రోజుకు 300 కూలీ చేసుకునే నాకు 3 కోట్ల జీఎస్‌టీ నోటీసా?! | Woman MGNREGA worker in Tamil Nadu gets Rs 2.79 crore GST notice | Sakshi
Sakshi News home page

రోజుకు 300 కూలీ చేసుకునే నాకు 3 కోట్ల జీఎస్‌టీ నోటీసా?!

Jul 30 2026 11:23 AM | Updated on Jul 30 2026 12:10 PM

Woman MGNREGA worker in Tamil Nadu gets Rs 2.79 crore GST notice

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని పుదూరు పడవేట్టమ్మన్‌ ఆలయ వీధికి చెందిన రుక్మిణి అనే వృద్ధురాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కూలీ పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది.

మంగళవారం నాడు ఆమె సందకోడియూరులోని తన బ్యాంకు ఖాతా నుంచి ఉపాధి హామీ కూలీ డబ్బులను డ్రా చేసుకోవడానికి వెళ్లింది. అయితే, అక్కడ ఆమెకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసింది. ఆంబూరులోని ఆదాయపు పన్నుల (Income Tax) శాఖ కార్యాలయం నుంచి ఆమె పేరిట ఒక నోటీసు వచ్చింది.

ఆ నోటీసులో.. ఆమె "ఆర్‌ఎం ట్రేడర్స్" (RM Traders) అనే వ్యాపార సంస్థను నడుపుతున్నారని, దానికి సంబంధించి రూ. 2.79 కోట్ల మేర జీఎస్‌టీ (GST) చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇప్పటికే ఈ విషయమై సంబంధిత బ్యాంకుకు సూచనలు పంపామని, అందువల్ల ఆమె బ్యాంకు ఖాతాను పూర్తిగా సీజ్ (Freeze) చేసినట్లు అధికారుల నుంచి సమాచారం ఇచ్చారు.

రెక్కాడితే గానీ డొక్కాడని పేదరికంలో ఉన్న తనకు కోట్లలో పన్ను బకాయిలు ఉన్నాయని, ఖాతా సీజ్ చేశారని తెలిసి ఆ వృద్ధురాలు అవాక్కై కన్నీరు మున్నీరైంది. తన వివరాలను, పత్రాలను ఎవరో దుర్వినియోగం చేసి ఈ మోసానికి పాల్పడి ఉంటారని భావిస్తూ, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం పోరాటం చేస్తానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement