సుభాష్నగర్: దూలపల్లి ప్రధాన రహదారి విస్తరణలో అధికారుల పర్యవేక్షణ లోపంతో సంబంధిత కాంట్రాక్టర్ అలసత్వం వహించారు. రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు నీటితో తడపాల్సి ఉంటుంది. సంబంధిత కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో వాహనాలు రాకపోకలు సాగించినప్పుడు ఎగిసిపడుతున్న దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్న విషయమై సోమవారం ‘దారంతా దుమ్ము‘ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ఫొటో కథనానికి అధికారులు స్పందించారు. ఉదయం నుంచీ రోడ్డుపై దుమ్ము ధూళి రాకుండా నీళ్లు చల్లారు.


