
శ్రీహరి కోట: ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ‘షార్’కు ఈరోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. తమిళానాడు కంమాండ్ కంట్రోల్కు ఈ బెదిరింపు ఫోను కాల్ అందింది. ఈ నేపధ్యంలో అంతరిక్ష కేంద్రంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఇటీవల భారత్ , పాక్ మధ్య దాడులు జరిగిన సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే పోర్టులు ఎయిర్ పోర్టులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింతగా పెంచారు. ఇదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం ‘షార్’ వద్ద భద్రతా దళాలును మొహరించారు.
ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ