టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం | Towhid Hridoy Who Scored Sensational Century Against India Banned For Four Matches In DPL 2025, More Details Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం

Apr 27 2025 11:29 AM | Updated on Apr 27 2025 1:41 PM

Towhid Hridoy Banned For Four Matches

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాపై సంచలన శతకం సాధించి వార్తల్లో నిలిచిన బంగ్లాదేశ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ తౌహిద్‌ హృదోయ్‌ నిషేధానికి గురయ్యాడు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌-2025లో ఓ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు అతడిపై నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ (8 డీమెరిట్‌ పాయింట్లతో పాటు) విధించబడింది. 

దీంతో హృదోయ్‌ ఈ సీజన్‌లో అబాహీనీ జట్టుతో జరిగే కీలక మ్యాచ్‌తో పాటు వచ్చే సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ​దూరం కానున్నాడు. హృదోయ్‌ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో (DPL) మొహమ్మదెన్‌ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఘాజీ గ్రూప్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై  అసంతృప్తిని  వ్యక్తం చేశాడు.

24 ఏళ్ల హృదోయ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 35 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా హృదోయ్‌ సూపర్‌ సెంచరీతో (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. జాకిర్‌ అలీతో (68) కలిసి ఆరో వికెట్‌కు 154 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

తద్వారా బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. అనంతరం భారత్‌ సులువగా లక్ష్యాన్ని ఛేదించినా హృదోయ్‌ ఇన్నింగ్స్‌ అందరినీ ఆకట్టుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీ (101 నాటౌట్‌) చేసి భారత్‌ను గెలిపించాడు. రోహిత్‌ శర్మ (41), కేఎల్‌ రాహుల్‌ (41 నాటౌట్‌) కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ టోర్నీలో భారత్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీకి పాక్‌ ఆతిథ్యమివ్వగా, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement