
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుశ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో తెరెకెక్కించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర కమ్ములపై ప్రశంసలు కురిపించారు.
తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి అన్నారు. కానీ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. శేఖర్ చాలా సాప్ట్గా ఉంటారని.. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరని వెల్లడించారు. తాను నమ్మినా సిద్ధాంతాలపైనే సినిమాలు తీస్తారని... అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని కొనియాడారు. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని ఆయన సమాధానమిస్తారు.
ఈ కార్యక్రమంలో కుబేర ట్రైలర్ను కూడా రాజమౌళి విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు.