-
స్పీడ్ తగ్గిన హెచ్యూఎల్
న్యూఢిల్లీ: నాలుగో త్రైమాసికంలో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నికర లాభం స్వల్పంగా తగ్గి (1.53%) రూ. 2,561 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఆదాయం రూ. 15,375 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 15,441 కోట్ల కు పెరిగింది. వ్యయా లు రూ. 11,962 కోట్ల నుంచి రూ. 12,100 కోట్లకు చేరా యి.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 61,092 కోట్ల నుంచి రూ. 62,707 కోట్లకు చేరింది. లాభం రూ. 10,143 కోట్లుగా నమోదైంది. బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు.. రూ.1 ముఖ విలువ చేసే షేరు ఒక్కింటికి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. తాత్కాలిక డివిడెండ్ రూ. 18 కూడా కలిపితే పూర్తి సంవత్సరానికి మొత్తం మీద ఒక్కో షేరుకి రూ. 42 డివిడెండ్ ఇచి్చనట్లవుతుందని సంస్థ తెలిపింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 2,259.15 వద్ద క్లోజయ్యింది. -
హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..
హిందుస్థాన్ యూనిలీవర్ హార్లిక్స్ లేబుల్ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’గా పిలిచే హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరీలోకి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది.ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల్లో వచ్చిన సూచనల మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మార్పులు చేయాలని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ను ఆదేశించింది. దాంతో కంపెనీ తన ప్రతిష్టాత్మక ఉత్పత్తి అయిన హార్లిక్స్ ప్రస్తుత కేటగిరీ ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ నుంచి ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్ఎన్డీ)’లోకి మారుస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రితేష్ తివారీ మాట్లాడుతూ..హార్లిక్స్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్ఎన్డీ) లేబుల్కు మారడం వల్ల స్పష్టమైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో ‘హెల్త్ డ్రింక్స్’కు కచ్చితమైన నిర్వచనం లేకపోవడం వల్ల రెగ్యులేటరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలిసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో డైరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడదని తెలిపింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్, లైమ్ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానీయాల కేటగిరీలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపింది.బోర్న్విటా వివాదంబోర్న్విటా వంటి పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ అని లేబుల్ చేయరాదని ప్రభుత్వం ఇటీవల ఈ-కామర్స్ వెబ్సైట్లకు సూచించింది. దేశ ఆహార చట్టాల్లో ఆ వర్గానికి సరైన నిర్వచనం లేదని తెలిపింది. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్యాడ్బరీ బోర్న్విటాలో అధిక చక్కెర కంటెంట్ ఉందని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు వీడియో ద్వారా ఆరోపించిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.. ఎక్కడో తెలుసా..బోర్న్విటా మాతృ సంస్థ మాండలిజ్ ఇండియా ఆ వీడియోను తొలగించాలని సదరు వ్యక్తికి లీగల్ నోటీసు జారీ చేసింది. అయితే వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్యాకేజింగ్, ప్రకటనలు, లేబుల్లను తొలగించాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఆదేశించింది. -
కార్పొరేట్ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వర్గాల్లో పరపతి పెంచుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలు మాజీ బ్యూరోక్రాట్లపై దృష్టి పెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వారిని తమ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించుకుంది. తద్వారా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా ఒక మాజీ బ్యూరోక్రాట్ను నియమించుకున్న నిఫ్టీ 50 కంపెనీల్లో రెండోదిగాను, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో మూడోదిగాను నిలి్చంది. నిఫ్టీ కంపెనీ అయిన లార్సన్ అండ్ టూబ్రో అక్టోబర్లో ఇలా ఒకరిని తీసుకోగా, హెచ్యూఎల్ పోటీ సంస్థలైన డాబర్, కోల్గేట్–పామోలివ్ కూడా అదే బాటలో నడిచాయి. హెచ్యూఎల్లో ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్ అయిన సంజీవ్ మిశ్రా, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ వర్గాలతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తమ పనులు జరిపించుకునే ఉద్దేశంతో కంపెనీలు ఇలా వారిని నియమించుకుంటూ ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని లిస్టెడ్ కంపెనీల్లో 6 శాతం.. తగినంత స్థాయిలో స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకోనందుకు గాను ప్రభుత్వ రంగ కంపెనీలకు ఒకవైపు అక్షింతలు పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు మాత్రం రిటైరైన బ్యూరోక్రాట్లను జోరుగా నియమించుకుంటున్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని లిస్టెడ్ కంపెనీల్లోని స్వతంత్ర డైరెక్టర్లలో మాజీ బ్యూరోక్రాట్ల వాటా 6 శాతంగా ఉంది. అదే మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా టాప్ 200 కంపెనీలను మాత్రమే తీసుకుంటే ఇది మరింత అధికంగా 13 శాతంగా ఉంది. నిఫ్టీ 50లో 26 పైచిలుకు సంస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లను నియమించుకున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్యూఎల్ మొదలైన సంస్థల్లో అత్యధిక సంఖ్యలో మాజీ బ్యూరోక్రాట్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యక్తులవారీగా చూస్తే ఏఎన్ రాయ్ 7 సంస్థల్లో స్వతంత్ర డైరెక్టరుగా ఉండగా అమిత్ కిరణ్ దేవ్ (6 సంస్థల్లో), దీపా గోపాలన్ వాధ్వా.. దినేష్ కుమార్ మిట్టల్.. యూకే సిన్హా ..సుమిత్ బోస్ .. వీరయ్య చౌదరి కొసరాజు తలో అయిదు సంస్థల్లో, సుధా పిళ్లయ్ .. మీరా శంకర్ .. నిరుపమా రావు తలో 4 సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక, అత్యధికంగా మాజీ బ్యూరోక్రాట్లు ఉన్న ప్రభుత్వ రంగయేతర సంస్థలను చూస్తే డాబర్ ఇండియాలో ఆరుగురు ఉన్నారు. ఐటీసీ, భారత్ రోడ్ నెట్వర్క్, అపోలో టైర్స్, సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా)లో నలుగురు చొప్పున .. సెంచరీ ప్లైబోర్డ్స్ (ఐ), వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, లార్సన్ అండ్ టూబ్రో, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్లో ముగ్గురు చొప్పున ఉన్నారు. -
‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’కి భారీ ఊరట
ప్రముఖ దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ సంస్థకు భారీ ఊరట లభించింది. ‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ హెచ్యూఎల్పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఆ కేసును కోల్కతా హైకోర్టు కొట్టిపారేసింది. సంస్థ యాజమాన్యం నిర్ధోషులని తీర్పిచ్చింది. కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)కు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హిందుస్థాన్ యూనిలివర్ సంస్థపై, ఆ కంపెనీ (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు) యాజమాన్యం రెడ్ లేబుల్ టీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ క్రిమినల్ కేసు నమోదు చేశారు. హెచ్యూఎల్ సంస్థ ఆహార కల్తీ నిరోధక చట్టం సెక్షన్ 38, సెక్షన్ 39ని ఉల్లంఘించందని ఆరోపించారు. దీంతో తప్పుగా బ్రాండింగ్ చేస్తున్నందుకు హెచ్యూఎల్ ఉన్నతాధికారులు దోషులని మునిసిపల్ మేజిస్ట్రేట్ నిర్ధారించింది. రూ. 5,000 జరిమానాతో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ శిక్షను కోల్కతా జిల్లా కోర్టు (సెషన్స్ కోర్టు) కొట్టివేసింది. అయితే, తీర్పును మళ్లీ పరిశీలించాలని మున్సిపల్ మేజిస్ట్రేట్కు తిరిగి పంపించింది. సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీపై తప్పుడు ప్రచారం చేసిందనే మున్సిపల్ కార్పొరేషన్ అభిప్రాయంపై స్పందించింది. తప్పుడు ప్రచారం అంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నిరూపించడానికి ట్రయల్ కోర్టు (అప్పీలేట్ కోర్టు) ముందు కేఎంసీ విభాగం ఎప్పుడూ హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తిని ఎందుకు తప్పుగా బ్రాండ్ చేసిందనే కారణాల్ని వివరించలేదని కోర్టు తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్, ఆ సంస్థ అధికారులపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని జస్టిస్ సుభేందు సమంతా గుర్తించారు. కేసును కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ తరఫున న్యాయవాదులు సబ్యసాచి బెనర్జీ, అనిర్బన్ దత్తా, అభిజిత్ చౌదరి, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ తరపున న్యాయవాదులు గౌతమ్ దిన్హా ,అనింద్యసుందర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇమ్రాన్ అలీ, దేబ్జానీ సాహులు తమ వాదనల్ని వినిపించారు. -
ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు?
Surf Excel Success Story : ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్, దాగ్ అచ్చీ హై’ వంటి టీవీ ప్రకటనలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సర్ఫ్ ఎక్సెల్. చిన్న ప్యాకెట్తో మొదలైన సర్ఫ్ ఎక్సెల్ ప్రస్థానం నేడు అమ్మకాల్లో మాతృసంస్థ హెచ్యూఎల్కు చెందిన 50 రకాల ఉత్పత్తులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. అందుకు కారణాలేంటి? మనందరి ఇళ్లలో విస్తృతంగా వినియోగించే సర్ఫ్ ఎక్సెల్ భారతదేశపు మొట్టమొదటి డిటర్జెంట్ పౌడర్. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) 1957లో పెట్రోకెమికల్స్తో తయారు చేసిన ఎన్ఎస్డీ (నాన్-సోప్ డిటర్జెంట్) పౌడర్గా సర్ఫ్ను ప్రారంభించింది. గృహిణులు సౌకర్యంగా వినియోగించుకునేలా 1959లో హెచ్యూఎల్ సర్ఫ్ ఎక్సెల్ను మార్కెట్లో విడుదల చేసింది. సర్ఫ్ అని పిలిచే ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ‘డిటర్జెంట్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. అందుకు అనేక కారణాలున్నాయి. నురగ రావడం లేదని వాషింగ్ మెషీన్లు రాకముందు భారతీయులు బట్టల్ని ఉతకేందుకు సర్ఫ్ వినియోగం వల్ల పొందే ప్రయోజనాలు తెలిసినప్పటికీ సబ్బుల్ని మాత్రమే వాడే వారు. ఎందుకంటే అప్పట్లో సర్ఫ్ ఉపయోగిస్తే ట్యాప్ వాటర్తో బట్టల్ని ఉతికితే నురగ వచ్చేది కాదు. నురగవస్తే బట్టలకున్న మురికి పోతుందని నమ్మేవారు. ఆ నమ్మకమే సర్ఫ్ ఎక్సెల్ వినియోగంలో గృహిణులు విముఖత వ్యక్తం చేసేవారు. ప్రజల్ని నమ్మించి.. ఈ సమస్యనే ఛాలెంజింగ్ తీసుకున్న హెచ్యూఎల్ తమ ఉత్పత్తి సర్ఫ్ ఎక్సెల్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీసింది. బట్టల సోప్తో బట్టలు ఎలా శుభ్రం అవుతాయో.. ట్యాప్ వాటర్లో సర్ఫ్ ఎక్సెల్ను వినియోగిస్తే నురగ రావడమే కాదు, బట్టలు శుభ్రమవుతాయని ప్రజల్ని నమ్మించింది. బహిరంగంగా చేసి చూపించింది. ఫలితాలు రావడంతో ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం, వ్యాపార ప్రకటనలతో సర్ఫ్ ఎక్సెల్ సేల్స్ అమాంతం పెరిగాయి. సర్ఫ్ ఎక్సెల్కు పోటీగా నిర్మా అయితే డిటర్జెంట్ ప్రొడక్ట్లలో సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు, దాని మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోవడంతో.. పోటీగా 1969లలో ‘నిర్మా’ వంటి ఇతర సంస్థలు సైతం డిటర్జెంట్ ఉత్పత్తుల్ని పోటా పోటీగా మార్కెట్లో విడుదల చేశాయి. అలా పోటీకి దిగిన నిర్మా..సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలకు చెక్ పెట్టింది. చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నంలో పుట్టుకొచ్చిన నిర్మా తక్కువ ధరలోనే ఆ కంపెనీకి చెందిన నిర్మా వాషింగ్ ఫౌడర్ కేజీ ప్యాకెట్ ధర రూ.3.50లకు అమ్మగా.. అదే సమయంలో హెచ్ యూఎల్ కంపెనీకి చెందిన సర్ఫ్ ఎక్సెల్ కేజీ సర్ఫ్ ఫౌడర్ ప్యాకెట్ ధర రూ.15కి అమ్మింది. అంతలోనే నష్టాలు దీంతో అప్పటి వరకు డిటర్జెంట్ విభాగంలో రారాజుగా వెలుగొందిన సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. ధర ఎక్కువ కావడంతో సేల్స్ తగ్గాయి. హెచ్యూఎల్కు ఊహించని నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు నిర్మాను ఢీ కొట్టి, నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సర్ఫ్ ఎక్సెల్ యాడ్ కోసం కవిత చౌదరీ (లలితాజీ) ని రంగంలోకి దించింది హెచ్ యూఎల్ బ్రాండ్. ట్రెండ్ సెట్టర్గా లలితాజీ కవితా చౌదరితో వినియోగదారులకు సర్ఫ్ ఎక్సెల్ ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్’ (చౌక - మంచిది) యాడ్ క్యాంపెయిన్ను తయారు చేయించింది. నిర్మా సర్ఫ్ తక్కువ ధరలకు ప్రతి స్పందనగా ఇంటి పేరుగా మారితే.. సర్ఫ్ ఎక్సెల్ లలితాజీ యాడ్ డబ్బు విలువను వివరించేలా తీయడం అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అంతే సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ దశ తిరిగింది. డబ్బు విలువ చెబుతూ తీసిన యాడ్కు కొనుగోలు దారులు ఫిదా అయ్యారు. మళ్లీ సర్ఫ్ ఎక్సెల్స్ను వాడటం మొదలు పెట్టారు. ఇలా సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ విభాగంలో దేశంలోనే తొలి బ్రాండ్ గా చరిత్ర సుష్టించడమే కాదు.. టీవీ చానల్స్లో యాడ్స్ను ప్రసారం చేయించిన బ్రాండ్లలలో సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ తొలిస్థానంలో నిలిచింది. 30ఏళ్ల పాటు చక్రం తిప్పి 30 ఏళ్ల పాటు డిటర్జెంట్ విభాగంలో చక్రం తిప్పిన సర్ఫ్ ఎక్సెల్కు నిర్మా తర్వాత 1991లో భారతీయ స్త్రీల అవసరాల్ని, ఆర్ధిక స్థాయిల్ని అర్ధం చేసుకున్న పీ అండ్ జీ సంస్థ ఎరియల్ను పరిచయం చేసింది. ఎయిరియల్ సైతం ధర తక్కువ కావడం, బకెట్ నీరు, వాషింగ్ మెషీన్లో వినియోగించుకొని బట్టల్ని శుభ్రం చేస్తుంది. మొండి మరకల్ని తరిమికొడుతుందంటూ చేసిన ఏరియల్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటి వరకు సర్ఫ్ ఎక్సెల్, నిర్మాను వాడిని సామాన్యులు ఏరియల్ను వినియోగించుందుకు మొగ్గు చూపారు. ఈ సారి చిన్నపిల్లలతో దీంతో మళ్లీ పునారలోచనలో పడ్డ సర్ఫ్ ఎక్సెల్ ‘దాగ్ అచ్చే హై’ అంటూ మరో యాడ్ను రూపొందించింది. మరక మంచిదే నంటూ చిన్నపిల్లల తీసిన యాడ్లో..మీరే ఏదైనా మంచి పనిచేసినప్పుడు మరక అంటుకుంటే అది మంచిదే అని చెప్పడం మా ఉద్దేశం’ అని చెప్పడంలో మరో మారు తన మార్క్ సేల్ స్ట్రాటజీని అప్లయి చేయడం అది కాస్తా వర్కౌట్ అయ్యింది. ఇలా పదికి పైగా అడ్వటైజ్మెంట్స్తో పాటు ప్రజాదరణతో ఇండస్ట్రీలో సర్ఫ్ బ్రాండ్లలో సర్ఫ్ ఎక్సెల్ ప్రముఖ బ్రాండ్గా కొనసాగుతూ వస్తుంది. రూ.70,000 కోట్ల అమ్మకాల దిశగా ఇటీవల,హెచ్యుఎల్ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,282 కోట్లు) టర్నోవర్ మార్కును దాటేసింది. కంపెనీ పోర్ట్ఫోలియోలో ఈ మైలురాయిని దాటిన మొదటి బ్రాండ్గా ఎదిగింది. సబ్బులు, వాషింగ్ పౌడర్లు, పేస్టుల వంటి ప్యాక్డ్ కన్జూమర్ గూడ్స్ మార్కెట్లో హెచ్యూఎల్ ఆధిపత్యం కొనసాగుతోందనడానికి సర్ఫ్ ఎక్సెల్ సక్సెస్ నిదర్శనంగా నిలుస్తోంది. ఆ బ్రాండే హెచ్యూఎల్ సైతం ప్రీమియం ప్రొడక్ట్లను తయారు చేసేందుకు ఊతం ఇచ్చింది. వెరసీ బ్రాండ్ దేశం మొత్తం డిటర్జెంట్ల మార్కెట్లో అధిక షేర్ వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సర్ఫ్ ఎక్స్ల్ డిమాండ్ను బట్టి 2027 నాటికి రూ.70,000 కోట్ల అమ్మకాలను అధిగమిస్తుందని అంచనా. చదవండి👉 వచ్చేస్తోంది..ఇండియన్ రోడ్ల రారాజు..అంబాసీడర్ ఎలక్ట్రిక్ కార్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్..!
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement