Karnataka: 30 Students Hospitalised After Eating Chicken Meal In Gundlupet - Sakshi
Sakshi News home page

కోడికూర తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Jul 18 2023 12:39 PM | Updated on Jul 18 2023 12:57 PM

 Karnataka: 30 Students Hospitalised After Eating Chicken Meal - Sakshi

మైసూరు: కోడికూరతో భోజనం చేసిన సుమారు 30 మందికి పైన విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తలూకాలోని యడవనహళ్లి గ్రామంలోని మొరార్జీదేశాయ్‌ వసతి పాఠశాలలో జరిగింది. ఆదివారం రాత్రి సుమారు 30 మందికి పైన విద్యార్థులు చికెన్‌ భోజనం తిన్నారు.

కొంతసేపటికి వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో 15 మందిని బేగూరు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 15 మందిని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు విద్యార్థులతో మాట్లాడి కారణాలపై ఆరా తీశారు. అపరిశుభ్రమైన వంట పాత్రలు, నాణ్యత లేని చికెన్‌ వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానం.


చదవండి: వందేభారత్‌ స్టాప్‌ కోసం సుప్రీంలో పిటిషన్‌.. సీరియస్‌ అయిన చీఫ్‌ జస్టిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement