
మంగపుత్ర హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘వృశ్చికం’(Vrischikam). ఈ చిత్రంలో యశ్విక హీరోయిన్గా నటిస్తున్నారు. గంగాధర్ రెడ్డి సమర్పణలో శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్పై శివరామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్చాన్ చేయగా, సుప్రీం కోర్టు అడ్వకేట్ హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు
. ఈ సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మంగపుత్ర మాట్లాడుతూ– ‘‘పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ‘బాహుబలి 1, బాహుబలి 2’ చిత్రాల్లో నటించాను. రాజమౌళి గారికి ఏకలవ్వ శిష్యుడిగా మారాను. ‘వృశ్చికం’ సినిమాలో హీరోగా నటిస్తూ, దర్శకుడిగా మారుతున్నాను. మూడు షెడ్యూల్స్లో 45 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని ΄్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు యశ్విక. ఈ కార్యక్రమంలో నటుడు కోసూరి సుబ్రహ్మణ్యం, నటి క్రాంతి బలివాడ, సంగీత దర్శకుడు ప్రమోద్, ఆర్ట్ డైరెక్టర్ సముద్రాల రవిచంద్ర మాట్లాడారు.