నాన్నా.. ఈ మెంటల్‌ టార్ఛర్‌ భరించలేకున్నా! | Newlywed Married Woman Ends Her Life In Tamilnadu, More Details Inside | Sakshi
Sakshi News home page

నాన్నా.. ఈ మెంటల్‌ టార్ఛర్‌ భరించలేకున్నా!

Jun 30 2025 10:01 AM | Updated on Jun 30 2025 10:50 AM

newlywed married woman ends life in tamilnadu

తండ్రికి ఆడియో పంపి నవ వధువు ఆత్మహత్య 

అన్నానగర్‌: తిరుప్పూర్‌ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్‌ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్‌ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్‌ లోని జయం గార్డె¯న్‌కు చెందిన కవింకుమార్‌కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. 

ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్‌  పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్‌ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్‌కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement