యోగా జిల్లాగా మైసూరు?.. ఘనత ఇదే.. | Will Mysuru be Indias First Official Yoga District | Sakshi
Sakshi News home page

యోగా జిల్లాగా మైసూరు?.. ఘనత ఇదే..

Jun 19 2025 1:36 PM | Updated on Jun 19 2025 2:56 PM

Will Mysuru be Indias First Official Yoga District

మైసూరు: కర్నాటకలోని మైసూరు అటు సాంస్కృతిక, ఇటు ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రంగా విలసిల్లుతోంది.  ఇప్పుడు ఈ పట్టణం మరో ఖ్యాతిని కూడా దక్కించుకోనుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మైసూర్‌ను దేశంలోని మొట్టమొదటి ‘యోగా జిల్లా’గా మార్చాలని కోరుతూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదన పంపింది.

2024లో ఆయుష్  అధికారుల బృందం నిర్వహించిన సర్వేలో మైసూర్ జిల్లాలోని  50 శాతం కుటుంబాలు క్రమం తప్పకుండా యోగాను అభ్యసిస్తున్నాయని వెల్లడయ్యింది. మైసూర్ శక్తివంతమైన వెల్నెస్ వ్యవస్థను కలిగి ఉంది. కర్ణాటకలోని 326 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో 22 ఒక్క మైసూర్‌లోనే  ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన యోగాచార్యులు ఉన్నారు. జిల్లాలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం, ప్రకృతి వైద్య కళాశాలలు, పంచకర్మ కేంద్రాలు, యోగా కేంద్రాలు కూడా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభ్యాసకులకు మైసూర్ ఇష్టమైన ప్రాంతంగా మారింది. ఈ నగరంలో ప్రతియేటా 25 వేల మంది విదేశీయులు యోగాను  నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా మైసూరులో 600 సర్టిఫైడ్ యోగా శిక్షణ సంస్థలున్నాయి. మైసూరును అధికారికంగా యోగా జిల్లాగా ప్రకటిస్తే, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: రాహుల్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement