KTR's Son Himanshu At Telangana Assembly Monsoon Session To Watch CM KCR Speech - Sakshi
Sakshi News home page

తాత కేసీఆర్‌ స్పీచ్‌ను దగ్గరనుంచి చూసిన హిమాన్షు

Aug 7 2023 11:03 AM | Updated on Aug 7 2023 3:39 PM

KTR Son Himanshu Telangana Assembly Monsoon Session CM KCR Speech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సందర్శకుల గ్యాలరీలో మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు ఆదివారం తన స్నేహితులతో కలిసి వచ్చి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ ప్రగతిపై లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పక్షనేత భట్టి విక్రమార్క ప్రసంగం, అనంతరం తన తాత, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సమాధానాన్ని హిమాన్షు విన్నారు.

కాగా, నాలుగు రోజులపాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement