అహ్మదాబాద్: భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాతో మొదలుపెట్టి ఓట్ల లెక్కింపు వరకూ ప్రతిదశలోనూ ధ్రువీకరణ జరుగుతూండటం ఇందుకు కారణమని ఆయన చెప్పారు.
అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్శిటీ అటల్ కలామ్ హాల్లో శుక్రవారం బూత్ లెవల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రతిదశలోనూ రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు నిరంతరం ధ్రువీకరణ చేస్తూంటారు కాబట్టి ఇది అత్యంత పారదర్శక ఎన్నికల విధానమని స్పష్టం చేశారు.


