భారత్, బంగ్లాదేశ్‌ రెండూ ఒక్కటే | No Difference In India And Bangladesh If, Mehbooba Mufti On Minorities | Sakshi
Sakshi News home page

భారత్, బంగ్లాదేశ్‌ రెండూ ఒక్కటే

Dec 2 2024 5:37 AM | Updated on Dec 2 2024 5:37 AM

No Difference In India And Bangladesh If,  Mehbooba Mufti On Minorities

మైనారిటీల అణచివేతపై ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు 

జమ్మూ: భారత్‌లోని మైనారిటీల పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత కొనసాగుతోందని పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులు అణచివేతకు గురవుతున్నారని వింటున్నాం, మరి మన దేశంలోని మైనారిటీలు కూడా అలాంటి అనుభవాలనే చవిచూస్తున్నారు. రెండూ ఒక్కటే. నాకైతే తేడా కనిపించడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు బాగో లేవన్నారు. ప్రఖ్యాత అజ్మీర్‌ దర్గాలో ఏఎస్‌ఐ సర్వే వ్యవహారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దర్గాను కూడా తవ్వేస్తారా. ఇలా ఎంతకాలం?’’ అని ముఫ్తీ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించే శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే 1947 నాటి ఘర్షణలు పునరావృత్తమయ్యే ప్రమాదముంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement