
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నామని ట్రాన్స్కో ఏడీఈ మోహన్బాబు, ఏఈ జావేద్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు తదితర కరెంట్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.