ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దుర్మరణం | Two Software Employees Dies In Hyderabad Road Accident, Know More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దుర్మరణం

Apr 21 2025 9:04 AM | Updated on Apr 21 2025 10:45 AM

Two Software employees Dies In Hyderabad Road Accident

    ఓఆర్‌ఆర్‌పై అదుపుతప్పిన కారు 

దుండిగల్‌(హైదరాబాద్): ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్‌వేర్‌ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 

ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్‌ (36), నళినికంఠ బిస్వాల్‌ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్‌ మంచిరేవులలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరు వైపు కారులో వస్తున్నారు. 

ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్‌ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.  

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement