breaking news
Gyanesh Kumar
-
ఎన్నికల సంఘం కొత్త యాప్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం కొత్త యాప్ ‘ఈసీఐనెట్’ను ప్రారంభించారు. ఓటర్లు, అధికారులు, రాజకీయ పార్టీలకు సరైన సమాచారం అందించడానికే ఈ యాప్ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడానికి వీలవుతుందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లా డారు. ఇలాంటి యాప్ను తయారు చేసుకోవడానికి ఇతర దేశాల ఎన్నికల సంఘాలకు సహకరిస్తామని చెప్పారు. వారి చట్టాల ప్రకారం, వారి భాషల్లోనే యాప్ను రూపొందించుకోవచ్చని సూచించారు. ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రస్తుతం 40కిపై గా మొబైల్, వెబ్ అప్లికేషన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ‘ఈసీ ఐనెట్’ యాప్ను అభివృద్ధి చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలా పాల సమా చారం ఇందులో ఉంటుంది. వేర్వేరు యాప్లను డౌన్లోడ్ చేసుకొనే అవసరం ఇకపై ఉండదు. కొత్త యాప్తో ఓటర్ల డేటాను సులువుగా తెలుసు కోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ యాప్, ఓటర్ టర్నౌట్ యాప్, సీవిజిల్, సువిధ, సాక్ష్యం, కేవైసీ వంటి యాప్లను ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. -
తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీని కోరుతాం
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ఎస్ఐఆర్) సర్వే సమయంలో తొలగించిన 1.31 కోట్ల ఓటర్లకు సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ను కోరుతామని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ నెల 31వ తేదీన జ్ఞానేశ్ను కలుస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆ జాబితా ఇవ్వాలని అడుగుతామని, తమ డిమాండ్ నెరవేరని పక్షంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఘెరావ్ చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలితే ఢిల్లీలోనే నిరసనలను కొనసాగిస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించక పోవడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సమయంలో కోటిన్నర మంది ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ టార్గెట్ అని దీనర్థమా అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 58.20 లక్షల ఓటర్లలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులు ఎందరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ అనంతరం రాష్ట్రంలోని మొత్తం 10.05 కోట్ల జనాభాలో 5.79 శాతం జనాభా పేర్లను మాత్రమే తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఇదే అత్యంత తక్కువని ఎత్తి చూపారు. పశ్చిమబెంగాల్లో 50 శాతం వరకు ఓటర్లను గుర్తించలేకపోయినట్లు ప్రకటించిన ఈసీ..89 శాతం మేర ఓటర్ల వివరాలను ఎలా ప్రచురించిందని నిలదీశారు. దీనిపై ఈసీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమైన వ్యక్తులను సైతం చనిపోయిన జాబితాలో ఈసీ చేర్చిందన్నారు. ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయని, వీటిపై ఈసీపై కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అంటూ బెనర్జీ నిలదీశారు. మీరు ఎస్ఐఆర్తో గెలవాలనుకుంటే, ప్రజలు ఎఫ్ఐఆర్తో బదులిస్తారని ఆయన ఈసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగిన త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టడం లేదని ఈసీని అడిగారు. -
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
-
శ్రీశైలం మల్లన్న దర్శనం.. గొప్ప అనుభూతి
శ్రీశైలం టెంపుల్ : జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారిని, శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టం, గొప్ప అనుభూతి అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనార్థం కుటుంబంతో కలిసి శ్రీశైలం చేరుకున్న ఆయనకు భ్రమరాంబ అతిథి గృహం వద్ద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంతకముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ’ఆంధ్రప్రదేశ్ పౌరులకు నమస్కారం.. అందరూ బాగున్నారా’ అని తెలుగులో సంబోధించారు. శనివారం ఉదయం కూడా మరో సారి స్వామి అమ్మవార్లను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ దంపతులు దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు.


