breaking news
cough syrup
-
‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు ఎఫెక్ట్.. తమిళనాడులో ఈడీ సోదాలు
చెన్నై: మధ్యప్రదేశ్ ‘కోల్డ్రిఫ్’(Coldrif Syrup) దగ్గు మందు కారణంగా 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని(Tamil Nadu) శ్రీసన్ ఫార్మా(Sreesan Pharma) సంస్థపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా చెన్నైలో(Chennai) శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఈడీ(Enforcement Directorate) అధికారులు తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids In Tamilnadu) అధికారులు సోమవారం శ్రేసన్ ఫార్మాతో సంబంధమున్న చెన్నైలో ఏడు ప్రదేశాల్లో సోదాలు, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దగ్గు మందు తయారుచేసిన శ్రేసన్ ఫార్మా యూనిట్ యజమాని రంగనాథన్(73)ను ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.#Coldrif #CoughSyrupDeaths pic.twitter.com/zzVw4roe8J— NDTV (@ndtv) October 13, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాల నేపథ్యంలో శ్రేసస్ ఫార్మా కంపెనీలో తనిఖీ చేయగా.. సిరప్లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండగా దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్రిఫ్ సిరప్ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్రిఫ్ను నిషేధించాయి.ఇదిలా ఉండగా.. ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్లో రిజిస్టర్ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఇచ్చే గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (GMP) సర్టిఫికెట్ లేకుండానే దశాబ్దాల పాటు ఫార్మా సంస్థ నడిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలిపారు. దీంతో, ఫార్మా కంపెనీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ఆ దగ్గు మందు మా దగ్గరకు రాలేదు: అమెరికా స్పష్టం
వాషింగ్టన్: భారతదేశంలో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ అమెరికాకు రాలేదని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ధృవీకరించింది. భారత్లో ఒక దగ్గు మందు కారణంగా పలువురు చిన్నారులు మరణించినట్లు వస్తున్న ఆరోపణల గురించి తమకు తెలిసిందని అమెరికా పేర్కొంది. ఈ ఉత్పత్తులు భారతదేశం నుండి మరే ఇతర దేశానికి ఎగుమతి కాలేదని ఎఫ్డీఏ పేర్కొంది. విషపూరిత మందులు అమెరికాలో ప్రవేశించకుండా చూసే విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని ఎఫ్డీఏ పేర్కొంది. అలాగే అమెరికా మార్కెట్ చేస్తున్న మందులు సురక్షితంగా, అత్యున్నత నాణ్యతతో ఉండేలా నిర్ధారించుకోవాలని తయారీదారులను ఎఫ్డీఏ కోరింది. భారతదేశంలో విక్రయిస్తున్న కొన్ని రకాల దగ్గు, జలుబు మందులలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉందనే వార్తల నివేదికల గురించి తమకు తెలిసిందని యూఎస్ ఎఫ్డీఏ తెలిపింది.మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందులపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ తరహా దగ్గు మందుల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, దేశంలో ఔషధ ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించడంపై చర్చించారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 14 మంది చిన్నారులు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. ఔషధ నమూనాలలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు తెలిపారు.ఈ ఘటన దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది.కోల్డ్రిఫ్ సిరప్కు తమిళనాడులో సంబంధిత ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా, దానిలో డైథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉందని, దీనిని తీసుకున్నప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని, చివరికి మరణానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. రాజస్థాన్లోని భరత్పూర్, సికార్లలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ హెచ్బీఆర్ సిరప్ కారణంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో జైపూర్లోని కేసన్ ఫార్మా సరఫరా చేసిన 19 రకాల మందులను నిలిపివేసినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ తెలిపారు. మధ్యప్రదేశ్లో దగ్గు మందు కారణంగా చిన్నారుల మరణాల దరిమిలా తమిళనాడు ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ స్టోర్లు, హోల్సేల్ డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టింది. -
ఆ దగ్గు సిరప్లను ఉపసంహరించాం
న్యూఢిల్లీ/చెన్నై/ఛింద్వారా: దేశంలో తయారైన కోల్డ్రిప్, రెస్పిఫ్రెష్టీఆర్, రిలైఫ్ అనే దగ్గు సిరప్లను మార్కెట్ నుంచి ఉపసంహరించినట్లు సెంట్రల్ డ్రగ్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీవో) తెలిపింది. అదేవిధంగా, ఈ సిరప్ల ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఉపసంహరించుకున్న దగ్గు సిరప్లలో ఏ ఒక్కటి కూడా విదేశాలకు ఎగుమతి కాలేదని కూడా స్పష్టం చేసింది. భారత్లో దగ్గు సిరప్ వాడకంతో కిడ్నీలు ఫెయిలై, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకరమైన ఈ ఔషధాలను ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయా తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీడీఎస్సీవో స్పందించి డబ్ల్యూహెచ్వోకు ఇచ్చిన సమాధానంలో పై విషయాలున్నాయి. ఈ దగ్గు సిరప్లలో ఇథలీన్ గ్లైకాల్, లేదా డై ఇథలీన్ గ్లైకాల్ మరేదైనా కల్తీ జరిగినట్లు గుర్తించారా అనే విషయం తమకు తెలియజేయాలని కూడా డబ్ల్యూహెచ్వో కోరింది. ఇలాంటివి గుర్తిస్తే వాటి సరఫరా విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కూడా కోరింది. మధ్యప్రదేశ్లో కల్తీ దగ్గు సిరప్ తాగి 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్లను అప్రమత్తం చేసింది. ఔషధ తయారీ యూనిట్లను తనిఖీ చేసి, సరైన ముడిపదార్థాలను వాడుతున్నారా లేదా గమనించాకే వాటిని మార్కెట్లోకి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్మధ్యప్రదేశ్లో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ను తయారు చేసే చెన్నైలోని శ్రేసన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న అతడిని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన సిట్ అధికారుల బృందం, తమిళనాడు పోలీసుల సాయంతో బుధవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకుంది. 22కు చేరిన చిన్నారుల మరణాలు మధ్యప్రదేశ్లో కల్తీ దగ్గు మందు తాగి, కిడ్నీలు ఫెయిలై చనిపోయిన చిన్నారుల సంఖ్య గురువారానికి 22కు చేరుకుంది. ఛింద్వారాకు పొరుగునున్న మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల విశాల్, నాలుగేళ్ల మయాంక్ సూర్యవంశీ బుధవారం రాత్రి చనిపోయారని అధికారులు తెలిపారు. -
కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం
చెన్నై: కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది చిన్నారుల మరణాలకు కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ ఫార్మాసూటికల్స్ కంపెనీ యాజమాని జి.రంగనాథన్(73)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జి. రంగనాథన్(G Ranganathan) మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఫార్మసీ గ్రాడ్యుయేట్. గత 40 ఏళ్లుగా ఔషధ తయారీ రంగంలో ఉన్నారు. 80వ దశకంలో ప్రోనిట్(Pronit) అనే పోషక సిరప్ను తయారు చేసి చెన్నైలో ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత లిక్విడ్ నాసల్ ప్రొడక్ట్స్(ముక్కు డ్రాప్స్), చిన్న స్థాయి తయారీ యూనిట్లను చెన్నై పరిసరాల్లో స్థాపించారు. శ్రేసన్తో పాటు సీగో ల్యాబస్, ఇవెన్ హెల్త్కేర్ సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు ఔషధ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు కూడా. అయితే మధ్యప్రదేశ్ చిన్నారుల మరణాల నేపథ్యంలో.. శ్రేసన్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. కోడంబాక్కంలోని రంగనాథన్ కార్యాలయాన్ని సైతం అధికారులు సీజ్ చేశారు. ఆయన అరెస్టును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే..తమిళనాడు కాంచీపురం శ్రేసన్ ఫార్మాసూటికల్స్ యూనిట్ నుంచి మే నెలలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (Cough Syrup) బ్యాచ్ను పలు రాష్ట్రాలకు పంపింది. ఈ క్రమంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కలిపి 20 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో కోల్డ్రిఫ్ను నిషేధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. మరణాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసింది. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే.. కోల్డ్రిఫ్లో డైఈథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పదార్థం మోతాదుకు మించి(500 రేట్లు) 48.6% స్థాయిలో ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇదే పిల్లల్లో కిడ్నీలను కరాబు చేసి.. వాళ్ల మరణాలకు దారి తీసింది. తమిళనాడు ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ట్మెంట్ తనిఖీల అనంతరం తీవ్ర ఉల్లంఘనలను గుర్తించి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న శ్రేసన్ యూనిట్ను మూసేసింది. 2011లో ఏర్పాటైన ఈ యూనిట్.. ఆ తర్వాతి కాలంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదు. అలాగే అక్కడి అపరిశ్రుభ వాతావరణం, నిబంధనలకు పాటించకుండా కెమికల్స్ కొనుగోలు నేపథ్యంతో ఉత్పత్తి లైసెన్స్నూ రద్దు చేసింది. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం.ఇదీ చదవండి: కోల్డ్రిఫ్.. తయారీ.. యాక్ ఛీ! -
దగ్గు సిరప్ వివాదం.. కాంచీపురం యూనిట్ మూసివేత
చెన్నై/కాంచీపురం: మధ్యప్రదేశ్లో 20 మంది వరకు చిన్నారుల మృతికి కారణమని భావిస్తున్న దగ్గు మందు తయారీ ప్లాంట్ను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో సిరప్ కోల్డ్రిఫ్ తాగిన చిన్నారులు కిడ్నీలు ఫెయిలై మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణల తో ఈ సిరప్ విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీనే నిషేధం విధించింది. మార్కెట్లో ఉన్న స్టాక్ను తొలగించాలని స్పష్టం చేసింది. సిరప్లో ప్రమాదకర రసాయనా లున్నా యంటూ పరీక్షలు జరిపిన రాష్ట్ర ఔషధ విభాగం ప్రకటించింది. తక్షణమే కోల్డ్రిఫ్ ఉత్పత్తిని నిలిపి వేయాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మందును మధ్యప్రదేశ్, కేరళ కూడా నిషే ధించాయి. కోల్డ్రిఫ్ సిరప్ విక్రయాలను నిలిపివే యా లంటూ పుదుచ్చేరి, ఒడిశా ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. కోల్డ్రిఫ్లో ప్రమాదకర డై ఇథిలీన్ గ్లైకాల్ 48.6 శాతం కనిపించడంపై వివరణ ఇవ్వాలని కంపెనీకి రెండో సారి నోటీసు ఇచ్చామని మంత్రి మా సుబ్రమణియన్ చెప్పారు. ఇప్పటికే ఇదే విషయంలో ఈ నెల 3న మొదటి నోటీసు పంపించామన్నారు. కంపెనీ వివరణ ఎలా ఉన్నా చట్టపరమైన క్రిమినల్ చర్యలు మాత్రం తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నోటీసులకు స్పందించని ఆ కంపెనీ పూర్తిస్థాయి మూసివేతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.చెన్నైలో మధ్యప్రదేశ్ సిట్కోల్డ్రిఫ్ మరణాలపై దర్యాప్తునకు ఏర్పాటైన మధ్యప్రదేశ్ సిట్ బృందం చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఫార్మా కంపెనీ కార్యాలయానికి వెళ్లి, అవసరమైన పత్రాలను సేకరించింది. అదేవిధంగా, కాంచీపురంలోని సీల్ వేసిన కంపెనీ యూనిట్ను పరిశీలించింది. అవసరమైన వివరాలను తెల్సుకుంది. -
వామ్మో దగ్గు మందు!
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కోల్డ్రిఫ్ కేసులో ఇప్పుడు సంచలన విషయం ఒకటి బయటపడింది. చిన్నారుల మరణాలు, అస్వస్థత నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ను అప్రమత్తం చేసింది. ఆ విభాగం కాంచీపురంలోని కోల్డ్రిఫ్ దగ్గు మందు(Coldrif Syrup) తయారైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్లో(Sresan Pharmaceuticals) అక్టోబర్ 1, 2 తేదీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో 16 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ తయారీని చూసి అధికారులు సైతం విస్తోపోయారట!. ఎన్డీటీవీ ఇచ్చిన కథనం ప్రకారం.. తయారీ కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఆ యూనిట్లో గ్యాస్ స్టవ్లపైనే రసాయనాలను వేడి చేస్తున్నారు. తుప్పుపట్టిన పరికరాలు, మురికి పట్టిన పైపులు. గ్లౌజులు, మాస్కులు లేకుండా సిబ్బంది పదార్థాలను మిక్స్ చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. అక్కడున్న కార్మికుల్లో దాదాపుగా అనుభవం లేనివారే ఉన్నారు. వీటికి తోడు.. స్వచ్ఛత పరీక్షలు జరపకుండానే సిరప్ల కోసం నీటిని ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్ఈపీఏ(HEPA) వ్యవస్థ(అత్యంత సూక్ష్మ ధూళి, బ్యాక్టీరియా, వైరస్ను 99.97% వరకు తొలగించగలిగే శుద్ధి వ్యవస్థ)లు లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచిందట. అలాగే.. చెన్నైలోని రెండు ప్రముఖ కంపెనీల నుంచి కెమికల్స్ను నగదు రహిత లావాదేవీల ద్వారా ఇండస్ట్రీయల గ్రేడ్ కెమికల్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రొపైలీన్ గ్లైకోల్ లాంటి కీలక పదార్థాన్ని ఫార్మాస్యూటికల్ ప్రమాణాలు లేని పెయింట్ పరిశ్రమ డీలర్ల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అన్నింటికి మించి.. డైఈథిలీన్ గ్లైకాల్(Diethylene glycol)ను టెస్టింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా సిరప్లలో కలిపారు.SR-13 డేంజర్ బ్యాచ్.. కోల్డ్రిఫ్ కఫ్ సిరప్.. SR-13 బ్యాచ్ ఈ యూనిట్లోనే ఈ ఏడాదిలోనే తయారయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో ఈ సిరప్లు.. మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి మార్కెట్లోకి వెళ్లాయి. అయితే.. ఇందులో డైఈథిలీన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్లు బయోప్సీ నివేదికలు వెల్లడించాయి. ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు ఎక్కువ. ఈ పదార్థం.. కిడ్నీ, కాలేయం, నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఆగస్టు–సెప్టెంబర్ మధ్య చింద్వారా జిల్లాలో చిన్నారులు మరణించారని తెలుస్తోంది. ఫార్మాకోవిజిలెన్స్ లేకపోవడం, అనుభవం లేని సిబ్బంది, నీటి స్వచ్ఛత పరీక్షలు లేకపోవడం, వెంటిలేషన్,, పెస్ట్కంట్రోల్ లేకపోవడం.. ఇలా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ 39 క్రిటికల్, 325 మేజర్ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్ఏర్పాటు చేసింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు.. శ్రేసన్ కంపెనీ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, స్టాక్ ఫ్రీజ్, లైసెన్స్ సస్పెన్షన్ విధించారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం: ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ చేసింది. డ్రగ్ కంట్రోలర్ దినేష్ మౌర్యను ట్రాన్స్ఫర్ చేసింది. సిరప్ను రిఫర్ చేసి ఇద్దరు పిల్లల మరణానికి కారణం అయ్యాడంటూ ఓ డాక్టర్ను అరెస్ట్ చేసింది. అయితే.. ఇది కేవలం ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి మాత్రమే కాదు.. రసాయనాల కొనుగోలు నుంచి, తయారీ, పంపిణీ వరకు మొత్తం వ్యవస్థ వైఫల్యం అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్డీటీవీ వద్ద వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సిరప్తో చనిపోతే.. డాక్టర్ తప్పెలా అవుతుంది? -
దగ్గు మందు డేంజర్ బెల్స్! అసలేం జరిగిందంటే..
దగ్గు సిరప్ తాగి చిన్నారులు (Cough Syrup Deaths) చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన కథనాల నేపథ్యంతో పిల్లలకు దగ్గు మందు వాడే విషయంలో తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. శని, ఆదివారాల్లో కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్కు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. అలాగే మరణాలకు కారణంగా భావిస్తున్న సిరప్ ఉత్పత్తిదారుపైనా కేసు నమోదు అయ్యింది. మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో పలువురు చిన్నారులు కోల్డ్రిఫ్ (ColdriF) అనే దగ్గు సిరప్ తీసుకున్న కారణంగా చనిపోయారు. ఇటు రాజస్థాన్లోనూ మూడు మరణాలు సంభవించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బేతుల్ జిల్లాలో పేరెంట్స్కు ఈ సిరప్ను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఇక్కడే ఇద్దరు చిన్నారులు(ఒకరు నాలుగన్నరేళ్లు, ఒకరు రెండున్నరేళ్లు) సిరప్ కారణంగానే మరణించినట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరూ ప్రవీణ్ వద్దే వైద్యం తీసుకోవడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ మరణాల సంఖ్య 14కి చేరినట్లయ్యింది. సిరప్ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తీవ్ర జ్వరం, పొట్ట ఉబ్బిపోయి.. మూత్రపిండాలు(కిడ్నీ) ఫెయిల్ అయ్యి మరణిస్తున్నారు. ఈ తరహా లక్షణాలతో ఎనిమిది మంది చిన్నారులు నాగ్పూర్, భోపాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. మరోవైపు చిన్నారుల ‘సిరప్’ మరణాలపై దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT)ను ఏర్పాటు చేసింది.వరుస మరణాల నేపథ్యంలో.. చిన్నారులు వాడిన 19 రకాల మందుల శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, 'కోల్డ్రిఫ్' అనే దగ్గు సిరప్లో(బాచ్ నంబర్ SR-13) డైఇథైలిన్ గ్లైకాల్ (DEG-48.6%) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అక్టోబర్ 2న వెల్లడించిన నివేదికలోనూ ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో కోల్డ్రిఫ్ (ColdriF) సిరప్పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నివేదిక తర్వాత.. మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా ColdriF స్టాక్లను నిషేధించి స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్లో కూడా ఇలాంటి మరణాలు సంభవించడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్పత్తిని ఆపేయించింది.ఇక.. తనిఖీల అనంతరం, ఆ తయారీ యూనిట్ లైసెన్సును రద్దు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సిఫార్సు చేసింది. అంతేకాకుండా, సంబంధిత కంపెనీపై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టైన డాక్టర్ ప్రవీణ్ సోనీతో పాటు తయారుదారీ కంపెనీ స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్యకు సమానమైన నిర్లక్ష్యంతో మృతికి కారణం), సెక్షన్ 276 (మందుల కల్తీ), మరియు డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 27A ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులు జీవిత ఖైదు శిక్షకు దారి తీసే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా పిల్లలకు వాడే దగ్గు మందుల నాణ్యత, వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని పేరెంట్స్కు, అలాగే ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా, ఔషధ తయారీ కంపెనీలన్నీ సవరించిన షెడ్యూల్ 'ఎం' నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆరోగ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. పిల్లల విషయంలో దగ్గు మందుల వాడకాన్ని తగ్గించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన అసాధారణ సంఘటనలపై నిఘా పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సకాలంలో నివేదికలు తెప్పించుకోవాలని ఆదేశించారు.మరోవైపు.. డాక్టర్ ప్రవీణ్ సోనీని తక్షణమే విడుదల చేసి.. ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని, లేకంఉటే నిరవధిక సమ్మె చేపడతామని చింద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ఆరోగ్య సంక్షోభ వేళ సీఎం మోహన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి అస్సాంకు జాలీగా ట్రిప్కు వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. దగ్గుమందులు, యాంటీబయటిక్స్ ‘కల్తీ’ విషయంలో సీడీఎస్సీవో సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు తమిళనాడు, యూపీ, కేరళ, మహారాష్ట్రలోనూ 19 ఔషధ తయారీ సంస్థలపై తనిఖీలు ప్రారంభించింది. -
Cough Syrup Row: వైద్యుడు అరెస్ట్.. కంపెనీపై కేసు నమోదు
భోపాల్: మధ్యప్రదేశ్లోని చింద్వారాలో పిల్లలకు ప్రమాదకర దగ్గు సిరప్ను సూచించిన వైద్యుడిని ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ సోని సూచించిన దగ్గు సిరప్ తీసుకున్న 11 మంది చిన్నారులు మరణించిన ఉదంతం వివాదాస్పదంగా మారింది. పరాసియాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని తన క్లినిక్లో పలువురు చిన్నారులకు చికిత్స అందించిన దరిమిలా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ సిరప్ను తయారు చేసిన శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై కేసు నమోదు చేసింది.ప్రభుత్వం ఇప్పటికే కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఈ ఔషధ నమూనాలలో 48.6శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉంది. ఇది అత్యంత విషపూరితమైన పదార్థమని అధికారులు తెలిపారు. చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలో ప్రభుత్వ ఔషధ విశ్లేషకులు ఈ సిరప్ నమూనాను పరీక్షించిన దరిమిలా తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ ‘కోల్డ్రిఫ్’ప్రామాణిక నాణ్యత లేనిదని ప్రకటించింది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు ప్రభుత్వం మరొక దగ్గు సిరప్ ‘నెక్స్ట్రో-డిఎస్’ అమ్మకాలను కూడా నిషేధించింది. కోల్డ్రిఫ్ పరీక్ష రిపోర్టు శనివారమే బయటకు రాగా, నెక్స్ట్రో-డిఎస్ నివేదిక రావాల్సివుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారి చిన్నారులు తొలుత జలుబు, తేలికపాటి జ్వరంతో బాధపడ్డారు. ఈ సమయంలో వైద్యులు వారికి దగ్గు సిరప్తో సహా సాధారణ మందులు సూచించారు. ఆ తర్వాత వారు కోలుకున్నట్లు కనిపించినా, తిరిగి అవే అనారోగ్య లక్షణాలు కనిపించాయి. మూత్ర విసర్జనలో తేడా కూడా కనిపించింది. పరిస్థితి మరింతగా దిగజారి అది, కిడ్నీ ఇన్ఫెక్షన్గా మారింది. ఆ తరువాత వారు మృతిచెందారు. మృతుల కిడ్నీ బయాప్సీలో విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ పదార్థం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ మరణాలు చాలా విషాదకరమైనవని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ అంతటా నిషేధించారని, సిరప్ తయారీ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా నిషేధం విధించనున్నామని ఆయన తెలిపారు. -
చిన్నారుల ప్రాణం తీసిన దగ్గుమందు
-
15 రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృతి, రెండు కాఫ్ సిరప్లు బ్యాన్!
మధ్యప్రదేశ్లో 15 రోజుల్లో 6 మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించడం కలకలం రేపింది. మొదట అందరూ సీజనల్ ఫీవర్స్ వేవ్ అనుకున్నారు. కానీ ఆ తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రెండు రకాల కాఫ్ సిరప్ను నిషేధించారు. ఏం జరిగిందంటే..మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాను కుదిపేసిన హృదయ విదారక విషాదంలో, గత 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి సీజనల్ జ్వరాలు అనుకొని చికిత్ర చేశారు. కానీ పరిశోధకులు మరో విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషపూరిత డైథిలిన్ గ్లైకాల్తో కలిపిన కలుషితమైన దగ్గు సిరప్ మరణాలకు కారణమని అనుమానిస్తున్నారు. దీంతో రెండు రకాల దగ్గు మందులను బ్యాన్ చేశారు.ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు మొదట జలుబు, తేలికపాటి జ్వరంతో వైద్యులను సంప్రదించారు. స్థానిక వైద్యులు దగ్గు సిరప్లతో సహా సాధారణ మందులను సూచించారు. ఆ తర్వాత పిల్లలు కోలుకున్నట్లు అనిపించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. జ్వరం తిరగ బెట్టింది. మూత్ర బంద్ అయిపోయింది. ఆ తరువాత పరిస్థిత మరింత తీవ్రమై మూత్రపిండాల ఇన్ఫెక్షన్గా మారింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి."మా పిల్లలు ఇంతకుముందెప్పుడూ అనారోగ్యంతో బాధపడ లేదని, దగ్గు సిరప్ తీసుకున్న తరువాతే మూత్రం ఆగిపోయిందని’’ కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.(సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?)మృతుల కిడ్నీ బయాప్సీలలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. చాలా మందికి బాధితులకు కోల్డ్రిఫ్ , నెక్స్ట్రో-డిఎస్ సిరప్లు ఇచ్చారు. చింద్వారా కలెక్టర్ షీలేంద్ర సింగ్ వెంటనే జిల్లా అంతటా రెండు సిరప్ల అమ్మకాలను నిషేధించారు. వైద్యులు, ఫార్మసీలు తల్లిదండ్రులకు అత్యవసరమైన కీలక సూచనలు జారీ చేశారు. మూత్రపిండాల వైఫల్యానికి కలుషితమైన ఔషధం కారణమని బయాప్సీ నివేదికలో తేలిందని ప్రభావిత గ్రామాల నుండి నీటి నమూనాలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని జిల్లా అధికారులు తెలిపారు. తీవ్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి ఒక బృందాన్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నామని సింగ్ అన్నారు. "సెప్టెంబర్ 20 నుండి, మూత్రం ఆగిపోవడం, మూత్రపిండాల సమస్యల కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. కానీ చాలా మంది పిల్లలలో అకస్మాత్తుగా మూత్రపిండాల వైఫల్యం చాలా ప్రమాదకరమైందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గోనారే వెల్లడించారు. ఆగస్టు 24న మొదటి అనుమానిత కేసు నమోదైందని, సెప్టెంబర్ 7న మొదటి మరణం సంభవించిందని తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న దగ్గు సిరప్!.. క్వాలిటీ టెస్ట్లో షాకింగ్ విషయాలు
దగ్గుకు వాడుతున్న సిరప్లు ప్రాణాంతకం.. మరణానికి దారితీసే అవకాశం ఉందని.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెల్లడించింది. 100 కంటే ఎక్కువ ఫార్మా యూనిట్ల నుంచి సేకరించిన దగ్గు సిరప్ నమూనాలు, క్వాలిటీ టెస్టులో విఫలమయ్యాయని నివేదికలో స్పష్టం చేసింది.పరీక్షించిన చాలా సిరప్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది. డైథలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పీహెచ్ వంటివన్నీ తగిన పరిమితులలో లేదని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 7,087 బ్యాచ్ల మందులను పరీక్షిస్తే.. 353 బ్యాచ్లలో క్వాలిటీ ప్రమాణాలు లేవని నిర్దారణ అయ్యాయి.డైఇథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పరిమాణం తొమ్మిది బ్యాచ్లలో తక్కువగా ఉన్నట్లు, మరికొన్ని సిరప్లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇవి కూడా ప్రాణాంతకమని వెల్లడించారు.భారతదేశం ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్లను ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగి.. సిరప్ నాణ్యతలను టెస్ట్ చేయడం మొదలుపెట్టింది.గాంబియాలో చిన్నారుల మరణాలుఅక్టోబర్ 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కిడ్నీ సమస్యల కారణంగా.. గాంబియాలో సుమారు 70 మంది చిన్నారులు మరణించారని, దీనికి భారతదేశంలో తయారయ్యే దగ్గు, జలుబు సిరప్లు కారణమై ఉండొచ్చని వెల్లడించింది. ఆ తరువాత సంబంధిత అధికారులు దగ్గు సిరప్ తయారీ యూనిట్ల తనిఖీలను నిర్వహించి.. ఫార్మా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ వాడకంపై తయారీదారులకు అవగాహన కల్పించారు.మే 2023లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఎగుమతి కోసం ఉద్దేశించిన తయారీదారుల నుంచి దగ్గు సిరప్ నమూనాలను టెస్ట్ చేయడానికి గుర్తింపు పొందిన ల్యాబ్లను అనుమతివ్వాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లను ఆదేశించింది. గత జూన్ నుంచి దగ్గు సిరప్ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షించి.. సర్టిఫికేట్ అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ను కోరింది. -
'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్లో తయారైన సిరప్పై WHO అలర్ట్
భారత్లో తయారై.. ఇరాక్లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ (Cold Out) దగ్గు మందు సిరప్లో కలుషితమైన ఔదాలున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిందంటూ బ్లూమ్బెర్గ్ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ ల్యాబరేటరీ సంస్థ వాలిసూర్ ల్యాబ్ ఈ ఏడాది మార్చిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్కు చెందిన ఓ ఫార్మసీలో కొనుగోలు చేసిన కోల్డ్ అవుట్ సిరప్పై రీసెర్చ్ చేసింది. వాలిసూర్ పరిశోధనల్లో భారత్లో తయారైన ఈ దగ్గుమందులో 2.1% ఇథలీన్ గ్లైకాల్ (ఈజీ) నమూనాలు ఉన్నట్లు తేలింది. ఇది వినియోగించాల్సిన శాతం కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. తద్వారా సిరప్ వినియోగంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. గత ఏడాది మైడెన్ ఫార్మా తయారు చేసిన జలుబు, దగ్గుమందు సిరప్లలో ఇథలీన్ గ్లైకాల్ ఉంది. ఈ సిరప్ తాగి 70 మంది చిన్నారులు మరణించారు. అదే ఇథలీన్ గ్లైకాన్ తాజా వాలిసూర్ పరిశోధనలు జరిపిన సిరప్లో ఉన్నట్లు గుర్తించింది. జూలై 8న బ్లూమ్బెర్గ్ ఈ పరీక్ష ఫలితాలను డబ్ల్యూహెచ్వోతో పాటు, ఇరాక్, భారత అధికారులకు సమాచారం అందించింది.ఇక, డబ్ల్యూహెచ్వో సైతం వాలిసూర్ ఫలితాలపై అలెర్ట్ అయ్యింది. వాలిమర్ రీసెర్చ్ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఇరాక్ ప్రభుత్వం ఈ సిరప్లను విక్రయిస్తే హెచ్చరికలు జారీ చేస్తామని వెల్లడించింది. సిరప్ ఫలితాలపై ఇరాక్ ఓ ఇంటర్వ్యూలో, సిరప్ ఫలితాలపై ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బాడర్ మాట్లాడుతూ.. ఔషధాల దిగుమతి, అమ్మకం, పంపిణీకి మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను కలిగి ఉన్నాయని అన్నారు. కానీ ఇండియన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ ఫలితాలపై స్పందించేందుకు నిరాకరించారు. ఇరాక్లో లభ్యమైన వాలిసూర్ ల్యాబ్ కొనుగోలు చేసిన ఈ సిరప్లను చైన్నైకి చెందిన ఫోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ జర్మనీ, కెనడాతో సహా 50 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే, ఆ సిరప్ తయారీని సంస్థ పుదుచ్చేరికి చెందిన షారున్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని సమాచారం. ఈ సంస్థ గురించి, కోల్డ్ అవుట్ సిరప్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. ఆ దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదు. గత ఏడాది భారత్ హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు గతేడాది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పిల్లల మరణాలకు సిరప్లలోని ఇథిలీన్ గ్లైకాల్ కారణమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తాజాగా, భారత ఫార్మా కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మైడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు,జలుబు మందు సిరప్లపై వివిధ రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు. చదవండి👉 కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో -
దేశీయ దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం, త్వరలోనే అమల్లోకి
న్యూఢిల్లీ: దేశీయ కాఫ్ సిరప్లపై ఇటీవలి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు ఎగుమతులపై కీలక నిబంధనలు జారీ చేసింది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు మందుల (సిరప్)లపై అనుమతిని తప్పనిసరి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆందోళనలు తలెత్తిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..! ప్రభుత్వ ల్యాబ్ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్షల అనంతరం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ యా ల్యాబ్స్ టెస్టింగ్ సంబంధించి దగ్గు సిరప్లపై తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఎగుమతుల సమయంలో ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. దేశం నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో తమ నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఆర్డీటీఎల్-చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్-కోల్కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్-చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్డీటీఎల్- గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ల్యాబ్ల్లో పరిక్షలకు అనుమతి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ ఐ డ్రాప్స్ను రీకాల్ చేసింది. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్లలో వరుసగా 66, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్లు కారణమని ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
భారత్కు చెందిన ఆ రెండు దగ్గు మందులు వాడకండి.. డబ్ల్యూహెచ్వో హెచ్చరిక!
చిన్న పిల్లల కోసం భారత్లో తయారైన రెండు దగ్గు మందులు(సిరప్స్) వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్ మందుల్లో విషపూరితమైన ఇథిలీన్ ఉన్నట్టు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. ఈ క్రమంలో చిన్నారులకు ఈ సిరప్స్ ఇవ్వకూడదని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, గతేడాది డిసెంబర్లో ఉజ్బెకిస్థాన్లో 19 మంది చిన్నారులు ఆకస్మికంగా మృతిచెందారు. వారికి మృతికి డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ దగ్గు మందులే కారణమని డబ్ల్యూహెచ్వో తెలిపింది. మారియన్ బయోటెక్ తయారుచేసిన దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. దీంతో, అప్రమత్తమైన ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం.. మందులను ల్యాబ్లో పరిశీలించగా వాటిలో విషపూరితాలు ఉన్నట్టు గుర్తించింది. దగ్గు మందులో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. అనంతరం, ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్వో దృష్టికి తీసుకువెళ్లింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్ బయోటెక్ విఫమైందని, సిరప్ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్తో సూచించింది. దీంతో, డబ్ల్యూహెచ్తో సైతం వీటిని వాడరాదంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్లో కూడా భారత్ చెందిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది పిల్లల మరణించారు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్ల వల్లే వారు మృతిచెందినట్టు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. దీంతో, ఆ ముందులను కూడా వాడరాదని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. "Substandard": WHO Alert On 2 Indian Syrups After Uzbekistan Child Deaths https://t.co/SKxgzPbNy0 NDTV's Vedanta Agarwal reports pic.twitter.com/JMzxKEpZBE — NDTV (@ndtv) January 12, 2023 -
ఏదడిగినా దగ్గుతున్నాడ్సార్!
ఏదడిగినా దగ్గుతున్నాడ్సార్! -
ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్ సిరప్లే కారణం’
ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్-1 మాక్స్ దగ్గు మందు తాగి పిల్లలు మృతిచెందారంటూ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సిరప్లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు తెలిపింది. సిరప్లపై నిషేధం ‘పిల్లలు ఆసుపత్రిలో చేరక ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తల్లిదండ్రులు లేదా ఫార్మసిస్ట్ల సలహా మేరకు అధిక మోతాదులో జలుబును తగ్గించేందుకు పిల్లలకు అందించారు. 2.5- 5 ఎంఎల్ మోతాదుతో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు 2-7 రోజుల పాటు ఈ సిరప్ను తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 18 మంది పిల్లలు మరణించడంతో దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ -1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్లపై నిషేధం విధించారు. కాగా 2012లో మారియన్ బయోటెక్ ఉజ్బెకిస్తాన్లో రిజిస్టర్ చేసుకుంది. స్పందించిన భారత్ భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉజ్బెకిస్తాన్ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఉజ్బెకిస్తాన్ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. దీనికి సంబంధించిన వివరాలను తమకు అందించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపింది. అయితే ఈ సిరప్ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఈ ఘటనపై సీడీఎస్ఓ-నార్త్ జోన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయని తెలిసింది. మారియన్ బయోటెక్ కంపెనీ ఏమన్నదంటే ఉజ్బెకిస్తాన్లో పిల్లల మరణాల పట్ల చింతిస్తున్నామని మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ పేర్కొంది. తయారీ యూనిట్ నుంచి దగ్గు మందు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం విచారణ జరుపుతోందని, పూర్తి నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ లీగల్ హెడ్ హసన్ రజా అన్నారు. రెండోసారి భారత్లో తయారు చేసిన దగ్గు సిరప్లపై ఆరోపణలు రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 70 మందికిపైగా పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్లో తయారైన దగ్గు మందు సిరప్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పిల్లల మృతిపై కంపెనీ సిరప్లకు సంబంధం ఉందని, వీటిని వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉబ్జెకిస్తాన్, గాంబియాలోనూ చిన్నారుల మరణాలకు సిరప్లో ప్రాణాంతక రసాయనం ఇథిలీన్ గ్లైకాల్ ఉండటమే కారణమని తేలింది. -
చిన్నారుల ప్రాణం తీసిన దగ్గు మందు..మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు ఊరట!
69 మంది చిన్నారుల మరణానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ అనుమానం వ్యక్తం చేసిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో పదుల సంఖ్యలో చిన్నారుల మరణాలకు మైడెన్ ఫార్మా తయారు చేసిన డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమానం వ్యక్తంచేసింది. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన దగ్గు మందు సిరప్ల నుండి తీసిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలలో టెస్టులు నిర్వహించగా అందులో ఎలాంటి తప్పు లేదని తేలింది. కాబట్టి, తన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వ అనుమతి కోరినట్లు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఈ సందర్భంగా మైడెన్ ఫార్మా మేనేజింగ్ డెరెక్టర్ నరేష్ కుమార్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ నియంత్రణ, న్యాయ వ్యవస్థలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. ‘మేం ఇప్పుడు ఫ్యాక్టరీని పునప్రారంభించేలా అధికారులను కోరుతున్నాం. కానీ అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. అనుమతుల కోసం మేం ఇంకా వేచి ఉన్నాం అని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నెలలో 69 మంది పిల్లల మరణాలకు మైడెన్ ఫార్మా కంపెనీ దగ్గు,జలుబు సిరప్లు సంబంధం కలిగి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక అనుమానం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు హర్యానాలోని సోనేపట్లోని మైడెన్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీలో మెడిసిన్ తయారీని నిలిపివేశారు. దగ్గు మందుపై కేంద్రం టెస్టులు నిర్వహించింది. ఈ తరుణంలో డిసెంబర్ 13న ఇండియన్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ వీజీ సోమాని..డబ్ల్యూహెచ్ఓకి లేఖ రాశారు. ఆ లేఖలో మైడెన్ ఉత్పత్తి చేసిన దగ్గు మందులపై టెస్టులు నిర్వహించాం. ఆ నమోనాలు సంస్థ వెల్లడించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్నట్లు కనిపెట్టాం. వాటిలో చిన్న పిల్లలో తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీసే డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలు నమోనాలు లేవని గుర్తించామని పేర్కొన్నారు. పరీక్షల ఫలితాలను తదుపరి చర్య కోసం నిపుణుల బృందానికి పంపామని డబ్ల్యూహెచ్ఓకి రాసిన లేఖలో సోమాని తెలిపారు. చండీగఢ్లోని రాష్ట్ర ప్రభుత్వ రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ఈ పరీక్షలను నిర్వహించిందని ప్రభుత్వం ముందుగా తెలిపింది. ఆ లేఖపై డబ్ల్యూహెచ్ఓ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు అక్టోబర్లో యూఎన్ ఏజెన్సీ మైడెన్ తయారు చేసిన ఉత్పత్తులలో విషపూరితమైన, తీవ్రమైన కిడ్నీలను నాశనం చేసే డైథైలిన్ గ్లైకాల్,ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందే. -
దగ్గు నివారణకు హెర్బల్ సిరప్: వాసా తులసి ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్.. దగ్గు నివారణకు ఆయుర్వేద ఔషధం వాసా తులసి ప్లస్ ప్రవేశపెట్టింది. వైద్యపరంగా నిరూపితమైన వాము పువ్వు, ప్రిమ్ రోజ్, తాలీస పత్రం, వస, తులసి, శొంఠి, దుష్టపు తీగ, అతి మధురం, పిప్పళ్లు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, పుదీనా ఇందులో వాడారు. కఫాన్ని తొలగించడానికి వస, వాము సాయపడతాయి. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుందని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ఆస్తమా, దగ్గు-జలుబు, కోరింత దగ్గు, ఈసినోఫీలియా, గొంతు నొప్పి, బొంగురు గొంతు, సైనసైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఇదీ చదవండి: ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ -
భారత్ కి జరిగిన అవమానం పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్..
-
భారత్కు అది ఘోరమైన అవమానం: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆరుగురు ప్రముఖులకు మంగళవారం ఇన్ఫోసిస్ అవార్డులు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్ నారాయణమూర్తి గాంబియా ఘటనపై స్పందించారు. భారత్లో తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగా 66 మంది చిన్నారులు మృతి చెందడం దేశానికి ఘోరమైన అవమానాన్ని తెచ్చిపెట్టిందని, దేశ ఔషధ నియంత్రణ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. ఇది ఘోరమైన అవమానం ఇటీవల కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన ప్రశంసలు పొందిన భారత్కు ఈ ఘటన అపవాదు తీసుకొచ్చిందని అవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లలో దేశం శాస్త్ర, సాంకేతిక పురోగతిలో ఆరోగ్యంగా దూసుకుపోతున్నప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు అలానే మిగిలి ఉన్నాయన్నారు. ప్రస్తుత విద్యా విధానం గురించి మాట్లాడుతూ.. ‘సామాజిక అంశాలను పాఠ్యాంశాలుగా నేడు ఐఐటీలు అనుసరించడం లేదు. 2022లో ప్రకటించిన ప్రపంచ గ్లోబల్ ర్యాంకింగ్లో టాప్ 250లో ఇప్పటికీ ఒక్క భారతీయ ఉన్నత విద్యా సంస్థ కూడా లేదు. మనము తయారు చేసిన వ్యాక్సిన్లు కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికతలపై ఆధారపడి ఉంటున్నాయి లేదా అభివృద్ధి చెందిన దేశాల పరిశోధనల ఆధారంగా ఉంటోందని’ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లుగా భారతీయ సమాజం ఎదుర్కొనే చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులకు ఇంకా టీకాలు కనుగొనలేకపోవడం మన పరిశోధన రంగం వైఫల్యమేనని తెలిపారు. ఆరుగురికి అవార్డులు.. కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ఆరుగురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. వీరిలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్సెస్), మహేశ్ కాక్డే (గణితం), నిస్సీమ్ కనేకర్ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్ సైన్స్)లకు పురస్కారాలు ప్రకటించారు. వీరికి జనవరిలో పురస్కారాలతో పాటు స్వర్ణ పతకం, లక్ష అమెరికన్ డాలర్లు అందిస్తారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
మన మందులు మంచివేనా?
ఒక భారతీయ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్ల వల్ల గాంబియా దేశంలో 66 మంది పిల్లలు చనిపోయారన్న వార్త దేశ ప్రతిష్ఠను దెబ్బతీసింది. భారతదేశంలో తయారయ్యే ఔషధాలు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తున్నాయా? భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నలకు సమాధానం ‘అవును’ కాదు. మన తయారీ నాసిరకపు ఔషధాల వల్ల పేద దేశాల్లోని రోగులే కాదు, లక్షలాది మంది భారతీయులు కూడా ప్రభావితం అవుతున్నారు. లేబుల్ మీద ప్రకటించినంత మందు తీరా మాత్రలో ఉండకపోవడం, ఔషధాల్లో కలిసే అవకాశమున్న విష రసాయనాలను గుర్తించే యంత్రసామగ్రి లేకపోవడం, అసలు మొత్తంగానే ఒక కఠినమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు దేశీయుల ఉసురు తీస్తున్నాయి. భారతీయ ఔషధ పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపుతూ దినేష్ ఎస్. ఠాకూర్, టి.ప్రశాంత్ రెడ్డి రాసిన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ ఎన్నో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్లు గాంబియా దేశంలో 66 మంది పిల్లల మరణాలకు దారితీశాయని వచ్చిన వార్తలు ఇండియాను ఇబ్బందికి గురిచేశాయి. భారతదేశంలో ఔషధాలను ఎలా తయారుచేస్తున్నారో, ఎలా క్రమబద్ధీకరిస్తున్నారో తెలిపే దుర్భరమైన వాస్తవానికి ఇది ఒక సంకేతం మాత్రమే. ఈ నెలలోనే ప్రచురితమైన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని వెల్లడించింది. ఈ పుస్తక రచయితలు దినేష్ ఎస్. ఠాకూర్, టి. ప్రశాంత్ రెడ్డి రెండు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ఒకటి, భారతీయ మందులు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తు న్నాయా? రెండు, భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? సమాధానం ‘లేదు’ అనే చెప్పాల్సి ఉంటుంది. తొలి ప్రశ్నకు ఈ పుస్తక రచయితలు చెప్పిన సమాధానం ఏమిటంటే... ‘‘మార్కెట్లో పంపిణీ అవుతున్న నాసిరకపు మందుల సునామీని భారతదేశం విప్పారిన నేత్రాలతో చూస్తోంది... దీనివల్ల ప్రభావితులైన రోగుల మొత్తం సంఖ్య... వందలు, వేలు మాత్రమే కాదు బహుశా లక్షల్లో ఉంటుందని మేం అనుమానిస్తున్నాం.’’ ఇక రెండో ప్రశ్నకు జవాబుగా వారు సింపుల్గా చెప్పిందేమిటంటే: ‘‘మేము అలా భావించడం లేదు’’ అనే. ఈ పుస్తకంలోని వివరణాత్మకమైన, చక్కటి పరిశోధనతో కూడిన 500 పేజీల అధ్యయనం విస్తృతమైన అంశాలను తడిమింది. దేశంలో ఔషధాలు తయారు చేస్తున్న విధానం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో ఈ పుస్తకం వివరించింది. కొన్ని కంపెనీలు తప్పుడు ప్రక టనలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఎలాంటి లైసెన్సు లేకుండానే మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. అవసరమైన పరీక్షలు చేయడానికి సమర్థమైన యంత్ర సామగ్రి కూడా వీటివద్ద లేకపోవడం గమనార్హం. అనేక తప్పుడు విధానాలు అవలంబిస్తున్న కొన్ని కంపెనీల బండారం బయటపడుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. భారతీయ మందుల దుర్భరమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ గురించిన సమగ్ర వివరాలను కూడా ఈ పుస్తకం పొందుపర్చింది. మన రెగ్యులేటర్లు అరుదుగా, ఎప్పుడో తప్ప ఔషధ తయారీ కర్మా గారాలను భౌతికంగా తనిఖీ చేయరు. దీనికి బదులుగా వాళ్లు ప్రశ్నించదలచిన మందుల తయారీ బ్యాచ్ రికార్డుల కాపీని మాత్రమే అడుగుతుంటారు. వారు అనుసరించే మార్గదర్శకాలు న్యాయ విచారణను సైతం నిరుత్సాహపరుస్తుంటాయి. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వ్యవ హారం కోర్టు వరకూ వెళ్లిన ప్పుడు, చాలా మామూలు శిక్షలు మాత్రమే పడుతుం టాయి. ‘కోర్టు ముగిసే వరకూ విధించే సాధారణ శిక్ష’ లాంటిది. అది అసలు శిక్షే కాదని చెప్పవచ్చు కూడా! ఈ పుస్తక రచయితలు తమ ముందుమాటలో ఇచ్చిన ఉదాహరణతో ఒక భయానక స్థితి గురించి నన్ను వర్ణించనివ్వండి. 2019 సంవత్సరంలో డైయాథిలిన్ గ్లైకాల్ (డీఈజీ)ను కలిగివున్న దగ్గు సిరప్ తీసుకున్న 21 మంది చిన్నపిల్లల చనిపోయారు. దీన్ని తయారుచేసింది డిజిటల్ విజన్ కంపెనీ. డైయాథిలిన్ గ్లైకాల్ అనేది పారిశ్రామిక ద్రావణి(సాల్వెంట్). దీన్ని ‘ఆంటీఫ్రీజ్’గానూ, ‘బ్రేక్– ఫ్లూయిడ్’గానూ ఉపయోగిస్తుంటారు. 1972 నుంచి డీఈజీ అనేది పిల్లలకు విషంగా మారిన ఘటనలు అయిదుసార్లు సంభవించాయి. అయినప్పటికీ ఔషధాల్లో దీని జాడను ఎవరూ కనుగొనలేక పోతున్నారు. కారణం... భారతీయ ఔషధ కంపెనీలు ఔషధ తయా రీకి ముందు తమ ముడి సరుకును గానీ, తయారయ్యాక ఉత్పత్తిని మార్కెట్లోకి పంపడానికి ముందుగానీ పరీక్షించడంలో తరచుగా విఫలమవుతుండటమే! ఇది డిజిటల్ విజన్ కంపెనీ తొలిసారి చేసిన క్షమించరాని తప్పేమీ కాదు. 2012–19 మధ్యకాలంలో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన మందులు నాణ్యతా పరీక్షల్లో మొత్తంమీద 19 సందర్భాల్లో విఫల మయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ పరిధిలోకి వచ్చే డిజిటల్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఆ డ్రగ్ కంట్రోలర్ డీఈజీ మిశ్రమాలను పరీక్షించడానికి తగిన ఏర్పాట్లు కంపెనీ చేయనేలేదని హైకోర్టుకు తెలిపారు. అయితే ఆ డ్రగ్ కంట్రోలర్ ఈ విషయాన్ని కనుగొనడానికి అంతకుముందు 19 సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ అలా పరీక్షించడంలో విఫలమయ్యారు. డ్రగ్ కంట్రో లర్ తనిఖీ సమయంలోనే ఈ లోపాలను కనిపెట్టి ఉండాలనీ, అలా చేసివుంటే కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్సును తక్షణమే రద్దు చేసి ఉండేవారనీ ఈ పుస్తక రచయితలు పేర్కొన్నారు. ఇంకోసంగతి. మరి, ఒక ఔషధం దాని లేబుల్ మీద ప్రకటించిన మేరకు లేకపోతే దాని పరిణామాలేమిటి? ఈ పుస్తకం అజిత్రో మైసిన్కు సంబంధించి ఒక విషయం పేర్కొంటోంది. ఆల్కేర్ లేబొ రేటరీస్ తయారుచేసే అజిత్రోమైసిన్లో లేబుల్ ప్రకారం నిజానికి 200 మిల్లీగ్రాముల అజిత్రోమైసిన్ ఉండాలి. కానీ అందులో ఉన్నది 25.69 గ్రాములే. అంటే కేవలం 12.85 శాతమే. ఇలాంటి మందులు వాడినప్పుడు ఉండదగిన పరిణామం గురించి రచయితలు ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘‘రోగి చనిపోవడానికి అత్యధిక అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆ మాత్రలో ఇన్ఫెక్షన్ను నిరోధించడానికి అవసరమైన ‘చాలినన్ని’ యాక్టివ్ ఇన్గ్రేడియెంట్లు లేవన్న మామూలు కారణంతో.’’ భారతదేశంలో చౌక ధరలకు లభ్యమవుతూ జనాదరణ పొందిన జనరిక్ మందులు నిజానికి అసలు మందులతో సమానం కాకపోతే జరిగేదేమిటో కూడా ఈ పుస్తకం వివరించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే జనరిక్ మందులపై జీవ సమానత్వ (బయో ఈక్వలెన్స్) పరీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పరీక్ష అరుదుగానే జరుగు తుంది. ‘‘తప్పనిసరిగా చేయవలసిన జీవసమానత్వ పరీక్ష లేమి కారణంగా దేశంలో వందలాది కాదు, వేలాది జనరిక్ మందుల బ్రాండ్లను ఆమోదించవలసి వచ్చింది. ఇలా ఆమోదం పొందిన చాలా బ్రాండ్లు ఎందరో రోగుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంది’’ అని ఈ పుస్తక రచయితలు చెబుతున్నారు. అనేక భారతీయ ఔషధ ఉత్పత్తి సంస్థలు నాణ్యతతో పాటు, విధానపరమైన నియంత్రణ, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించా యన్నదే ఈ పుస్తకానికి ముగింపు అని నేను చెబుతాను. అయిన ప్పటికీ, ప్రజలను దెబ్బతీస్తున్న లేదా చంపుతున్న నేరాలకు పాల్పడిన ఈ కంపెనీలు అరుదుగా కూడా భౌతిక శిక్షలు ఎదుర్కోవడం లేదు. ఇదే నిజానికి అత్యధికంగా భయపెడుతోంది. కానీ ప్రభుత్వం ఏ చర్యలకూ ఉపక్రమించకపోతే, మనం చేయగలిగేది ఏమీ ఉండదు కదా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
దగ్గు సిరప్ కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి... ఉత్పత్తికి చెక్!
చిన్నారులను మింగేసిని దగ్గు సిరప్ కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్వో గాంబియాలో దాదాపు 66 మంది చిన్నారులు బారత్ తయారు చేసిన సిరప్ వల్లే చనిపోయారని పేర్కొనడంతో హర్యానా ప్రభుత్వం ఆ ఉత్పత్తులను నిలిపేసినట్లు తెలిపింది. అంతేగా ఆ కంపెనీ సంబంధించి మూడు జౌషధాలను పరీక్షల నిమిత్తం కలకత్తాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్కి పంపారు. ఆ పరీక్ష నివేదికల తదనంతరం సదరు కంపెనీపై చర్యలు తీసుకుంటానని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ఐతే కేంద్ర హర్యానా రాష్ట్ర జౌషధ విభాగా సంయుక్త తనిఖీల్లో ఔషధ తయారీలో దాదాపు 12 లోపాలను గుర్తించడంతోనే ఉత్పత్తిని నిలిపేసినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీకి జారీ చేసిన షోకాజ్ నోటీస్లో...కంపెనీ ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించిన పరికరాలు, సాధనాల సమాచారానికి సంబంధించిన పుస్తకాన్ని నివేదించడంలో విఫలమైంది. అలాగే సిరప్ తయారీలో వాడిన రసాయనాల బ్యాచ్కి సంబంధించి సమాచారం కూడా పేర్కొనలేదు. సిరప్ తయారీ, ప్రక్రియ పద్ధతులను నివేదించడంలో విఫలం. అలాగే సిరప్కి సంబంధించి పరీక్షల నివేదికనను అందించలేకపోయింది. అంతేగాదు తయారి తేదీకి, ఉత్పత్తి అనుమతించిన తేదీకి చాలా వ్యత్యాసం ఉందంటూ పలు లోపాలను లేవనెత్తింది. ఈ మేరకు హర్యాన స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ షోకాజ్ నోటీస్కి ప్రతిస్పందించేందుకు సదరు కంపెనీకి సుమారు 7 రోజుల వ్యవధి ఇచ్చింది. సదరు కంపెనీపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక కంపెనీ తయారీ లైసెన్సు రద్దు చేయడమే గాక తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. (చదవండి: చిన్నారులను మింగేసిన దగ్గు మందు... సంచలన విషయాలు) -
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్లోని దాని తయారీ ప్లాంట్లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్) -
చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది. నాలుగు రకాల కాఫ్ సిరప్లు చిన్నారుల మృతికి కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. ఇది విషపూరితమైందనీ, తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ మైడెన్పై సమగ్ర విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటన తరువాత దేశీయ ఫార్మా కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి.ఈ ఫార్మా కంపెనీకి చెందిన అనేక మందులు దేశంలోని నాలుగు రాష్ట్రాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ప్రజారోగ్య కార్యకర్త దినేష్ ఠాకూర్ని ఉటంకిస్తూ ఎన్టీటీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) వియత్నాం చెత్త రికార్డు ఉన్న ఫార్మా కంపెనీలు బ్లాక్ లిస్ట్ చేసిందనీ, అందులో మైడెన్ కూడా ఒకటని ఠాకూర్ విమర్శించారు. వియత్నాం 2011లో కంపెనీని నిషేధించిందన్నారు. ఇంత పేలవమైన రికార్డును కలిగి ఉన్నప్పుడు అనుమతి ఎలా ఇచ్చారని ఠాకూర్ ప్రశ్నించారు. కంపెనీలో తీవ్రమైన నాణ్యత నియంత్రణా లోపాలున్నాయని,సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెంట్రల్ రెగ్యులేటర్ ఉన్నప్పటికీ కానీ ప్రతి రాష్ట్రానికి దాని స్వంత రెగ్యులేటర్ లేదన్నారు. కేరళ, గుజరాత్లోని రెగ్యులేటర్లు మైడెన్ మందులు నాణ్యత లేనివిగా తేలియాని గుర్తు చేశారు. బిహార్ ఇప్పటికే దీన్ని బ్లాక్ లిస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల అనుమతిని కేంద్ర నియంత్రణ సంస్థ మాత్రమే ఇస్తుంది. కంపెనీ డైరెక్టర్లకు సంబంధించిన కొన్ని కేసులు కూడా కోర్టులో ఉన్నాయన్నారు. ఇవన్నీ దేశంలోని ఔషధ నియంత్రణ వ్యవస్థల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఠాకూర్ మండిపడ్డారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్కు షాక్) మైడెన్ ఫార్మాస్యూటికల్ మందులు, నాణ్యతా లోపాలు, చర్యలు బిహార్ (2008) : ఎరిత్రోమైసిన్ స్టీరేట్ 125ఎంజీ సిరప్ (4 బ్యాచ్లు నాణ్యత లేనివిగా గుర్తించారు బిహార్ (2011) : మిథైలెర్గోమెట్రిన్ ట్యాబ్ (నకిలీ) వియత్నాం: కంపెనీ 2011 నుండి 2013 వరకు నిషేధం గుజరాత్ (2013) : మాసిప్రో ట్యాబ్ (రద్దు సమస్యలు) జమ్మూ కాశ్మీర్ (2020) : సైప్రోహెప్టాడిన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ ఐపీ (నాణ్యతాలోపం) కేరళ (2021) : మెట్ఫార్మిన్ 1000 ట్యాబ్ (రద్దు సమస్య) కేరళ (2021) : ఈసిప్రిన్ (ఐపీ ప్రమాణానికి అనుగుణంగా లేదు) కేరళ (2021): మెట్ఫార్మిన్ 500 mg (రద్దు సమస్య) కేరళ (2021) : మైకల్ డి ట్యాబ్ (తక్కువ నాణ్యత) ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త! కాగా నవంబర్ 1990లో కార్యకలాపాలను ప్రారంభించిన మైడెన్, గాంబియాకు మాత్రమే సిరప్ను తయారు చేసి ఎగుమతి చేసిందని భారత మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. గాంబియా విషాదం తరువాత, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్ల నమూనాలను ఇండియా పరీక్షిస్తోంది. నమూనాలను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీకి పంపామని, నేరం నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మైడెన్ ఫ్యాక్టరీలున్న హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
దగ్గు మందుతో .. జాగ్రత్త..!
-
WHO: ఆ భారత కంపెనీ సిరప్లను వాడొద్దు
జెనీవా: భారత్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్వో. ఈ మేరకు.. డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రెస్ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్ వెల్లడించారు. "WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros — World Health Organization (WHO) (@WHO) October 5, 2022 మెయిడెన్ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్ సిరప్, Makoff బేబీ కాఫ్ సిరప్, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది. ల్యాబ్ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్తో సిరప్లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్లను వాడటం మానేయాలని కోరింది. అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్ కంపెనీ స్థానికంగా(భారత్లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్వో, భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. -
ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్
న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారయ్యిన సంగతి తెలిసిందే. ఐతే చిన్నారుల మృతికి హానికరమైన దగ్గు మందే కారణమని విచారణలో తేలింది. డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే చిన్నారులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సోమవారం వెల్లడించింది. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారికి డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్ను అందించారు. ఐతే ఈ దగ్గుమందు కారణంగా ముగ్గురు పిల్లలు మృతి చెందగా, మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్తో సహా వివిధ డిస్పెన్సరీలలో పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే మరణాలు సంభవించాయని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ‘మా పరిశోధనలో అది హానికరమైన దగ్గు మందని తేలింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందు ఇవ్వకూడదని, మొహల్లా క్లినిక్లు, డిస్పెన్సరీలలో పంపిణీ చేస్తున్న ఈ మందును వెంటనే సీజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని డీజీహెచ్ఎస్ ఆదేశించింది. చదవండి: Crying Child Playing The Violin: ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా? -
దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్
Drug Based Cough Syrup Smuggling: ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో "లీన్" "సిజర్ప్" అనే మారుపేరుతో కూడా పిలిచే కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ (సీబీఎస్) ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వైద్యుడితో సహా సుమారు ఆరుగురిని అరెస్టు చేశామని కోల్కతా జోన్లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తెలిపింది. అయితే ఎన్సీబీ కోల్కతా జోన్ బారక్పూర్లో నిర్వహించి దాడులలో ఈ ఘటన వెలుగు చేసింది. (చదవండి: ఏడాదిగా షాప్కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి! అంతేకాదు ఆ నిందుతులు కోడైన్ సిరప్ను స్మగ్లింగ్ చేస్తున్న సిండికేట్లో భాగమని, పైగా మాదకద్రవ్యాల బానిసలు త్వరితగతిన అధిక ధర వెచ్చించి కొనేవాళ్లకే ఇవి ఎక్కువగా విక్రయిస్తుంటారని ఎన్సీబీ అధికారులు తెలిపారు. పైగా ఇరుదేశాల మధ్య సరిహద్దుగా ఉండే ముళ్ల కంచె వద్ద అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ ఉంచిన దాదాపు 2,245 డయలెక్స్ డీసీ బాటిళ్లను కూడా ఎన్సీబీ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ మేరకు ఆ నిందితులు వాహనాల్లో బరాక్పూర్ నుంచి నదియాకు సీబీఎస్ను రవాణా చేస్తున్నారని చెప్పారు. ఈ కమంలో ఎన్సీబీ బృందం మాట్లాడుతూ..."మొదట, మేము ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నాము, ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్కి సంబంధించిన మెడికల్ ప్రాక్టీషనర్ రిప్రజెంటేటివ్ని పట్టుకున్నాం. అయితే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఈ సీబీఎస్ డ్రగ్ని నిల్వ చేయడానికి తన మెడికల్ గోడౌన్ను ఇచ్చాడు. పైగా ఆ గోడౌన్కి లైసెన్స్ లేదు. అంతేకాదు బరాక్పూర్లోని రామ్ మెడికల్ హాల్ నుంచి నగరంలోని మహిస్బథన్ (ధాపా) ప్రాంతంలో గుర్తింపు లేని కొన్ని సంస్థలకు నిషిద్ధ వస్తువులు సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది." అని అన్నారు. ఈ క్రమంలో మయన్మార్కి సంబంధించిన యాబా ట్యాబ్లెట్లు భారత్లో తయారు చేయబడిన కోడైన్ ఆధారిత సిరప్లకు వంటి అక్రమ రవాణాలను తనిఖీ చేయడంలో ఢాకా ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్ సహాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. భారత్ కొన్ని మెడిల్ మందులపై నిషేధం విధించినట్లుగా బంగ్లదేశ్ బోర్డర్ గార్డ్స్ కూడా నిషేధం విధించాలని కోరింది కానీ అవి దేశంలో ప్రసిద్ధ వైద్య నివారిణలు కావడంతో సాధ్యం కాలేదు. (చదవండి: అవయవ దానంలో భారత్కు మూడో స్థానం) -
పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే
ఇటీవల మనలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. దాంతో మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలితో పాటు పండ్లూ ఫలాలూ తినడం, ఇతరత్రా ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం పరిపాటిగా మారింది. ఇందులో కొన్ని ఒంటికి మంచివేగానీ... పంటికి అంతగా మంచివి కాకపోవచ్చు. వాటిని తెలుసుకుని ఒంటినీ, పంటినీ కాపాడుకుందాం. పండ్లు / పండ్ల రసాలతో అప్రమత్తంగా ఉండండి.. తాజా పండ్ల రసాలతో మంచి ఆరోగ్యం సమకూరుతుందంటూ చాలామంది ఫ్రూట్జ్యూసులు ఎక్కువగా తాగేస్తుంటారు. వాటిల్లో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలతో పాటు... కొన్ని అనారోగ్య కారకాలూ ఉంటాయి. ఉదాహరణకు అందులోని చక్కెర మోతాదులు పళ్లను ఎక్కువగా దెబ్బతీయవచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి. ఇలా చేయండి... పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణగా చెప్పాలంటే... నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నదానికంటే చక్కెర కలిపిన ఆరెంజ్ పండ్లరసంతో పళ్లు పాడయ్యే అవకాశం చాలా ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. అలాగే జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చదవండి: స్మోకింగ్ చేసేవారికి పొంచి ఉన్న ప్రమాదం.. ఈ సమస్యలు మూడు రెట్లు ఎక్కువే.. దగ్గు మందులతోనూ జాగ్రత్త అవసరం... దగ్గు మందును మనకు మేలు చేసే ఓ ఔషధంగానే పరిగణించినా... అది కూడా చాలా సందర్భాల్లో పైన చెప్పిన ఫ్రూట్ జ్యూస్లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దాంట్లోని గాఢత (జిగురు లాంటి చిక్కదనం), అందులోని చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా చేయండి.. దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో దాని జిగురుదనమంతా పోయేలా నోరు శుభ్రం చేసుకోవాలి. ఇలా దగ్గుమందు తాగిన ప్రతిసారీ నోరు కడుక్కోవాలి. గుండెకు మేలు చేసే చాక్లెట్లతోనూ జాగ్రత్త... డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. వాటిని పరిమితంగా తినడం అన్నది గుండె ఆరోగ్యానికి దోహదం చేసే అంశం. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకుపోయేలా ఒకింత జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకుపోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉండేలా చేస్తాయి. దాంతో పళ్ల ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశాలతో పాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి. సమస్యను తప్పించుకోండిలా... పంటిని చుట్టుకుపోయేలా ఉండే చాక్లెట్లు, క్యాండీలు కాకుండా ఒకింత జిగురు తక్కువగా ఉండే వాటినే తినాలి. చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్తో తేలిగ్గా బ్రష్ చేసుకుని నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే.. -
ఆ రెండూ దొరక్కపోవడంతో...
నగర వ్యాప్తంగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ముమ్మరమైంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు ఎక్సైజ్ అధికారులు ఎడాపెడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్తుకు బానిసైన యువకులు ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. వీరితో పాటు ఫుట్పాత్లపై బతికే అనాథలు సైతం వీటిని వినియోగిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మత్తు కోసం ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగం అధికం అవుతున్న నేపథ్యంలో నగర పోలీసు విభాగం ఈ దందాపై కన్నేసింది. అందులో భాగంగా సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం హిమాయత్నగర్కు చెందిన జయంత్ అగర్వాల్ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి 154 బాటిళ్ల దగ్గుమందు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండూ దొరక్కపోవడంతో... మాదకద్రవ్యాలు.. ఇతరత్రా ఖరీదైన డ్రగ్స్ కొనలేని ‘మత్తు బానిసలు’ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ‘ఆల్టర్నేటివ్ డ్రగ్స్’లో నిద్రమాత్రలు, వైట్నర్, దగ్గు మందు ప్రధానమైనవిగా మారాయి. అయితే వైద్యులు రాసిన ప్రిస్క్రెప్షన్ లేకుండా స్లీపింగ్ పిల్స్ను ఖరీదు చేయడం కష్టసాధ్యం. వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినా వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. దీంతో అత్యధికంగా ప్లాట్ఫామ్స్పై నివసించే అనాథలే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మత్తుకు బానిసవుతున్న యువత, వైట్నర్ లభించని అనాథలు దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరికి ఈ మందులు మెడికల్ దుకాణాల నుంచే లభిస్తున్నాయి. దగ్గు కరోనా లక్షణాల్లో ఒకటైనా... నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని అసిమ్టమ్యాటిక్ కేసులతోపాటు ఈ వైరస్ సోకిన వారు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడం, లక్షణాలున్నా కోవిడ్ అని గుర్తించలేక కొన్ని మందులు వాడుతూ బయట సంచరించడం కూడా కారణాలనే వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి మెడికల్ షాపుల యజమానులు నేరుగా మాత్రలు అమ్మవద్దని, అమ్మినా ఖరీదు చేసిన వారి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలని స్పష్టం చేసింది. అయినా కొందరు మెడికల్ షాపుల యజమానులు మత్తుకు బానిసైన వారికి దగ్గు మందు విక్రయించేస్తున్నారు. దారుస్సలాంలో అగర్వాల్స్ ఫార్మసీ నిర్వహిస్తున్న హిమాయత్నగర్కు చెందిన జయంత్ అగర్వాల్ ఈ మందుల్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ శుక్రవారం సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్కు చిక్కాడు. శృతిమించితే తీవ్ర పరిణామాలే... అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్ట్రోమెథార్ఫిన్, కోడైన్లతో తయారు చేస్తారు. కోడైన్తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్ట్రోమెథార్ఫిన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారు. ఇది శృతిమించితే కిడ్నీ, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు విపరీతంగా పెరిగిపోతాయి. కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన తీవ్రరుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ వారి వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని, అవసరం లేకుండా దగ్గు మందుల వాడకాన్ని నిరోధించాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి చీటీ లేకుండా వీటిని విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిఘా ముమ్మరం చేశామని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
దగ్గు మందు తాగి 9మంది మృతి
సాక్షి, శ్రీనగర్: ఫార్మాసుటికల్ కంపెనీలు మందులు తయారు చేసే ప్రదేశాలు ఎక్కడున్నా ఉత్పత్తులు మాత్రం దేశం నలుమూలలకి వెళ్తుంటాయి. ఏ కొంత నిర్లక్ష్యం వహించినా వాటి వలన జరిగే నష్టం అంచనా వేయలేం. తాజాగా జమ్మూలో చిన్నారులకు దగ్గు మందు కావాల్సి వచ్చింది. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఓ కంపెనీ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్ జిల్లా చిన్నారులకు పంపింది. అందులో పాయిజన్ కాంపౌండ్ కలిపిన సంగతి తెలియని చిన్నారులు 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు. గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 'ప్రైమా ఫేసీ', 'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్, ఛండీఘర్లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని' డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు. ఈ దగ్గుమందు కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయి మరణాలు సంభవించినట్లు డైరక్టర్ హెల్త్ సర్వీస్కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో మొత్తంగా 5,500 మందు బాటిళ్లను సీజ్ చేశారు. తయారీ యూనిట్ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కంపెనీ మందులు సరఫరా అయ్యే ఉత్తరాఖండ్, హర్యానా, తమిళానాడు, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, త్రిపురలో తనిఖీలు చేపడుతున్నట్లు హిమాచల్ప్రదేశ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఆ మందు వాడి ఉంటే..
కొరాపుట్ : దగ్గు, జలుబుకు వైద్యుడు సూచించిన ఔషధానికి బదులు దురదలకు పైపూతగా వాడవలసిన లోషన్ను ఉచిత మందుల దుకాణం నిరామయి అందజేసిన ఉదంతం ఆదివారం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. స్థానిక పూజారిపుట్కు చెందిన అజిత్ కుమార్ పట్నాయక్ భార్య తన మూడేళ్ల కొడుకు దగ్గు, జలుబుతో బాధపడుతుండగా మెడికల్ కాలేజీ చైల్డ్ స్పెషలిస్ట్ అరఖిత స్వంయి వద్దకు వైద్యం కోసం ఉదయం తీసుకువెళ్లింది. ఆ స్పెషలిస్టు దగ్గు, జలుబు కోసం ప్రిస్క్రిప్షన్లో రాసిన మందుకు బదులుగా దురదలకు వాడవలసిన లోషన్ను నిరామయిలో ఆమెకు అందజేశారు. ఇంటికి వెళ్లి భర్తకు ప్రిస్క్రిప్షన్, మందును ఆమె చూపించింది. భర్త అజిత్ కుమార్ పట్నాయక్ ప్రిస్క్రిప్షన్లోని మందు మారినట్లు గుర్తించి, లోషన్తో పాటు తన కుమారుని తీసుకుని చైల్డ్ స్పెషలిస్ట్ స్వంయి వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ లోషన్ తాగించి ఉంటే ప్రాణాపాయం సంభవించేదని తాగించకుండా తన దగ్గరకు రావడం మంచిదైందని స్పెషలిస్ట్ వైద్యుడు అన్నారు. ఈ విషయం హస్పిటల్ ఆవరణలో సంచలనం సృష్టించింది. పొరపాటు చేసిన నిరామయి సిబ్బందిపై హాస్పిటల్ అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్ బెహర మండిపడుతూ విచారణ జరిపి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. -
ప్రపంచంలో ఏ దగ్గుమందూ పనిచేయదు
లండన్: నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాఫ్ సిరప్ (దగ్గుమందు)లు అందుబాటులో ఉన్నాయి. ఓ మోస్తరు దగ్గు వచ్చినా, ఊపరి సలపని దగ్గు వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళతాం. ఏ డాక్టరైనా యాంటీ బయాటిక్స్తోపాటు ఏదో కాఫ్ సిరప్ రాసిస్తారు. కాఫ్ సిరప్ తాగితే గానీ రోగులకు సంతృప్తి ఉండదు. వాస్తవానికి ఏ కాఫ్ సిరప్ పని చేయదట. అది ఒట్టి భ్రమ మాత్రమేనని బ్రిటన్కు చెందిన వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఒక్క బ్రిటన్లోనే ఏడాదికి నాలుగువేల కోట్ల రూపాయలను దగ్గు మందుల కోసం ఖర్చు పెడుతున్నారట. ఒక్క దగ్గుమందే కాదు. ఎముకలు గట్టిపడేందుకు తీసుకునే కాల్షియం మాత్రలు, రక్తంలో చెడు కొలస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించేందుకు తీసుకునే ఒమేగా త్రీ (మంచి ఫ్యాట్) చేప నూనె మాత్రలు, చెవి నొప్పికి వాడే యాంటీబయాటిక్స్, లయ తప్పిన గుండెకు తీసుకునే ఆస్ప్రిన్ మాత్రలు, వెన్ను నొప్పి, మొకాలి నొప్పులకు తీసుకునే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, చెడు కొలస్ట్రాల్ లేదా ఎల్డీఎల్ తగ్గేంచేందుకు వాడే స్టాటిన్స్, వెన్నునొప్పికి ఇచ్చే ఆక్యుపంక్చర్ చికిత్స ఇవి ఏవీ కూడా ఫలితం ఇవ్వవని, ఇవి కేవలం రోగుల భ్రమ, డాక్టర్ల అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు అంటున్నారు. డెక్స్ట్రోమెథార్ఫాన్ లేని ఏ దగ్గు మందు కూడా పనిచేయదని, దగ్గును తగ్గించలేదని హల్ యూనివర్సిటీలోని రెస్పిరేటరీ నిపుణుడు ప్రొఫెసర్ అలిన్ మొరైస్ తెలిపారు. డెక్స్ట్రోమెథార్ఫాన్ ఉన్న దగ్గుమందును కూడా 60 మిల్లీ గ్రాములను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కనక అది కూడా పనిచేయదని ఆయన అంటున్నారు. ఎక్కువ మోతాదులో అంటే పావు సీసా తాగితే గానీ అది పనిచేయదట. తాను ఐదువేల మంది రోగులపై జరిపిన ఔషధ ప్రయోగంలో ఈ విషయం తేలిందని ఆయన చెబుతున్నారు. వైరస్ వల్ల వచ్చే దగ్గు దానంతట అదే తగ్గిపోతుందని, బ్యాక్టీరియా వల్ల వచ్చే దగ్గు యాంటీబయాటిక్స్ వల్ల తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. కాల్షియం మాత్రల వల్ల ఎముకలు గట్టిపడ్డాయనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని లండన్లోని లీడ్స్ టీచింగ్ ఆస్పత్రిలో కార్డియోలజిస్ట్గా పనిచేస్తున్న క్లాస్ విట్టీ చెబుతున్నారు. పాలు, వెన్న రూపంలో వచ్చే కాల్షియం శరీర అవసరాలకు సరిపోతుందని ఆయన అంటున్నారు. నడుము నొప్పికి ఆక్యుపంక్చర్ చికిత్స పనిచేయదని సౌత్ఆంప్టన్ యూనివర్శిటీలో హెల్త్ రిసర్చర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జార్జి లెవిత్ చెబుతున్నారు. గుండె జబ్బులకు ఇచ్చే ఒమకార్ (ఒమేగా 3 ఫిష్ ఆయిల్) లాంటి మందులు పనిచేయవని లండన్ బ్రిడ్జ్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ కార్డియోలజిస్ట్గా పనిచేస్తున్న సందీప్ పటేల్ తెలియజేస్తున్నారు. పదేళ్ల వయస్సు పిల్లల్లో ప్రతి నలుగురికి ఒకరికి చొప్పున చెవి పోటు వస్తుందని, ప్రతి ముగ్గురిలో ఇద్దరికి డాక్టర్లు యాంటీబయాటిక్స్ను సూచిస్తారని, వాస్తవానికి వైరస్ వల్ల చెవిపోటు వస్తుంది కనుక యాంటీబయాటిక్స్ డోస్ సరిపోదని బ్రిటన్ ఈఎన్టీ స్పెషలిస్టుల అధ్యక్షుడు టోని నెరులా తెలియజేస్తున్నారు. వైరస్ వల్ల వచ్చే చెవిపోటు ఎలాంటి మందులు వాడనవసరం లేకుండానే 48 గంటల్లో దానంతట అదే తగ్గిపోతుందని ఆయన చెబుతున్నారు. ఓ మోస్తరు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వాడే ఏ యాంటీడిప్రెషన్ మందులు పనిచేయవని లండన్ యూనివర్శిటీ కాలేజ్ అధ్యాపకుడు, పలు క్లినికల్ పత్రాల రచయిత జోన్న మాంక్రిఫ్ చెబుతున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆయన అంటున్నారు. ఇన్ని జబ్బులకు వాడే మందుల వల్ల ప్రయోజనం లేదని, తగ్గుతుందనుకోవడం ఒట్టి భ్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నా.. వీటి వాడకం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అంతా మార్కెట్ మాయాజలం. -
344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేదం
జాబితాలో ఫైజర్ కోరెక్స్, అబాట్ ఫెన్సెడిల్ న్యూఢిల్లీ: దగ్గు సిరప్లతో సహా మొత్తం 344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. వీటి వినియోగం మానవులకు హానికరమని, వీటికి సురక్షితమైన ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నిషేధం తక్షణం వర్తిస్తుందని వివరించింది. నిషేధించిన ఔషధాలను తయారు చేస్తున్న కంపెనీలకు గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వివరణ ఇవ్వడానికి తగిన సమయం కూడా ఇచ్చామని ఆరోగ్య మం త్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ 344 ఔషధాలను నిషేధించామని వివరించారు. ఇలా నిషేధించిన వాటిలో ఫైజర్ కంపెనీ కోరెక్స్ బ్రాండ్ కింద విక్రయించే దగ్గు సిరప్, అబాట్ కంపెనీ ఫెన్సెడెల్ పేరుతో విక్రయించే దగ్గు సిరప్లు కూడా ఉన్నాయి. కోరెక్స్ తయారీ, విక్రయాలను తక్షణం నిలిపేశామని ఫైజర్ కంపెనీ, ఫెన్సెడిల్ విక్రయాలను ఆపేశామని అబాట్ కంపెనీలు పేర్కొన్నాయి. రెండు లేదా అంతకుమించిన యాక్టివ్ డ్రగ్స్ను ఒక సింగిల్ డోస్ రూపంలో తయారు చేసే ఔషధాలను ఫిక్స్డ డోస్ కాంబినేషన్ ఔషధాలుగా వ్యవహరిస్తారు. -
విమాన సిబ్బందే స్మగ్లర్లు!
- నిషేధిత కాఫ్ సిరప్ను స్మగ్ల్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ న్యూఢిల్లీ/లండన్: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి పతాక శీర్షికలకెక్కింది. రాకపోకల్లో ఆలస్యం, సిబ్బంది అలసత్వం, అక్రమరవాణా ఆరోపణలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఎయిర్ ఇండియాను తాజాగా కాఫ్ సిరప్(దగ్గుమందు) స్మగ్లింగ్ ఉదంతం కుదిపేసింది. సాక్షాత్తూ విమాన సిబ్బందే భారీ స్థాయిలో కాఫ్ సిరప్ (బెనడ్రిల్)ను స్మగ్ల్ చేస్తూ పట్టుబడ్డారు. ఢిల్లీ నుంచి లండన్ వెళుతోన్న విమానం నుంచి 450 బాటిళ్ల కాఫ్ సిరప్ (బెనడ్రిల్)ను స్వాధీనం చేసుకున్న లండన్ కస్టమ్స్ అధికారులు.. తదుపరి దర్యాప్తు నిమిత్తం విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నెల రోజుల కిందట జరిగిన ఈ ఉదంతాన్ని ఎయిర్ ఇండియా అధికారులు దాచిపెట్టినప్పటికీ చివరికి బట్టబయలైంది. దీంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థింబోమని, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి మహేశ్ శర్మ ప్రకటించారు. బెనిడ్రల్ సహా వివిధ కంపెనీల కాఫ్ సిరప్లు భారత్లో యథేచ్ఛగా అమ్ముతారు. కానీ లండన్ సిటీ సహా యునైటెడ్ కింగ్ డమ్ అంతటా ఈ మందుపై నిషేధం ఉంది. ఎక్కువ మోతాదులో కాఫ్ సిరప్ను తాగితే.. మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వాడినప్పుడు కలిగే అనుభూతి ఉంటుందని నిర్థారణ కావడంతోనే అక్కడి ప్రభుత్వాలు దగ్గు టానిక్లను నిషేధించాయి. కాఫ్ సిరప్ను డ్రగ్గా ఉపయోగించిన ఉదంతాలు ఇటీవల హైదరాబాద్లోనూ వెలుగులోకి రావటం గమనార్హం. యూకేలో డిమాండ్ దృష్ట్యా భారీ స్థాయిలో కాఫ్ సిరప్ అక్రమరవాణా అవుతోంది. లండన్కు సరఫరా అవుతోన్న సిరప్ లో అధిక శాతం విమానల ద్వారా స్మగ్ల్ అవుతున్నట్లు, ఇందులో మహిళా సిబ్బంది పాత్రకూడా ఉన్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది తమ లగేజీల్లో బంగారం, నిషేధిత ట్యాబ్లెట్లు తదితర వస్తువులతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే.