ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా పదవులు అనుభవించారే తప్పా, ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఖమ్మం-దేవరపల్లి హైవేను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం, ఇందులో తుమ్మలకు ఏమీ సంబంధం లేదన్నారు.
అధికార పార్టీ తమపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక ప్రతీ దానికి సమాధానం చెప్తామని పువ్వాడ హెచ్చరించారు. పదవులు అనుభవించిన వారే గొడ దూకి పార్టీలు మారారని, అధికారంలో ఉన్పప్పుడు కొందరు ఇప్పుడు మారినా తమకేం ఇబ్బంది లేదన్నారు. తాను ఎక్కడికీ పోవడం లేదని, ఖమ్మం నుంచే పోటీ చేస్తానన్నారు.


