టీ20 సిరీస్‌ ఓటమి.. నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్ గోవిందా | Team India Lost Number One Spot-T20 Rankings Series Lost Vs ENG | Sakshi
Sakshi News home page

టీ20 సిరీస్‌ ఓటమి.. నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్ గోవిందా

Jul 12 2026 7:56 AM | Updated on Jul 12 2026 8:09 AM

Team India Lost Number One Spot-T20 Rankings Series Lost Vs ENG

నాలుగు నెల‌ల కిందట జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను మూడోసారి కైవ‌సం చేసుకొని నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని అధిరోహించిన టీమిండియా తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓటమితో ఆ స్థానాన్ని కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్ప‌గించి దారుణ ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న‌ భార‌త జ‌ట్టు సిరీస్‌తో పాటు నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని కూడా ఇంగ్లండ్‌కు అప్ప‌గించేసింది. 1605 రోజుల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.

పాయింట్ల ప‌రంగా మార్పు లేన‌ప్ప‌టికీ మ్యాచ్‌ల ప‌రంగా తేడా ఉండ‌డంతో ఇంగ్లండ్ తొలి స్థానాన్ని ఆక్ర‌మించింది. రెండో స్థానంలో భార‌త్ (268 పాయింట్లు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (260 పాయింట్లు) కొన‌సాగుతున్నాయి. గ‌త నాలుగేళ్ల‌లో నంబ‌ర్‌వ‌న్ ర్యాంకు కోల్పోవ‌డంతో పాటు రెండు వ‌రుస టీ20 సిరీస్‌లు ఓడ‌డం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి కావ‌డం గ‌మనార్హం.  ఈ నేప‌థ్యంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓట‌మి ద్వారా ప‌లు చెత్త రికార్డుల‌ను కూడా భార‌త్ త‌న పేరిట లిఖించుకుంది.

👉టీమిండియాకు ప‌రుగుల ప‌రంగా (56 ప‌రుగులు) ఇది నాలుగో అతిపెద్ద ఓట‌మి. గ‌తంలో 2026లో ఇంగ్లండ్ చేతిలోనే 125 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. 2091లో న్యూజిలాండ్ చేతిలో 80 ప‌రుగులు, 2026లో సౌతాఫ్రికా చేతిలో 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది.

👉ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఓడ‌డం ద్వారా ఒక సిరీస్‌లో అత్య‌ధిక ఓట‌ములు చ‌విచూసిన‌ట్ల‌యింది. గ‌తంలో 2009 మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో మూడు ఓట‌ములు, 2010 మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో మూడు ఓట‌ములు, 2023 వెస్టిండీస్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో మూడు ఓట‌ములు చ‌విచూసింది.

👉కెప్టెన్‌గా తొలి ఏడు టీ20 మ్యాచ్‌ల్లో గెలుపు లేని ఆట‌గాళ్ల జాబితాలో శ్రేయ‌స్ అయ్య‌ర్ చోటు సంపాదించాడు. గ‌తంలో బ్రెండ‌న్ టేల‌ర్ (జింబాబ్వే), ఎల్ట‌న్ చిగుంబ‌రా (జింబాబ్వే), తిసారా పెరీరా (శ్రీలంక‌) ఈ ఫీట్ సాధించారు. ఇక భార‌త కెప్టెన్ల‌లో రెండు వ‌రుస టీ20 సిరీస్‌ల‌తో పాటు ఏడు మ్యాచ్‌ల్లో గెలుపు రుచి చూడ‌ని తొలి కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ చెత్త రికార్డు న‌మోదు చేశాడు.

👉 భారత క్రికెటర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ ఒక చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంబ‌టి రాయుడు త‌ర్వాత తాను ఆడిన మొద‌టి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ప్రిన్స్ యాద‌వ్ ఓట‌మి చ‌విచూడ‌డం గ‌మ‌నార్హం.

 

చదవండి: 'ఇది మాకు గుణ‌పాఠం.. ఓట‌మికి కారణం అదే'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement