పంట నష్టం పరిహారానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ | EC green signal for crop damage compensation | Sakshi
Sakshi News home page

పంట నష్టం పరిహారానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

Apr 30 2024 5:57 AM | Updated on May 2 2024 4:14 PM

రైతులకు మొదటి విడత నష్టానికి సర్కారు సాయం  

రూ.15.81 కోట్లు అందజేయాలని నిర్ణయం  

15,814  ఎకరాల్లో పంట నష్టం

సాక్షి, హైదరాబాద్‌: గత నెల వడగళ్లు, అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రైతులకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే. 

మొత్తం పది జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. 15,246 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.15.81 కోట్లు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత ప్రభు­త్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.  

Advertisement
 
Advertisement
Advertisement