సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని రాజకీయ పరిశీలకుడు జోతిర్మయరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉత్తర –దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా వైరుద్యం నెలకొన్న నేపథ్యంలో దామాషా పద్దతిన పెంచటమే మేలని ఆయన చెప్పారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో 182 శాసనసభ స్థానాలు, 26లోక్సభ స్థానాల ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు సైతం 60 స్థానాలు రిజర్వు అవుతాయని, అయితే వాటిని లాటరీ పద్దతిన ఎంపకి చేసే అవకాశం ఉంటుందని జ్యోతిర్మయరెడ్డి వెల్లడించారు.


