మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్‌ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల | Congress Fourth List Released For Maharashtra Assembly Elections, Check Candidates Names Inside | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్‌ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

Oct 28 2024 7:01 AM | Updated on Oct 28 2024 9:37 AM

Congress Fourth List Released for Maharashtra Assembly Elections

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఉత్సాహంగా కార్యరంగంలోకి దూకాయి. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల నాలుగో జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనికితోడు తాజాగా విడుదల చేసిన జాబితాలో గతంలో ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులను పార్టీ మార్చింది. దీనికి ముందు కాంగ్రెస్ మూడు జాబితాలను విడుదల చేసింది. కాంగ్రెస్ తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మూడో జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే పార్టీ మూడో జాబితాలో ప్రకటించిన ఒక అభ్యర్థిని నాలుగో జాబితాకు మార్చింది.

అంధేరీ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి సచిన్ సావంత్ స్థానంలో అశోక్ జాదవ్ పేరును పార్టీ ప్రతిపాదించింది. నిజానికి కాంగ్రెస్ తన మూడవ జాబితాలో సచిన్ సావంత్ పేరును ప్రకటించగా, అతను ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. అశోక్ జాదవ్ గతంలో అంధేరి వెస్ట్ నుండి అమిత్ సాతంపై ఎన్నికలలో పోటీ చేశారు. పార్టీ తన రెండో జాబితాలో ఔరంగాబాద్ తూర్పు నుంచి మధుకర్ కిషన్‌రావ్ దేశ్‌ముఖ్‌కు టికెట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అతని స్థానంలో లాహు హెచ్ షెవాలేను రంగంలోకి దించింది.

కాంగ్రెస్ తన నాలుగో జాబితాలో అమల్నేర్ నుంచి డాక్టర్ అనిల్ నాథు షిండే, ఉమ్రేడ్ నుంచి సంజయ్ నారాయణ్ మెష్రామ్, అల్పరి నుంచి రాందాస్ మస్రం, చంద్రాపూర్ నుంచి ప్రవీణ్ నానాజీ పడ్వేకర్, బల్లార్‌పూర్ నుంచి సంతోష్ సింగ్ చంద్ర సింగ్ రావత్, వరోరా నుంచి ప్రవీణ్ సురేశ్ కకడే,  నాందేడ్ నార్త్‌ నుంచి అబ్దుల్ సత్తార్ అబ్దుల్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.

వీరితో పాటు ఔరంగాబాద్ ఈస్ట్ నుంచి లాహు హెచ్ షెవాలే, నలసోపరా నుంచి సందీప్ పాండే, అంధేరీ వెస్ట్ నుంచి అశోక్ జాదవ్, శివాజీనగర్ నుంచి దత్తాత్రేయ బహిరత్, పుణె కాంట్ నుంచి రమేశ్ ఆనంద్ రావ్ భాగ్వే, షోలాపూర్ సౌత్ నుంచి దిలీప్ బ్రహ్మదేవ్ మానే, పండర్‌పూర్ నుంచి భగీరథ్ భాల్కే అభ్యర్థులుగా నిలబెట్టింది. 

ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్‌ ముందడుగు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement