కాంగ్రెస్‌ రెబల్స్‌కు సుప్రీంలో చుక్కెదురు | Supreme Court Refuses To Stay Disqualification Of Rebel Congress MLAs | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ కాంగ్రెస్‌ రెబల్స్‌కు సుప్రీంలో చుక్కెదురు

Mar 19 2024 6:33 AM | Updated on Mar 19 2024 11:21 AM

Supreme Court Refuses To Stay Disqualification Of Rebel Congress MLAs - Sakshi

ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఆరుగురు శాసనసభ్యులు ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనర్హత నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం విచారణ జరిపింది.

నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా కార్యాలయానికి నోటీసు పంపింది. పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అసెంబ్లీ కార్యకలాపాలతోపాటు ఓటింగ్‌లోనూ పాల్గొనరాదని ఆరుగురికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు మే 7 ఆఖరు తేదీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement