‘ధురంధర్, ధురంధర్: ది రివెంజ్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి రణ్వీర్ సింగ్ ఓ నిర్మాత కూడా. ‘స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ’ సిరీస్ ఫేమ్ దర్శకుడు జై మెహతా ఈ సినిమాకు దర్శకుడు.
ఈ చిత్రానికి ‘ప్రళయ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. అలాగే ఇందులోని ఓ ప్రధాన పాత్రలో కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తున్నారని తెలిసింది.


