యాత్రను అడ్డుకునేందుకు ఆప్ కోవిడ్ ప్రోటోకాల్లను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర ఆపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ కూడా రాసింది. దీంతో కాంగ్రెస్ నేత ఈ యాత్రను ఆపేందుకు ఇదోక సాకుగా చెబుతున్నారంటూ మండిపడ్డారు కూడా. (చదవండి: భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement