యష్మిపై ప్రేమను దాచేస్తున్న నిఖిల్‌.. కోపంతో తేజను కొట్టిన గంగవ్వ | Bigg Boss 8 Telugu October 25th Full Episode Review And Highlights: OG Clan Won BB Rajyam, Vishnupriya As The New Chief | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Oct 25th Highlights: కెమెరా ముందు మంచోడిలా నిఖిల్‌.. తేజపై చేయి చేసుకున్న గంగవ్వ

Oct 25 2024 11:10 PM | Updated on Oct 26 2024 9:15 AM

Bigg Boss Telugu 8, Oct 25th Full Episode Review: OG Clan Won BB Rajyam

రెండు రోజులుగా కొనసాగుతున్న బీబీ రాజ్యం ఛాలెంజ్‌ ఈరోజుతో పూర్తయింది. రాయల్స్‌(వైల్డ్‌ కార్డ్స్‌) ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్‌(పాత కంటెస్టెంట్లు) రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అదొక హఠాత్పరిణామం.. అన్నట్లుగా విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్‌ 25) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

పొడుపు కథ
బీబీ రాజ్యం చాలెంజ్‌లో భాగంగా మీలో ఎవరు తెలివైనవారు? అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌కు నిఖిల్‌ సంచాలకుడిగా వ్యవహరించాడు. '13 హార్ట్స్‌ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్‌ ఉండవు.. ఏంటి?' అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్‌ కార్డ్స్‌ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులుంటాయి కొన్ని నెలలకు 30రోజులుంటాయి. ఎన్ని నెలలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్‌ 12 నెలలు అని కరెక్ట్‌ ఆన్సర్‌ చెప్పాడు.

బతికుండగానే పాతిపెడతారా?
ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పాతిపెడతారు? అని అడిగాడు. అందుకు నిఖిల్‌, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్ధ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్‌బాస్‌ కౌంటర్‌ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంపుతుందన్నాడు. 

తేజను వాయించిన గంగవ్వ
ముందుగా బజర్‌ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్‌ రిపీట్‌ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్‌ చెప్పొస్తలేదా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరిచెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.

ప్రేరతో గౌతమ్‌ ఫైట్‌
అలా ఈ గేమ్‌లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్‌, న్యాయస్థానం గెలుచుకుంది. అలాగే తన టీమ్‌లో ప్రేరణను కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్‌ టీమ్‌లో మెహబూబ్‌ను చీఫ్‌ కంటెండర్‌ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్‌.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి సముదాయించబోయింది. మా ఇద్దరి మధ్యలోకి రాకు, వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపటికి వాళ్లిద్దరికీ సారీ కూడా చెప్పాడు. 

ప్రేమ ఉంది కాబట్టే అలా..
మరోవైపు నిఖిల్‌, యష్మి మధ్య దోబూచులాట అవుతూనే ఉంది. నీకు, నాకు సెట్టవదు, ఎక్స్‌పెక్టేషన్‌ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్‌ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్‌గా వచ్చి నాపై ఇంట్రస్ట్‌ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్‌ డ్యాన్స్‌ చేస్తే జెలసీ ఫీల్‌ అయ్యాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్‌గా ఉండలేను అంది. అలా ఈర్ష్యపడటం లవ్‌ లాంగ్వేజ్‌ అని ప్రేరణ నిర్ధారించింది.

ఆరుగురు మెగా చీఫ్‌ కంటెండర్స్‌
ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్‌బాస్‌.. ఓజీ, రాయల్స్‌ నుంచి చెరొక కంటెండర్‌ను సెలక్ట్‌ చేయవచ్చన్నాడు. దీంతో విష్ణుప్రియ, తేజను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్‌, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్‌గా ఎన్నుకునే బాధ్యతను హౌస్‌మేట్స్‌పై వేశాడు. మెగా చీఫ్‌కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు.

కొత్త చీఫ్‌గా విష్ణుప్రియ
అలా మొదటగా మెహబూబ్‌.. ప్రేరణను తప్పించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్‌.. రోహిణిని, అవినాష్‌.. పృథ్వీని అవుట్‌ చేశారు. చివరగా గౌతమ్‌.. నిఖిల్‌ను అవుట్‌ చేస్తూ విష్ణుప్రియను చీఫ్‌గా గెలిపించాడు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్‌లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.40,16,000కు చేరింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement