Hyderabad: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య | Married woman suicide in hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య

Jan 10 2024 7:32 AM | Updated on Jan 10 2024 7:32 AM

Married woman suicide in hyderabad - Sakshi

హైదరాబాద్: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధూల్‌పేట ఆరంఘర్‌కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళ్‌హాట్‌ ఎస్‌ఐ.సాయికృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహింపురాకు చెందిన అమన్‌కుమార్‌ సింగ్, ఆరంఘర్‌ కాలనీకి చెందిన అస్మితసింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

వీరికి ఇద్దరు కుమారులు. అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల 26న బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక అస్మిత డిఫ్రెషన్‌కు లోనైంది. మంగళవారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను కిందకు దించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళ్‌హాట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement