పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో వివాహిత ఆత్మహత్య.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో వివాహిత ఆత్మహత్య..

Aug 23 2023 12:32 AM | Updated on Aug 23 2023 9:38 AM

- - Sakshi

సౌందర్య(21)కు మాంగావరం సమీపంలోని చెన్నవరం గ్రామానికి చెందిన గణేషన్‌తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

తమిళనాడు: పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో జరిగింది. నెట్టుకాడు గ్రామానికి చెందిన ఏలుమలై కుమార్తె సౌందర్య(21)కు మాంగావరం సమీపంలోని చెన్నవరం గ్రామానికి చెందిన గణేషన్‌తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంత వరకు పిల్లలు లేరు. దీంతో అవమానంగా భావించిన యువతి తరచూ తల్లిదండ్రుల వద్ద బాధపడినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 13న తనకు పిల్లలు లేకపోవడంతో అందరి వద్ద మాటపడాల్సి వస్తోందని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బాధపడింది. అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. యువతి తల్లిదండ్రులు అనుమానంతో అక్కడికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చిక్సిత కోసం చైన్నె వైద్యశాలకు తరలించారు.

అక్కడ చిక్సిత పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఏలుమలై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement