'ఢీ'.. దిల్‌రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు | Vishnu Manchu: Dil Raju Says Dhee Movie not Perform Well | Sakshi
Sakshi News home page

Vishnu Manchu: దిల్‌ రాజు 'ఢీ' సినిమా చూసి ఆడటం కష్టమన్నాడు

Jun 7 2025 5:19 PM | Updated on Jun 7 2025 5:56 PM

Vishnu Manchu: Dil Raju Says Dhee Movie not Perform Well

సూపర్‌ హిట్‌ కామెడీ చిత్రాల్లో 'ఢీ: కొట్టి చూడు' ఒకటి. మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 2007లో వచ్చింది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఢీ మూవీ(Dhee Movie)ని నిన్న (జూన్‌ 6) రీరిలీజ్‌ చేశారు. రీరిలీజ్‌ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే ఢీని మాత్రం పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఆడియన్స్‌ లేక థియేటర్లు ఖాళీగా దర్శనిమస్తున్నాయి.

నా బర్త్‌డే రోజు ఫస్ట్‌ షో
అయితే ఢీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విష్ణు. కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రమోషన్స్‌లో విష్ణు మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య మనమంతా ఎక్స్‌ట్రార్డినరీ అనుకున్న సినిమాలు ఆడియన్స్‌కు రీచ్‌ అవకపోవచ్చు. కొన్నేమో రివర్స్‌లో జరుగుతాయి. 2006లో నా పుట్టినరోజైన నవంబర్‌ 23న ప్రసాద్‌ ల్యాబ్‌లో ఢీ ఫస్ట్‌ షో పడింది. తర్వాత అది 2007, ఏప్రిల్‌ 13న థియేటర్లలో విడుదలైంది.

ఆడటం కష్టమే..
ఈ మధ్యలో దాదాపు వంద షోలు ప్రసాద్‌ ల్యాబ్‌లోనే పడ్డాయి. దిల్‌రాజు సహా ఎంతోమంది.. ఈ సినిమా యావరేజ్‌, పెద్దగా ఆడదు.. కష్టం! అని డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చివర్లో నాన్న ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. తర్వాత మూవీ హిట్టయిన విషయం మీకు తెలిసిందే! అని విష్ణు చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఢీ మూవీని మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించగా చక్రి సంగీతం అందించాడు.

చదవండి: 90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరో తల్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement