Sakshi News home page

#DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?

Published Sun, Jul 9 2023 10:44 AM

Fans Slam Jayant Yadav-53 Minutes For-6-Overs-Time Wasting-Duleep-Trophy - Sakshi

మాములుగా క్రికెట్‌లో ఐదు ఓవర్లు బౌలింగ్‌ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్‌ ట్రోపీ సెమీఫైనల్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

అయితే సౌత్‌ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్‌ కెప్టెన్‌ జయంత్‌ యాదవ్‌ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు.  మ్యాచ్‌ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్‌ ముందంజ వేసేది.

కానీ సౌత్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్‌ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్‌ (15 నాటౌట్‌) మ్యాచ్‌ ముగించడం విశేషం. అయితే నార్త్‌జోన్‌ కెప్టెన్‌ జయంత్‌ యాదవ్‌ వైఖరిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్‌ చేశారు.. 

సౌత్‌జోన్‌ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్‌ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్‌ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్‌ వర్మ, సాయికిషోర్‌లు జట్టును విజయతీరాలకు చేర్చారు.

చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్‌-21 చాంపియన్‌ ఇంగ్లండ్‌

Womens Ashes 2023: యాషెస్‌ సిరీస్‌ విజేతగా ఇంగ్లండ్‌.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్‌ ఓటమి

Advertisement

What’s your opinion

Advertisement