నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.. ఏడ్చేసిన నిఖిల్‌ | Bigg Boss Telugu 8: Nikhil, Yashmi Clash During Panipat Yuddham Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఫ్రెండ్స్‌ మధ్య యుద్ధం.. కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్‌

Oct 30 2024 2:39 PM | Updated on Oct 30 2024 3:05 PM

Bigg Boss Telugu 8: Nikhil, Yashmi Clash During Panipat Yuddham Task

బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌.. కొట్లాటలకు దారి చూపింది. ఫ్రెండ్స్‌ అని కూడా చూడకుండా నిఖిల్‌.. యష్మి, ప్రేరణను పక్కకు లాగేశాడు. వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా వాళ్లను విసిరేస్తూ అరాచకం సృష్టించాడు. అమ్మాయిలతో ఇలాగేనా ప్రవర్తించేదని గౌతమ్‌ నిలదీయగా అతడితో గొడవకు దిగాడు. ఇంత గొడవ జరిగిన టాస్క్‌ పేరు పానీపట్టు యుద్ధం. ఈ యుద్ధం నేటి ఎపిసోడ్‌లోనూ ఇంకా కొనసాగనుంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్‌ చేశారు.

నిఖిల్‌ను తప్పుపట్టిన యష్మి
ప్రోమో ప్రకారం గేమ్‌ చివర్లో కేవలం ఎల్లో, గ్రీన్‌ టీమ్స్‌ మాత్రమే ఉన్నాయి. వీళ్లు నీటిని ట్యాంకులో నుంచి పోకుండా ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మరోవైపు నిఖిల్‌, యష్మి ఇంకా గొడవపడుతూనే ఉన్నారు. సంచాలకుడికి గౌరవం ఇవ్వలేదని యష్మి నిఖిల్‌ను తప్పుపట్టింది. గేమ్‌లో అంత శక్తి వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అందుకు నిఖిల్‌.. నా శక్తి వాడుంటే మీరు వాటర్‌ ట్యాంక్‌ దగ్గర ఉండేవాళ్లు కాదని బదులిచ్చాడు.

అవసరం లేదు
తర్వాత నిఖిల్‌ కన్నీళ్లు పెట్టుకోవడంతో యష్మి ఓదార్చేందుకు ప్రయత్నించింది. అయితే తన దగ్గరకు రావద్దని నిఖిల్‌ అనడంతో ఒక ఫ్రెండ్‌గా వచ్చానని యష్మి చెప్పింది. అయినా అవసరం లేదని అతడు కరాఖండిగా చెప్పేశాడు. తనకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement