
హీరో సూర్యకు గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేదే లేదు. 'విక్రమ్' మూవీలో రోలెక్స్ అనే అతిథి పాత్ర తప్పితే చెప్పుకోదగ్గ మూవీస్ రావట్లేదు. గత రెండు చిత్రాల్లో 'కంగువ' అట్టర్ ఫ్లాప్ కాగా, గత నెలలో వచ్చిన 'రెట్రో'.. తమిళంలో మాత్రం కలెక్షన్ సాధించింది. ఇది తప్పితే హిట్ కాదు. ఇలా కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సూర్య.. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి మూవీపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. అలానే టాలీవుడ్పైనే గట్టిగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?)
ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు సూర్య ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ క్రమంలో గతంలో కమిట్ అయిన 'వడివాసల్' అనే చిత్రాన్ని పక్కనబెట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. తమిళంలో స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్.. సూర్యతో ఈ సినిమా తీయాలని అనుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ అలా సైడ్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇంకా పూర్తిస్థాయిలో సెట్ కాకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.
మరోవైపు పాన్ ఇండియా ట్రెండ్లో పలువురు టాలీవుడ్ దర్శకులు ముందు వరసలో ఉన్నారు. దీంతో సూర్య ఇప్పుడు ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపై పెట్టాడని తెలుస్తోంది. ఈ రూమర్స్ బట్టి చూస్తుంటే త్వరలో సూర్య.. స్ట్రెయిట్ తెలుగు మూవీస్ మరిన్ని చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ అందుకు తగ్గ సినిమాలు సెట్ కావట్లేదు. సూర్యని ప్రస్తుత తరం తమిళ దర్శకులు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ కారణంతోనే ఇకపై యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని సూర్య అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)