-
నింగిలోకి దూసుకెళ్లిన PSLV C58 రాకెట్
-
శ్రీహరికోట నుండి నింగిలోకి పీఎస్ఎల్వీ సీ- 48
-
రేపు షార్కు ప్రధాని మోడీ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్కు చేరుకోనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇక్కడికి రానున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో చెన్నైకి వచ్చే మోడీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 4.30 గంటలకు షార్కు వస్తారు. గవ ర్నర్, సీఎం మాత్రం ఓ గంట ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు. గుంటూరు రేంజ్ ఐజీ సునీల్కుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సుమారు 3 వేల మంది పోలీసులు, 30 మంది ఎస్పీజీ కమాండోలు షార్కు చేరుకున్నారు. -
భద్రతా వలయంలో షార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్న నేపథ్యంలో శ్రీహరికోటలోని షార్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే షార్ చుట్టూ స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలు మోహరించాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ ఈ నెల 29వ తేదీ షార్కు రానున్న సంగతి తెలిసిందే. చెన్నై విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్లో ఆయన షార్కు చేరుకుంటారు. పధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు వీఐపీలు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు షార్లో మూడు హెలిపాడ్లు సిద్ధం చేస్తున్నారు. షార్కు చేరుకున్న ప్రధానిని మొదటి రోజు రాకెట్ లాంచింగ్ ప్యాడ్ను సందర్శించనున్నారు. 30వ తేదీ ఉదయం పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించనున్నారు. ఆయన 29వ తేదీ రాత్రి షార్లోని భాస్కర గెస్ట్హౌస్లో బస చేయనున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలతో పాటు అధికారులు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా నిఘా జిల్లాలోని తడ నుంచి కావలి వరకు ఉన్న 169 కిలోమీటర్ల తీరప్రాంతంలో మెరైన్ పోలీసులు గస్తీ కాస్తున్నారు. సోమవారం నుంచే పోలీసు బలగాలు షార్కు చేరుకుని, చుట్టుపక్కల ఉన్న అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి. షార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తోటకట్ట, అటకానితిప్ప, రాగన్న పట్టెడ, తిప్ప, కొన్నత్తూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను అక్కడ నుంచి ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరు ఈనెల 30వ తేదీ వరకు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వీలు లేదని పోలీసులు హుకుం జారీ చేశారు. ఇప్పటికే షార్కు మెరైన్ పోలీసులు, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. వీరు కాకుండా తమిళనాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన పోలీసులను అదనంగా రప్పిస్తున్నారు. రెండు రోజుల్లో ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా దళం కూడా షార్కు రానుంది. నేడు ఎస్పీజీ ఐజీ రాక భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బుధవారం ఢిల్లీ నుంచి ఎస్పీజీ ఐజి చతుర్వేది శ్రీహరికోటకు రానున్నారు. ఆయనతో పాటు అదనపు ఐజీలు సుధనుష్ సింగ్, సుమిత్ర రాయ్ మరో నలుగురు అధికారులు ఢిల్లీ నుంచి చెన్నై మీదుగా వస్తారని అధికారులు తెలిపారు. ప్రధాని 30వ తేదీన ఉదయం 9.49 గంటలకు రాకెట్ ప్రయోగం ముగిసిన తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్లో 11 గంటలకు చెన్నైకి బయలుదేరుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ప్రధాని బయలుదేరేంత వరకు భద్రతా ఏర్పాట్లను ఐజీ చతుద్వేరి పర్యవేక్షించనున్నారు. బాబు కోరికను మన్నించని మోడీ ప్రధాని మోడీ చెన్నై మీదుగా కాకుండా రేణిగుంట విమానాశ్రయం మీదుగా శ్రీహరికోటకు చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరికను ప్రధాని మన్నించలేదని తెలిసింది. రేణిగుంట నుంచి శ్రీహరికోట దగ్గరని, ఆంధ్రప్రదేశ్లోనే మోడీ విమానం దిగాలని కోరుతూ టెలిఫోన్లో సంభాషించిన విషయం తెలిసిందే. మొదట సరేనన్న మోడీ, తరువాత భద్రత దృష్ట్యా చెన్నై మీదుగానే శ్రీహరికోటకు చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. షార్లో హెలీప్యాడ్ల వద్ద బందోబస్తు షార్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు వేర్వేరుగా ఏర్పాటు చేసి హెలీప్యాడ్ల వద్ద మంగళవారం బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం అదనంగా 20 మంది రిజర్వ్ పోలీసులను షార్కు పంపారు. ఈ 20 మందిని ఒక్కో హెలీప్యాడ్ వద్ద పదేసి మందిని ఏర్పాటు చేశామని ఎస్సై జీ గంగాధర్రావు చెప్పారు. ప్రధాని రాకతో షార్లో 50 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. షార్ అటవీప్రాంతాన్ని, సముద్ర తీరప్రాంతాన్ని, తీరప్రాంత గ్రామాల్లో కూంబింగ్ను కొనసాగిస్తున్నారు. షార్లోని సీఐ ఎస్ఎఫ్ సిబ్బందికి ప్రధాని పర్యటన పూర్తయ్యేదాకా సెలవులు ఇవ్వద్దని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది. -
షార్లో స్పేస్ మ్యూజియం
సూళ్లూరుపేట, న్యూస్లైన్: శ్రీహరికోటలోని సతీష్ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో అంతరిక్ష శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలతో మ్యూజియం ఏర్పాటవుతోంది. స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి క్రమాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేందుకు అనేక సాంకేతిక పరికరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ కోర్సులు చదివే వారితో పాటు షార్ సందర్శనకు వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాకెట్ ప్రయోగ నమూనాను మ్యూజియంలో డిజైన్ చేశారు. ఉపగ్రహాల డిజైనింగ్ కూడా జరుగుతోంది. షార్లోని కురూప్ ఆడిటోరియం పక్కనే భారీ భవనాన్ని నిర్మించి అందులో ఈ ఏర్పాట్లన్నీ చకాచకా చేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి షార్ సందర్శనకు వచ్చే వారిని దీనిలోకి అనుమతిస్తామని షార్ వర్గాలు తెలిపాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement