
ప్రియుడిని మరిచిపోలేక వివాహిత ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: ప్రేమికుడిని మరిచిపోలేని ఓ వివాహిత మనస్తాపంతో భనవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. ఎంఎన్రెడ్డి నగర్లో నివాసముంటున్న ఓ వివాహిత (25)కి పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించింది.
ఈ నేపథ్యంలో ప్రియుడిని మరిచిపోలేక శుక్రవారం రాత్రి తాము నివాసముంటున్న భవనం 5వ అంతస్తు నుంచి ఆమె కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నారు.