అయోధ్య విరాళాల్లో అక్రమాలు: ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే లేఖ! | Rahul And Kharge Write To PM Modi Seeking Probe Into Ayodhya Ram Temple Donations Scam, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల్లో అక్రమాలు: ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే లేఖ!

Jul 19 2026 11:24 AM | Updated on Jul 19 2026 1:41 PM

Rahul, Kharge write to PM Modi seeking probe into Ram Temple Trust

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలను బహిరంగపరచాలని వారు డిమాండ్ చేశారు.

భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకున్న విరాళాలు అపహరణకు గురికావడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఈ విషయంపై ప్రధాని మౌనం వీడాలని లేఖలో పేర్కొన్నారు. నగదు, బంగారం, వెండి కానుకల స్వీకరణలో జరిగిన అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, నివేదికను ప్రజల ముందు ఉంచాలని వారు కోరారు. జూన్ ప్రారంభంలో ఈ విరాళాల అపహరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు కీలక బాధ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రస్ట్ ఫిర్యాదు మేరకు జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ ట్రస్ట్‌లో కేంద్రం నియమించిన సభ్యులే ఉన్నారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్, ఖర్గే డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో కుండపోత: జలమయమైన రాజౌరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement