బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్‌ | Brs Warangal Mp Pasunuri Dayakar Joined Congress | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్‌

Mar 16 2024 9:40 PM | Updated on Mar 16 2024 9:40 PM

Brs Warangal Mp Pasunuri Dayakar Joined Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్త నేతలపై దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మరోవైపు, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement