ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా | Russia launches missile and drone attack on Kyiv | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా

May 26 2025 4:38 AM | Updated on May 26 2025 4:38 AM

Russia launches missile and drone attack on Kyiv

298 డ్రోన్లు, 69 క్షిపణులతో దాడి

12 మంది మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు 

కీవ్‌: రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలే లక్ష్యంగా శనివారం రాత్రి చేపట్టిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం క్షతగాత్రులయ్యారు. మొత్తం 69 క్షిపణులు, 298 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పేర్కొంది. ఇరాన్‌ డిజైన్‌ చేసిన షహీద్‌ రకం డ్రోన్లు కూడా ఇందులో ఉన్నాయంది.

 మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఒకే రాత్రిలో రష్యా ఇంత భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారని తెలిపింది. శుక్రవారం మాదిరిగానే శనివారం రాత్రంతా కీవ్‌ వాసులు కంటిపై కునుకు లేకుండా గడిపారు. సైరన్‌ మోతలు, పేలుళ్లతో రాజధాని దద్దరిల్లింది. క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడి నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో మంటలు చెలరేగాయి. 

కీవ్‌లో అత్యధికంగా నలుగురు మరణించగా, 16 మంది గాయపడ్డారని నగర భద్రతా విభాగం తెలిపింది. తర్వాత, జిటోమిర్‌ ప్రాంతంలో ముగ్గురు బాలలు సహా 12 మంది క్షతగాత్రులయ్యారు. సుమీ, మైకోలైవ్, ఖ్మెల్నిట్‌స్కీ, చరి్నహివ్, ఒడెసా, టెర్నోపిల్, పొల్టావా, నీప్రో, చెర్కసీ ప్రాంతాలపైనా దాడులు జరిగాయి. కీవ్‌ శివారులోని మర్ఖాలివ్‌స్కాలో పలు నివాసాలు మంటల్లో కాలిబుగ్గయ్యాయి. దాడుల అనంతరం మరో గ్రామం మొత్తం పొగలు, మంటలతో నిండిపోయింది. 

ఇక్కడ చోటుచేసుకున్న విధ్వంసం మరియుపోల్, బాఖ్ముత్‌లను తలపించిందని స్థానికుడొకరు పేర్కొన్నారు. రష్యా క్షిపణులు, డ్రోన్లతో 30కి పైగా నగరాలు, గ్రామాల్లో విధ్వంసం జరిగిందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా ఉద్దేశ పూర్వకంగా సామాన్యులపై దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఆంక్షలు విధించడం వంటి తీవ్రమైన ఒత్తిడి తేకుండా రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేయలేమన్నారు. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌ శనివారం రాత్రి ప్రయోగించిన 110 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

మూడో విడత ఖైదీల మార్పిడి 
రష్యా, ఉక్రెయిన్‌ అధికారుల మధ్య మూడో విడత యుద్ధ ఖైదీల మారి్పడి కొనసాగింది. ఒకవైపు భీకర దాడులు కొనసాగుతుండగానే ఆదివారం మరో 303 మంది ఖైదీలను ఇచి్చపుచ్చుకున్నామని ఇరుదేశాలు ప్రకటించాయి. తుర్కియేలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి విడతలో శుక్రవారం 390 మందిని, శనివారం మరో 307 మందిని పరస్పరం మార్చుకోవడం తెల్సిందే. వీరిలో వివిధ విభాగాలకు చెందిన సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు. మూడేళ్లలో మార్చుకున్న మొత్తం యుద్ధ ఖైదీల కంటే ఈ మూడు రోజుల్లో పరస్పరం అప్పగించుకున్న యుద్ధ ఖైదీల సంఖ్యే ఎక్కువని సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement