
రాజ్తరుణ్, రాశీసింగ్.. హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ 'పాంచ్ మినార్'. ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ బ్యానర్పై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ నటన, ఫన్నీ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాటకాలు ఆడుతున్నావా? బ్యాగ్ ఎక్కడ అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా? డబ్బులు సంపాదించడం' అనే కోటేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు కానీ.. కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసుండాలిగా అని బ్రహ్మాజీ చెప్పే డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శ్రీనివాస్రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం పాంచ్ మినార్ టీజర్ చూసేయండి.