భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య | woman suicide in karnataka | Sakshi
Sakshi News home page

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య

Jul 30 2024 7:00 AM | Updated on Jul 30 2024 7:00 AM

woman suicide in karnataka

యశవంతపుర: భర్త వేధింపులను తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం బెంగళూరు బ్యాడరహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. ఆంధ్రహళ్లికి చెందిన మానస (25)కు ఆరేళ్ల క్రితం దిలీప్‌తో పెళ్లి కాగా, వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఏడాదిన్నరగా దిలీప్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.

 దీనిపై ఇంట్లో రోజూ గొడవ జరిగేది. దీనికి తోడు దిలీప్‌ మానసను వేధించేవాడు. దీంతో విరక్తి చెందిన ఆమె సెల్ఫీ వీడియో తీసుకుని, ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బ్యాడరహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దిలీప్‌ని అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement