Rashi Singh
-
త్రీ రోజెస్
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్గా నిలిచిన ఈ సిరీస్కు సీజన్ 2 రాబోతోంది. ఇందులో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్ లీడ్ రోల్స్లో నటించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్గా వ్యవహరిస్తున్న ‘త్రీ రోజెస్’ సీజన్ 2కి రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా, కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు.మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సిరీస్ ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి మోడ్రన్గా మారారు? అనేది గ్లింప్స్లో ఆసక్తి కలిగిస్తోంది. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్ క్యారెక్టర్ గ్లింప్స్కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఆడియన్స్కు సవాల్ విసిరిన హీరో!
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, రాశి సింగ్ జంటగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన హీరో నవీన్ చంద్ర తన అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరారు. బ్లైండ్ స్పాట్ మూవీ పోస్టర్లోనే ఓ క్లూ ఉందని.. అది కనిపెట్టిన వారితో తానే స్వయంగా థియేటర్లో మూవీ చూస్తానని అన్నారు.నవీన్ చంద్ర మాట్లాడుతా..'బ్లైండ్ స్టాట్ పోస్టర్లోనే ఓ క్లూ ఉంది. ఆ క్లూ ఎవరైతే కనిపెట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో డీఎం చేస్తే వారిని వ్యక్తిగతంగా కలుస్తా. అలాగే వారితో కలిసి థియేటర్లో సినిమా చూస్తా. ఈ మూవీపై నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఈ విషయాన్ని నిర్మాత చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు. నేనే వ్యక్తిగతంగా చెబుతున్నా. అంతా కాన్ఫిడెంట్గా ఉన్నా. యాక్టర్ ఫర్మామెన్స్, టెక్నీషియన్స్ వర్క్తో ఈ కథను ఆడియన్స్ను ఎలా మెప్పించాలో రాకేశ్ పనిని చూసి బానిసను అయిపోయా' అని అన్నారు.ఇవాళ విడుదలైన బ్లైండ్ స్పాట్ ట్రైలర్ చూస్తే ఓ అమ్మాయి ఆత్మహత్య చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడద, హర్ష రోషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. #BlindSpot పోస్టర్ లోనే ఒక CLUE ఉంది. దాన్ని కనిపెట్టిన వాళ్ళతో కలిసి నేను సినిమా చూస్తా - #NaveenChandra#Tollywood #MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/hWUHvMiNXp— Telugu FilmNagar (@telugufilmnagar) April 18, 2025 -
రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
రాజ్తరుణ్, రాశీసింగ్.. హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ 'పాంచ్ మినార్'. ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ బ్యానర్పై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ నటన, ఫన్నీ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాటకాలు ఆడుతున్నావా? బ్యాగ్ ఎక్కడ అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా? డబ్బులు సంపాదించడం' అనే కోటేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు కానీ.. కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసుండాలిగా అని బ్రహ్మాజీ చెప్పే డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శ్రీనివాస్రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం పాంచ్ మినార్ టీజర్ చూసేయండి. -
Rashi Singh: తిరుమల మెట్లు ఎక్కిన హీరోయిన్ (ఫోటోలు)
-
గులాబీలా మెరిసిపోతున్న హీరోయిన్ రాశీ సింగ్.. చూస్తే అంతే (ఫొటోలు)