శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ళ్లీ ఫెయిల్‌.. 286 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి | Buchi Babu Tournament: Shreyas Iyer Once Again Falls To A Short Ball | Sakshi
Sakshi News home page

#Shreyas Iyer: శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ళ్లీ ఫెయిల్‌.. 286 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి

Aug 30 2024 8:44 PM | Updated on Aug 30 2024 8:44 PM

Buchi Babu Tournament: Shreyas Iyer Once Again Falls To A Short Ball

శ్రేయస్‌ అయ్యర్‌(ఫైల్‌ ఫోటో)

బుచ్చిబాబు టోర్నీ-2024లో టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ పేలవ ఫామ్ కొన‌సాగుతోంది. ఈ టోర్నీలో ముంబైకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అయ్య‌ర్‌.. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌పరిచాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔటైన శ్రేయ‌స్.. రెండో ఇన్నింగ్స్‌లో 22 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. మ‌రోసారి షార్ట్‌బాల్ బ‌ల‌హీన‌త‌ను అయ్య‌ర్ అధిగ‌మించలేకపోయాడు. త‌మిళ‌నాడు పేస‌ర్‌ అచ్యుత్ వేసిన‌ షార్ట్‌పిచ్ బాల్‌కు ఫుల్‌షాట్ ఆడబోయి క్యాచ్‌గా శ్రేయ‌స్ దొరికిపోయాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. మ‌రోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 30 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అత‌డి చేతి వేలికి ప్రాక్టీస్ స‌మ‌యంలో గాయ‌మైంది. 

అయితే గాయం అంత తీవ్ర‌మైన‌ది కాన‌ట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ముంబై పై 286 ప‌రుగుల తేడాతో తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్ ఘ‌న విజ‌యం సాధించింది. 510 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై జ‌ట్టు 223 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో షామ్స్ ములానీ(68) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement