మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడిని పట్టుకుంటాం | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడిని పట్టుకుంటాం

Sep 24 2024 1:12 AM | Updated on Sep 24 2024 1:27 PM

-

హోంమంత్రి జీ పరమేశ్వర్‌

దొడ్డబళ్లాపురం: బెంగళూరు వయ్యాలికావల్‌లోని బసప్ప గార్డెన్‌లో జరిగిన మహాలక్ష్మి హత్య కేసులో కీలక సమాచారం లభించిందని, త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్‌ తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎటువంటి సమాచారం ఇవ్వలేనన్నారు. నిందితులు ఎంతమంది అనేది స్పష్టత రాలేదని అయితే త్వరలో అరెస్టు చేస్తామన్నారు. మరోవైపు పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

వాసవి దేవాలయం క్యాషియర్‌ ఇంట్లో చోరీ
వాసవి దేవాలయం క్యాషియర్‌ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని వాసవి దేవాలయం ఖజాంచి అయిన వేణుగోపాల్‌ ఇంట్లో చోరీ జరిగింది. వేణుగోపాల్‌ ఆదివారం ఆర్యవైశ్య సంఘం కార్యక్రమం నిమిత్తం చెన్నపట్టణకు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో జొరబడ్డ దొంగలు దేవాలయానికి సంబంధించిన 4 కేజీల బంగారు, వెండి ఆభరణాలు దోచుకున్నారు. వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement