క్వార్టర్స్‌లో సింధు  | Indian star PV Sindhu has made it to the quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు 

Mar 8 2024 1:16 AM | Updated on Mar 8 2024 1:16 AM

Indian star PV Sindhu has made it to the quarter finals - Sakshi

డబుల్స్‌లో గాయత్రి జోడీ సంచలనం  

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి వెళ్లింది. ప్రపంచ 10వ ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 13–21, 21–10, 21–14తో గెలిచింది.

మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) ద్వయం 21–18, 21–13తో ప్రపంచ 7వ ర్యాంక్‌ జంట యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్‌)ను బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. పురుషుల సింగిల్స్‌ ప్రి  క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ 78 నిమిషాల్లో 21–19, 12–21, 20–22తో గ్వాంగ్‌ జు (చైనా) చేతిలో ఓడిపోయాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement