కశ్మీర్‌లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ | Pm Modi Speech In Jammu Election Rally | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ

Sep 28 2024 2:46 PM | Updated on Sep 28 2024 3:24 PM

Pm Modi Speech In Jammu Election Rally

జమ్మూ:కశ్మీర్‌లో తొలిసారి పూర్తిమెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.జమ్మూలో శనివారం(సెప్టెంబర్‌28)నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.

‘కశ్మీర్‌లో ఇప్పటికే పూర్తయిన రెండు దశల ఎన్నికల్లో పోలింగ్‌ సరళి చూస్తే ప్రజల మూడ్‌ ఎలా ఉందో అర్థమవుతోంది.రెండు దశల పోలింగ్‌లో భారీగా ఓటింగ్‌ శాతం నమోదైంది.ప్రజలంతా బీజేపీకే ఓటు వేశారు’అని మోదీ అన్నారు.

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్‌ పూర్తవగా మూడో దశ పోలింగ్‌ ఆదివారం జరగనుంది.మొత్తం ఐదు దశల్లో కశ్మీర్‌ ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తోంది. 

ఇదీచదవండి: నిర్మలాసీతారామన్‌పై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement