Hyderabad: మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | Hyderabad: Woman software engineer commits suicide | Sakshi
Sakshi News home page

Hyderabad: మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Mar 6 2024 8:18 AM | Updated on Mar 6 2024 10:14 AM

Female software engineer commits suicide - Sakshi

గచ్చిబౌలి: మరి కొద్ది గంటల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ జరగాల్సి ఉంది. కాబోయే భర్త మాట్లాడి వెళ్లి కొద్ది సేపటికే ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాను ప్రసాద్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, గొసుకులపల్లికి చెందిన ముద్దం విద్యశ్రీ(23) కొత్తగూడలోని పీజీ హస్టల్‌లో ఉంటూ  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

సోమవారం సాయంత్రం  హస్టల్‌లోని బాత్‌ రూమ్‌కు వెళ్లిన ఆమె బయటికు రాకపోవడంతో రూమ్‌మేట్స్‌ తలుపులు తెరిచి చూడగా. టవల్‌తో షవర్‌ రాడ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వారు ఆమె సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కాగా ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంపిణీ చేసి షాపింగ్‌ పూర్తి చేసింది. బుధవారం ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ జరగాల్సి ఉంది. ఆమెకు కాబోయే భర్త హస్టల్‌ వద్దకు మాట్లాడి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement