సాక్షి, మంచిర్యాల: చెన్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులకు, భూకబ్జాదారులకు మధ్య ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారి సమీపంలోని భూములను కబ్జాదారులు అక్రమంగా ఆధీనంలోకి తీసుకన్నారు. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారుల జేసీబీలతో ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అక్రమదారులు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు.
దేవాదాయ శాఖ అధికారులపై పెట్రోల్ పోసి కారంపోడి జల్లి మరణాయుధాలతో వెంటాడారు. దీంతో తీవ్ర భయందోళనలకు గురైన అధికారులు వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


