నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత | Rayapati Ranga Rao comments on Lokesh | Sakshi
Sakshi News home page

నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత

Jan 15 2024 4:57 AM | Updated on Jan 15 2024 4:57 AM

Rayapati Ranga Rao comments on Lokesh - Sakshi

నగరంపాలెం: తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల  చందాలు  వసూలు చేసిందని, దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశానని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలిపారు. గుంటూరు లక్ష్మీపురంలోని నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 13న గుంటూరు రీజినల్‌ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారన్నారు. వైజాగ్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని, లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు.

ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే అందుకు నారా లోకేశ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.    కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి కొత్తకాదని, అందులో భాగంగానే  రాయపాటి శైలజతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్‌ ఎక్కడా గెలవడని జ్యోస్యం చెప్పారు. యువగళానికి ఒక్క రోజు కూడా తాను వెళ్ళలేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలిచి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement