సాగురైతుల అభివృద్దే లక్ష్యం: రాహుల్‌ గాంధీ | INDIA alliance will raise farmers concerns says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

సాగురైతుల అభివృద్దే లక్ష్యం: రాహుల్‌ గాంధీ

Mar 15 2024 5:52 AM | Updated on Mar 15 2024 5:52 AM

INDIA alliance will raise farmers concerns says Rahul Gandhi - Sakshi

నాసిక్‌: రైతుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి పనిచేస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ప్రకటించారు. తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయే రైతు సంక్షేమ కార్యక్రమా లను రాహుల్‌ వివరించారు.

గురువారం మహారాష్ట్రలో చాంద్‌వడ్‌లో రైతుర్యాలీలో ప్రసంగించారు. ‘‘ రైతన్నల ప్రయోజనాలే మాకు పరమావధి. వ్యవసాయాన్ని జీఎస్‌టీ పరిధి నుంచి తొలగిస్తాం. పంట బీమా పథకంలో సంస్కరణలు తెచ్చి రైతు అనుకూల విధానాలను ప్రవేశపెడతాం’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement