
ఖైరతాబాద్: మహాగణపతికి భారీ కండువా, జంధ్యం, గరిక మాలతో పాటు దేవతామూర్తులకు సమర్పించే పట్టు వస్త్రాలకు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు శనివారం పూజలు నిర్వహించారు. శ్రీ దశమహా విద్యా గణపతిగా కొలువుదీరిన మహాగణపతికి సోమవారం వినాయక చవితి రోజున ఉదయం 7 గంటలకు 75 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను సమర్పిస్తున్నట్లు అధ్యక్షుడు కడారి శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు గుర్రం కొండయ్య తెలిపారు. మహాగణపతికి ఇరువైపులా కొలువుదీరిన వీరభద్ర స్వామి, నరసింహస్వామి, సరస్వతిదేవి, వారాహి దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.